టాలీవుడ్లో ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్ అయిన శ్రీలీల గురించి ఇటీవల ఒక రూమర్ జోరుగా వినిపించింది. ఒకేసారి చాలా సినిమాలు ఒప్పేసుకోవడంతో.. అన్నింటికీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె ఒకట్రెండు సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నదే ఆ రూమర్. ఆమె వైదొలిగిన ప్రాజెక్టుల్లో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా సితార ఎంటర్టైట్మెంట్స్ వాళ్లు నిర్మిస్తున్న చిత్రంలో ఆమె లేదని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలోకి రష్మిక మందన్నా వచ్చేసిందని కూడా అన్నారు. అందరూ నిర్మాణ సంస్థ దీని గురించి స్పందించకపోవడంతో ఈ న్యూస్ పక్కా అని… మళ్లీ విజయ్-రష్మిక జోడీని చూడబోతున్నామని అంరదూ ఫిక్సయిపోయారు. కానీ ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు నిర్మాత నాగవంశీ.
విజయ్తో తాము నిర్మిస్తున్న సినిమాలో శ్రీలీలే హీరోయిన్ అని నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో తేల్చేశాడు. శ్రీలీల తమ చిత్రం నుంచి తప్పుకుందన్న రూమర్ ఎవరు పుట్టించారో.. ఎందుకు పుట్టించారో తెలియదని.. తాము మాత్రం కాస్ట్ విషయంలో ఎలాంటి మార్పూ చేయట్లేదని నాగవంశీ స్పష్టం చేశాడు. శ్రీలీలే తమ సినిమాలో హీరోయిన్ అని.. అదే ఫైనల్ అని అతనన్నాడు.
ఎప్పుడో మొదలు కావాల్సిన చిత్రం ‘లైగర్’ డిలే వల్ల.. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్లో పరశురామ్తో సినిమాను విజయ్ ముందు ఆరంభించడం వల్ల ఆలస్యం అయిందని అతను తెలిపాడు. ఈ సినిమా వంద కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కుతున్నట్లు నాగవంశీ వెల్లడించడం విశేషం. విజయ్ మీద వంద కోట్ల బడ్జెట్ కూడా ఎక్కువ అనుకుంటే.. అంతకుమించి ఖర్చు పెడుతున్నట్లు నాగవంశీ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా దర్శకుడు గౌతమ్ మీద నమ్మకంతో పెడుతున్న బడ్జెట్టే అని.. ఈ సినిమా క్లిక్ అయితే మామూలుగా ఆడదని.. లేదంటే ఏం జరుగుతుందో చెప్పలేమని నాగవంశీ అన్నాడు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…