బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి వ్యవహారంలో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ది హత్య అని…ఆ హత్యకు రియా సొంత తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, రియా షుగర్ డాడీ మహేష్ భట్ ప్లాన్ చేశారని సుశాంత్ జిమ్ పార్ట్ నర్ సునీల్ సంచలన ఆరోపణలు చేశాడు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు…దుబాయ్ కు చెందిన ఆయుష్ ఖాన్ అనే ఓ డ్రగ్ డీలర్…సుశాంత్ ను కలిశాడని బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఆ భేటీలో ఏం జరిగిందో విచారణ జరపాలని అన్నారు. ఇక, సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ…తాజాగా రియా, ఇంద్రజిత్ లకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ రోజు ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో సీబీఐ ప్రత్యేక బృందం సీన్ రీ క్రియేట్ చేసింది. ఆ ఫ్లాట్ సీలింగ్ ఎత్తు..సుశాంత్ ఎత్తు…వంటి ఆధారాలు సేకరిస్తున్నారు. సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య ఎన్ని గంటలకు జరిగిందన్న దానిపై స్పష్టత లేకపోవడం, సుశాంత్ నివాసం దగ్గర్లోనే 2 హాస్పిటల్స్ ఉన్నా 5 కిలోమీటర్ల దూరంలోని కూపర్ హాస్పిటల్కే సుశాంత్ డెడ్బాడీని ఎందుకు తరలించారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ డిప్రెషన్ కు చికిత్స తీసుకున్న హిందుజా ఆసుపత్రిని సీబీఐ బృందం సందర్శించింది.
This post was last modified on August 24, 2020 8:18 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…