కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో తనపై భారీగా అంచనాలు పెంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ తర్వాత ముకుంద సినిమాతో అతను నిరాశపరిచాడు. ఇక బ్రహ్మోత్సవం సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. మహేష్ బాబును హీరోగా పెట్టి టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటనదగ్గ సినిమా తీయడంతో అతడి కెరీర్ ఒక్కసారిగా కుదేలైంది.
కొన్నేళ్ల పాటు అతడికి సినిమా ఇవ్వడానికే నిర్మాతలు భయపడ్డారు. మధ్యలో రీమేక్ మూవీ నారప్పను డైరెక్ట్ చేసినా పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాడు. ఐతే ఇప్పుడు శ్రీకాంత్ పెదకాపు సినిమాతో పునరాగమనం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడటానికి ప్రధాన కారణం శ్రీకాంతే. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో సినిమా మీద ప్రేక్షకుల దృష్టిసారించేలా చేశాడు.
కానీ స్కంద, చంద్రముఖి-2 లాంటి మాస్ మూవీస్తో పోటీ పడటం, పేరున్న హీరో లేకపోవడం పెదకాపు చిత్రానికి మైనస్ అయింది. దీనికి తోడు సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో జనాలు తొలి రోజు ఈ సినిమా థియేటర్ల వైపు పెద్దగా చూడలేదు. ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. సినిమా తర్వాత పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఐతే డైరెక్టర్గా శ్రీకాంత్ ఫెయిలైనప్పటికీ.. నటుడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. రావు రమేష్ కొడుకు పాత్రలో అతను ఆద్యంతం ఆకట్టుకున్నాడు.
కాళ్లు పని చేయకపోయినా.. పౌరుషానికి తక్కువ కాని పాత్రలో అతడి నటన.. డైలాగులు ప్రేక్షకుల్లో తన పాత్ర పట్ల ఆసక్తి రేకెత్తిస్తాయి. పతాక సన్నివేశాల్లో కూడా తన పాత్రకు మంచి డైలాగులు రాసుకున్నాడు శ్రీకాంత్. తమిళంలో గౌతమ్ మీనన్, ఎస్.జె.సూర్య లాంటి చాలామంది దర్శకులు నటులుగా మారి బిజీ అయిపోయారు. పెదకాపు రిజల్ట్ చూశాక అతడికి దర్శకుడిగా సినిమాలు రావడం కష్టమే కాబట్టి.. నటుడిగా ట్రై చేస్తే బాగానే క్లిక్ అవుతాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 30, 2023 11:02 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…