కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మనకు పరిచయం తక్కువే కానీ ఇటీవలే వచ్చిన జైలర్ లో క్యామియో ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ఓం, యోగి, గోరింటాకు లాంటి ఎన్నో ఒరిజినల్ వెర్షన్లు కన్నడలో బ్లాక్ బస్టర్స్ అయిన ట్రాక్ రికార్డు ఈయనది. దసరాకి ఘోస్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో మల్టీ లాంగ్వేజెస్ లో ప్లాన్ చేస్తున్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో, గణపథ్ లతో తీవ్రమైన పోటీ ఉన్నా సరే అక్టోబర్ 19 రావడం ఖాయమేనని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇందాకా రెండు నిముషాలు సాగే టీజర్ రిలీజ్ చేశారు.
అతని(శివరాజ్ కుమార్)కి యుద్ధమంటే ఇష్టం. సమాజ స్థాపన కోసం కష్టపడిన వాళ్ళ కన్నా విధ్వంసం చేసినవాళ్లనే జనం గుర్తు పెట్టుకుంటారనే సిద్ధాంతాన్ని నమ్ముతాడు. దానికి అనుగుణంగానే నేర సామ్రాజ్యంలో పెరిగి పెద్దవుతాడు. తుపాకీ పట్టుకుంటే ముందు వెనుకా ఆలోచించకుండా మారణ హోమం సృష్టిస్తాడు. ఏకంగా జైలుని లక్ష్యంగా పెట్టుకుని అక్కడి ఖైదీలతో రణరంగంని తలపిస్తాడు. అసలు ఈ ఘోస్ట్ ఎవరు, నేపథ్యం ఏంటి, పోలీసులకు ఎందుకు కొరకరాని కొయ్యగా మారాడనే ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడమంటున్నారు ఘోస్ట్ టీమ్.
విజువల్స్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అయితే విఎఫెక్స్ వాడి ఆయన్ని కుర్రాడిగా చూపించిన విధానం ఆశ్చర్యపరిచే విధంగా చాలా సహజంగా ఉంది. అనుపమ్ ఖేర్, జయరాం లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఘోస్ట్ లో భాగమయ్యారు. శ్రీని దర్శకత్వం వహించగా అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు. ప్రత్యేకంగా ఇందులో గ్లామర్ పార్ట్, డ్యూయెట్లు, హీరోయిన్ అంటూ ఏవీ లేవు. శాండల్ వుడ్ లో ఈ ఘోస్ట్ మీద కెజిఎఫ్ రేంజ్ లో అంచనాలున్నాయి. మరి ఇతర భాషల్లో భారీ కాంపిటీషన్ మధ్య బజ్ ఎలా సృష్టిస్తారో చూడాలి.
This post was last modified on October 1, 2023 2:50 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…