బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్ మామూలుగానే సినిమాలు చేయడంలో డెడ్ స్లో. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని నమ్మే ఆమిర్.. మూణ్నాలుగేళ్లకు గానీ ఒక సినిమా చేయడు. 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వచ్చాక ఆమిర్ చేసిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ నాలుగేళ్ల గ్యాప్లో రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా తన కొత్త సినిమాను ప్రకటించనేలేదు. దాని కోసం కసరత్తు చేస్తున్న సంకేతాలు కూడా కనిపించలేదు.
ఇంకెప్పుడు కొత్త చిత్రం అనౌన్స్ చేస్తాడా అని అభిమానులు చూస్తుంటే.. ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆమిర్ కొత్త సినిమా చేయబోతున్నాడు. కానీ అది హీరోగా కాదు.. నిర్మాతగా. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ‘లాహోర్, 1947’ సినిమాను ప్రకటించారు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటించబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఆమిర్ ఖాన్ నుంచి అభిమానులు ఆశిస్తున్నది ఒకటైతే.. అతను ప్రకటించింది ఇంకోటి. సొంత బేనర్లో వేరే చిత్రాలు నిర్మిస్తే ఓకే కానీ.. తను నటిస్తూ ఆ పని కూడా చేయాల్సింది. కానీ ఆమిర్ ఖాన్ నటనను పక్కన పెట్టేసి నిర్మాణం మీదే దృష్టిపెట్టడం అభిమానులకు రుచించడం లేదు. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ‘లాల్ సింగ్ చడ్డా’ భారీ డిజాస్టర్ కావడం ఆమిర్ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నది స్పష్టం.
ఇది అందరు హీరోలకూ జరిగేదే. కానీ ఆమిర్ ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకుని నటన నుంచి విరామం తీసుకోవడం.. మళ్లీ ఎప్పుడు ముఖానికి రంగేసుకునేది స్పష్టత లేకపోవడం అభిమానులకు వేదన కలిగిస్తోంది. ఆమిర్ లాంటి నటుడు ఇలా నటనకు దూరమైతే తట్టుకోలేమని.. ఇప్పటికి తీసుకున్న గ్యాప్ చాలని.. వీలైనంత త్వరగా కొత్త కథను ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…