కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో తనపై భారీగా అంచనాలు పెంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ తర్వాత ముకుంద సినిమాతో అతను నిరాశపరిచాడు. ఇక బ్రహ్మోత్సవం సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. మహేష్ బాబును హీరోగా పెట్టి టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటనదగ్గ సినిమా తీయడంతో అతడి కెరీర్ ఒక్కసారిగా కుదేలైంది.
కొన్నేళ్ల పాటు అతడికి సినిమా ఇవ్వడానికే నిర్మాతలు భయపడ్డారు. మధ్యలో రీమేక్ మూవీ నారప్పను డైరెక్ట్ చేసినా పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాడు. ఐతే ఇప్పుడు శ్రీకాంత్ పెదకాపు సినిమాతో పునరాగమనం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడటానికి ప్రధాన కారణం శ్రీకాంతే. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో సినిమా మీద ప్రేక్షకుల దృష్టిసారించేలా చేశాడు.
కానీ స్కంద, చంద్రముఖి-2 లాంటి మాస్ మూవీస్తో పోటీ పడటం, పేరున్న హీరో లేకపోవడం పెదకాపు చిత్రానికి మైనస్ అయింది. దీనికి తోడు సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో జనాలు తొలి రోజు ఈ సినిమా థియేటర్ల వైపు పెద్దగా చూడలేదు. ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. సినిమా తర్వాత పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఐతే డైరెక్టర్గా శ్రీకాంత్ ఫెయిలైనప్పటికీ.. నటుడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. రావు రమేష్ కొడుకు పాత్రలో అతను ఆద్యంతం ఆకట్టుకున్నాడు.
కాళ్లు పని చేయకపోయినా.. పౌరుషానికి తక్కువ కాని పాత్రలో అతడి నటన.. డైలాగులు ప్రేక్షకుల్లో తన పాత్ర పట్ల ఆసక్తి రేకెత్తిస్తాయి. పతాక సన్నివేశాల్లో కూడా తన పాత్రకు మంచి డైలాగులు రాసుకున్నాడు శ్రీకాంత్. తమిళంలో గౌతమ్ మీనన్, ఎస్.జె.సూర్య లాంటి చాలామంది దర్శకులు నటులుగా మారి బిజీ అయిపోయారు. పెదకాపు రిజల్ట్ చూశాక అతడికి దర్శకుడిగా సినిమాలు రావడం కష్టమే కాబట్టి.. నటుడిగా ట్రై చేస్తే బాగానే క్లిక్ అవుతాడేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 30, 2023 11:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…