మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఖిలాడీ, వాల్తేరు వీరయ్య లాంటివి హిందీ డబ్బింగ్ జరుపుకున్నప్పటికీ సరైన రీతిలో నార్త్ ఆడియన్స్ కి చేరకపోవడంతో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అందుకే ఈసారి స్వయంగా తనే రంగంలోకి దిగాడు. ట్రైలర్ లాంచ్ ముందు హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ప్లాన్ చేసి జాతీయ మీడియాని టార్గెట్ చేసుకున్నాడు. ఈ విషయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చొరవని తక్కువ చేసి చూడలేం. ఎంత స్టార్ డం ఉన్నా రవితేజ స్టామినా అక్కడి జనాలకు అంతగా అవగాహన లేదు.
సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని పసిగట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒరిజినల్ రౌడీ రాథోడ్, కిక్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేసిన హీరో ఇతనేనని పరిచయం చేయడం ఆకట్టుకుంది. విక్రమార్కుడులో రవితేజ టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ముందు రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ సరితూగలేదనే మాట వాస్తవం. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ చేసినా కిక్ లో మాస్ రాజా చూపించిన ఎనర్జీ ముందు అది సాటిరాదు. వీటి అనువాదాలు ఎక్కువ మంది చూడకపోవడంతో ఈ పాయింట్ ఇప్పటిదాకా గుర్తింపుకు నోచుకోలేదు. అనుపమ్ ఖేర్ సరైన రీతిలో పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చి క్లారిటీ వచ్చేలా చేశారు.
అక్టోబర్ 20న విడుదల కాబోతున్న టైగర్ నాగేశ్వరరావుకు పోటీ పరంగా విజయ్ లియో, టైగర్ శ్రోఫ్ గణపథ్ తీవ్రమైన పోటీ ఇచ్చేలా ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరిని తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇబ్బంది లేదు కానీ మిగిలిన ఇద్దరినీ కాచుకోవాల్సిన ఒత్తిడి రవితేజ మీద ఉంటుంది. ట్రైలర్ లో విజువల్స్ చూశాక అందరికీ నమ్మకం వచ్చేసింది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రాబిన్ హుడ్ రేంజ్ పీరియాడిక్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇచ్చింది. అంచనాలను ఏ మాత్రం నిలబెట్టుకున్నా చాలు రవితేజకు నేషనల్ లెవెల్ లో మార్కెట్ ఏర్పడుతుంది. అది తర్వాత వచ్చే ఈగల్ కు ఉపయోగపడుతుంది.
This post was last modified on October 4, 2023 2:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…