మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఖిలాడీ, వాల్తేరు వీరయ్య లాంటివి హిందీ డబ్బింగ్ జరుపుకున్నప్పటికీ సరైన రీతిలో నార్త్ ఆడియన్స్ కి చేరకపోవడంతో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అందుకే ఈసారి స్వయంగా తనే రంగంలోకి దిగాడు. ట్రైలర్ లాంచ్ ముందు హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ప్లాన్ చేసి జాతీయ మీడియాని టార్గెట్ చేసుకున్నాడు. ఈ విషయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చొరవని తక్కువ చేసి చూడలేం. ఎంత స్టార్ డం ఉన్నా రవితేజ స్టామినా అక్కడి జనాలకు అంతగా అవగాహన లేదు.
సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని పసిగట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒరిజినల్ రౌడీ రాథోడ్, కిక్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేసిన హీరో ఇతనేనని పరిచయం చేయడం ఆకట్టుకుంది. విక్రమార్కుడులో రవితేజ టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ముందు రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ సరితూగలేదనే మాట వాస్తవం. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ చేసినా కిక్ లో మాస్ రాజా చూపించిన ఎనర్జీ ముందు అది సాటిరాదు. వీటి అనువాదాలు ఎక్కువ మంది చూడకపోవడంతో ఈ పాయింట్ ఇప్పటిదాకా గుర్తింపుకు నోచుకోలేదు. అనుపమ్ ఖేర్ సరైన రీతిలో పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చి క్లారిటీ వచ్చేలా చేశారు.
అక్టోబర్ 20న విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావుకు పోటీ పరంగా విజయ్ లియో, టైగర్ శ్రోఫ్ గణపథ్ తీవ్రమైన పోటీ ఇచ్చేలా ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరిని తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇబ్బంది లేదు కానీ మిగిలిన ఇద్దరినీ కాచుకోవాల్సిన ఒత్తిడి రవితేజ మీద ఉంటుంది. ట్రైలర్ లో విజువల్స్ చూశాక అందరికీ నమ్మకం వచ్చేసింది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబిన్ హుడ్ రేంజ్ పీరియాడిక్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇచ్చింది. అంచనాలను ఏ మాత్రం నిలబెట్టుకున్నా చాలు రవితేజకు నేషనల్ లెవెల్ లో మార్కెట్ ఏర్పడుతుంది. అది తర్వాత వచ్చే ఈగల్ కు ఉపయోగపడుతుంది.
This post was last modified on October 4, 2023 2:05 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…