పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 2021లో ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. గత ఏడాది ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేయించాడు. ఈ ఏడాది ‘బ్రో’తో ప్రేక్షకులను పలకరించాడు. ఐతే ఈ మూడూ రీమేక్ మూవీసే కావడంతో అభిమానుల్లో కొంత నిరాశ వ్యక్తమైంది. పవన్ నుంచి వచ్చే స్ట్రెయిట్ మూవీ కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఈ మూడూ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నవే. వీటి రిలీజ్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ‘ఓజీ’ ఈ డిసెంబర్లోనే రిలీజైపోతుందని ఒక దశలో ప్రచారం జరగ్గా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంక్రాంతికి అంటూ చర్చ జరిగింది. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ను ఎన్నికల లోపే రిలీజ్ చేస్తామంటూ నిర్మాత ఎ.ఎం.రత్నం ఊరించాడు.
ఐతే ఈ సినిమాలేవీ అనుకున్న ప్రకారం రిలీజయ్యే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ‘ఓజీ’ షూటింగ్కు కొన్ని నెలల కిందట బ్రేక్ వేసిన పవన్.. మళ్లీ అటు వైపే చూడలేదు. ఈ మధ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షెడ్యూల్ ఒకటి పూర్తి చేశాడు. మళ్లీ ఈ సినిమా షూట్కు ఆయన ఇప్పట్లో అందుబాటులోకి రాడని తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ గురించి పవన్ అస్సలు ఆలోచించే పరిస్థితి లేదు.
ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పవన్ ఇక పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తాడని తెలుస్తోంది. పై మూడు చిత్రాల్లో ఏదీ కూడా వేసవి లోపు రిలీజయ్యే అవకాశమే లేదట. ఎన్నికలు పూర్తయ్యాక కానీ.. విడుదల ఉండదని ఆయా చిత్ర బృందాలకు ఒక క్లారిటీ వచ్చేసినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయ్యాక పవన్ విరామం లేకుండా పని చేసి ఒక్కో సినిమాను పూర్తి చేస్తాడట. వేసవి చివరి నుంచి ఒక్కో సినిమా రిలీజవుతుందని.. వచ్చే ఏడాదే ఈ మూడు చిత్రాలూ రిలీజైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
This post was last modified on October 1, 2023 7:34 pm
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…