మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఖిలాడీ, వాల్తేరు వీరయ్య లాంటివి హిందీ డబ్బింగ్ జరుపుకున్నప్పటికీ సరైన రీతిలో నార్త్ ఆడియన్స్ కి చేరకపోవడంతో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అందుకే ఈసారి స్వయంగా తనే రంగంలోకి దిగాడు. ట్రైలర్ లాంచ్ ముందు హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ప్లాన్ చేసి జాతీయ మీడియాని టార్గెట్ చేసుకున్నాడు. ఈ విషయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చొరవని తక్కువ చేసి చూడలేం. ఎంత స్టార్ డం ఉన్నా రవితేజ స్టామినా అక్కడి జనాలకు అంతగా అవగాహన లేదు.
సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని పసిగట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒరిజినల్ రౌడీ రాథోడ్, కిక్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేసిన హీరో ఇతనేనని పరిచయం చేయడం ఆకట్టుకుంది. విక్రమార్కుడులో రవితేజ టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ముందు రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ సరితూగలేదనే మాట వాస్తవం. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ చేసినా కిక్ లో మాస్ రాజా చూపించిన ఎనర్జీ ముందు అది సాటిరాదు. వీటి అనువాదాలు ఎక్కువ మంది చూడకపోవడంతో ఈ పాయింట్ ఇప్పటిదాకా గుర్తింపుకు నోచుకోలేదు. అనుపమ్ ఖేర్ సరైన రీతిలో పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చి క్లారిటీ వచ్చేలా చేశారు.
అక్టోబర్ 20న విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావుకు పోటీ పరంగా విజయ్ లియో, టైగర్ శ్రోఫ్ గణపథ్ తీవ్రమైన పోటీ ఇచ్చేలా ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరిని తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇబ్బంది లేదు కానీ మిగిలిన ఇద్దరినీ కాచుకోవాల్సిన ఒత్తిడి రవితేజ మీద ఉంటుంది. ట్రైలర్ లో విజువల్స్ చూశాక అందరికీ నమ్మకం వచ్చేసింది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబిన్ హుడ్ రేంజ్ పీరియాడిక్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇచ్చింది. అంచనాలను ఏ మాత్రం నిలబెట్టుకున్నా చాలు రవితేజకు నేషనల్ లెవెల్ లో మార్కెట్ ఏర్పడుతుంది. అది తర్వాత వచ్చే ఈగల్ కు ఉపయోగపడుతుంది.
This post was last modified on October 4, 2023 2:05 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…