బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్ మామూలుగానే సినిమాలు చేయడంలో డెడ్ స్లో. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మే ఆమిర్.. మూణ్నాలుగేళ్లకు గానీ ఒక సినిమా చేయడు. 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వచ్చాక ఆమిర్ చేసిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ నాలుగేళ్ల గ్యాప్లో రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా తన కొత్త సినిమాను ప్రకటించనేలేదు. దాని కోసం కసరత్తు చేస్తున్న సంకేతాలు కూడా కనిపించలేదు.
ఇంకెప్పుడు కొత్త చిత్రం అనౌన్స్ చేస్తాడా అని అభిమానులు చూస్తుంటే.. ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆమిర్ కొత్త సినిమా చేయబోతున్నాడు. కానీ అది హీరోగా కాదు.. నిర్మాతగా. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ‘లాహోర్, 1947’ సినిమాను ప్రకటించారు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటించబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఆమిర్ ఖాన్ నుంచి అభిమానులు ఆశిస్తున్నది ఒకటైతే.. అతను ప్రకటించింది ఇంకోటి. సొంత బేనర్లో వేరే చిత్రాలు నిర్మిస్తే ఓకే కానీ.. తను నటిస్తూ ఆ పని కూడా చేయాల్సింది. కానీ ఆమిర్ ఖాన్ నటనను పక్కన పెట్టేసి నిర్మాణం మీదే దృష్టిపెట్టడం అభిమానులకు రుచించడం లేదు. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ డిజాస్టర్ కావడం ఆమిర్ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నది స్పష్టం.
ఇది అందరు హీరోలకూ జరిగేదే. కానీ ఆమిర్ ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకుని నటన నుంచి విరామం తీసుకోవడం.. మళ్లీ ఎప్పుడు ముఖానికి రంగేసుకునేది స్పష్టత లేకపోవడం అభిమానులకు వేదన కలిగిస్తోంది. ఆమిర్ లాంటి నటుడు ఇలా నటనకు దూరమైతే తట్టుకోలేమని.. ఇప్పటికి తీసుకున్న గ్యాప్ చాలని.. వీలైనంత త్వరగా కొత్త కథను ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on October 8, 2023 4:31 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…