‘సలార్’ అనే ఆటంబాంబు వచ్చి క్రిస్మస్ సీజన్ మీద పడిపోయింది. దీంతో ఆ సీజన్కు ఆల్రెడీ ఫిక్సయిన సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సలార్’ క్రిస్మస్కు రాబోతోందని ఊహాగానాలు మొదలవగానే.. ఈ మూడు చిత్రాల మేకర్స్ వేరే ఆప్షన్ల మీద దృష్టిసారించారు. ‘సలార్’ డేట్ అధికారికంగా ప్రకటించగానే విక్టరీ వెంకటేష్ మూవీ ‘సైంధవ్’ను 2024 సంక్రాంతికి తీసుకురావాలన్న ఆలోచన చేశారు మేకర్స్.
ఇక రెండు మూడు రోజుల చర్చల తర్వాత వెంకీ అన్నయ్య సురేష్ బాబు ఆమోద ముద్ర వేసేశారు. దీంతో ఈ రోజు ‘సైంధవ్’ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 13న ఈ చిత్రం విడుదల కానున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘నా సామిరంగా’ చిత్రాల సంక్రాంతి రిలీజ్ గురించి అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వాటికి తోడైంది.
వెంకీ సినిమా సంగతి తేలిపోగా.. ఇక నాని, నితిన్ చిత్రాల ముచ్చటే తేలాల్సి ఉంది. ముందు, వెనుక చాలా వరకు వీకెండ్స్ ప్యాక్డ్ అయిపోయి ఉండగా… సరైన డేట్ ఎంచుకోవడం వీటికి అంత తేలిక కాదు. నాని సినిమా ‘హాయ్ నాన్న’కు డిసెంబరు 7ను సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే డిసెంబరు 1న రిలీజ్ కానున్న ‘యానిమల్’కు మంచి టాక్ వస్తే రెండో వారంలోనూ దూకుడు చూపించవచ్చు.
ఎంతైనా అది హిందీ సినిమా, నాని చిత్రం ప్రభావం ప్రధానంగా తెలుగు రాష్ట్రాలోనే కాబట్టి దీనికి ఇక్కడ పెద్దగా సమస్య లేకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఆ డేట్ను ఖరారు చేసే అవకాశాలే ఎక్కువ. ఆ వారానికి విశ్వక్సేన్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా రాబోతోంది. నితిన్ సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ను డిసెంబరు 17న ‘కెప్టెన్ మిల్లర్’తో పాటుగా లేదంటే క్రిస్మస్కు, సంక్రాంతికి మధ్యలో డిసెంబరు 30న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 2, 2023 5:40 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…