బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్ మామూలుగానే సినిమాలు చేయడంలో డెడ్ స్లో. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మే ఆమిర్.. మూణ్నాలుగేళ్లకు గానీ ఒక సినిమా చేయడు. 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వచ్చాక ఆమిర్ చేసిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ నాలుగేళ్ల గ్యాప్లో రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా తన కొత్త సినిమాను ప్రకటించనేలేదు. దాని కోసం కసరత్తు చేస్తున్న సంకేతాలు కూడా కనిపించలేదు.
ఇంకెప్పుడు కొత్త చిత్రం అనౌన్స్ చేస్తాడా అని అభిమానులు చూస్తుంటే.. ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆమిర్ కొత్త సినిమా చేయబోతున్నాడు. కానీ అది హీరోగా కాదు.. నిర్మాతగా. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ‘లాహోర్, 1947’ సినిమాను ప్రకటించారు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటించబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఆమిర్ ఖాన్ నుంచి అభిమానులు ఆశిస్తున్నది ఒకటైతే.. అతను ప్రకటించింది ఇంకోటి. సొంత బేనర్లో వేరే చిత్రాలు నిర్మిస్తే ఓకే కానీ.. తను నటిస్తూ ఆ పని కూడా చేయాల్సింది. కానీ ఆమిర్ ఖాన్ నటనను పక్కన పెట్టేసి నిర్మాణం మీదే దృష్టిపెట్టడం అభిమానులకు రుచించడం లేదు. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ డిజాస్టర్ కావడం ఆమిర్ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నది స్పష్టం.
ఇది అందరు హీరోలకూ జరిగేదే. కానీ ఆమిర్ ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకుని నటన నుంచి విరామం తీసుకోవడం.. మళ్లీ ఎప్పుడు ముఖానికి రంగేసుకునేది స్పష్టత లేకపోవడం అభిమానులకు వేదన కలిగిస్తోంది. ఆమిర్ లాంటి నటుడు ఇలా నటనకు దూరమైతే తట్టుకోలేమని.. ఇప్పటికి తీసుకున్న గ్యాప్ చాలని.. వీలైనంత త్వరగా కొత్త కథను ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on October 8, 2023 4:31 pm
కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…
స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా…
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…