టాలీవుడ్లో ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్ అయిన శ్రీలీల గురించి ఇటీవల ఒక రూమర్ జోరుగా వినిపించింది. ఒకేసారి చాలా సినిమాలు ఒప్పేసుకోవడంతో.. అన్నింటికీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె ఒకట్రెండు సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నదే ఆ రూమర్. ఆమె వైదొలిగిన ప్రాజెక్టుల్లో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా సితార ఎంటర్టైట్మెంట్స్ వాళ్లు నిర్మిస్తున్న చిత్రంలో ఆమె లేదని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలోకి రష్మిక మందన్నా వచ్చేసిందని కూడా అన్నారు. అందరూ నిర్మాణ సంస్థ దీని గురించి స్పందించకపోవడంతో ఈ న్యూస్ పక్కా అని… మళ్లీ విజయ్-రష్మిక జోడీని చూడబోతున్నామని అంరదూ ఫిక్సయిపోయారు. కానీ ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు నిర్మాత నాగవంశీ.
విజయ్తో తాము నిర్మిస్తున్న సినిమాలో శ్రీలీలే హీరోయిన్ అని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో తేల్చేశాడు. శ్రీలీల తమ చిత్రం నుంచి తప్పుకుందన్న రూమర్ ఎవరు పుట్టించారో.. ఎందుకు పుట్టించారో తెలియదని.. తాము మాత్రం కాస్ట్ విషయంలో ఎలాంటి మార్పూ చేయట్లేదని నాగవంశీ స్పష్టం చేశాడు. శ్రీలీలే తమ సినిమాలో హీరోయిన్ అని.. అదే ఫైనల్ అని అతనన్నాడు.
ఎప్పుడో మొదలు కావాల్సిన చిత్రం ‘లైగర్’ డిలే వల్ల.. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో పరశురామ్తో సినిమాను విజయ్ ముందు ఆరంభించడం వల్ల ఆలస్యం అయిందని అతను తెలిపాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కుతున్నట్లు నాగవంశీ వెల్లడించడం విశేషం. విజయ్ మీద వంద కోట్ల బడ్జెట్ కూడా ఎక్కువ అనుకుంటే.. అంతకుమించి ఖర్చు పెడుతున్నట్లు నాగవంశీ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా దర్శకుడు గౌతమ్ మీద నమ్మకంతో పెడుతున్న బడ్జెట్టే అని.. ఈ సినిమా క్లిక్ అయితే మామూలుగా ఆడదని.. లేదంటే ఏం జరుగుతుందో చెప్పలేమని నాగవంశీ అన్నాడు.
This post was last modified on October 3, 2023 3:17 pm
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…