ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ షారుఖ్ ఖాన్దే అని చెప్పాలి. ఒక్క ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇవ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. అన్నీ కలిసొస్తే డుంకి మూవీతో ఒకే ఏడాది మూడోసారి వెయ్యి కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. ఈ ఏడాది ఆరంభంలో పఠాన్తో షారుఖ్ ఎలా బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించాడో తెలిసిందే.
దాంతో పోలిస్తే జవాన్కు అంత గొప్ప టాక్ ఏమీ రాలేదు. అయినా సరే.. షారుఖ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించాడు. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత కూడా నిలకడగా వసూళ్లు రాబట్టింది. చూస్తుండగానే వెయ్యి కోట్ల మార్కును కూడా దాటేసింది. ఇందులో కేవలం విదేశీ వసూళ్లు మాత్రమే రూ.360 కోట్లు కావడం గమనార్హం.
ఓ బాలీవుడ్ మూవీ ఓవరాల్ వసూళ్లు రూ.360 కోట్లు వచ్చినా ఆహా ఓహో అని చెప్పుకునే రోజులు ఇవి. కరోనా తర్వాత హిందీ చిత్రాల వసూళ్లు అంతలా పడిపోయాయి. కానీ రీఎంట్రీలో షారుఖ్ సినిమాలు మాత్రం బంపర్ వసూళ్లతో దూసుకెళ్తున్నాయి. ఒక్క అమెరికాలో మాత్రమే జవాన్ 15 మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. గల్ఫ్ కంట్రీస్ సహా పలు దేశాల్లో జవాన్ ప్రభంజనం సృష్టించింది.
ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. నాలుగో వారంలో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. కొత్త సినిమా వ్యాక్సిన్ వార్ దాని ముందు వెలవెలబోతోంది. ఫక్రీ-3 మాత్రమే జవాన్కు పోటీ ఇస్తోంది. ఇక ఇండియా వరకు ఆల్రెడీ ఆల్ టైం హైయెస్ట్ నెట్ వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పిన జవాన్.. ఫుల్ రన్లో ఇండియాలో హిందీ వరకే రూ.600 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. మొత్తంగా ఈ సినిమా రూ.1200 కోట్ల మార్కును అందుకునే అవకాశాలున్నాయి.
This post was last modified on October 1, 2023 10:28 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…