బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి వ్యవహారంలో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ది హత్య అని…ఆ హత్యకు రియా సొంత తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, రియా షుగర్ డాడీ మహేష్ భట్ ప్లాన్ చేశారని సుశాంత్ జిమ్ పార్ట్ నర్ సునీల్ సంచలన ఆరోపణలు చేశాడు. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు…దుబాయ్ కు చెందిన ఆయుష్ ఖాన్ అనే ఓ డ్రగ్ డీలర్…సుశాంత్ ను కలిశాడని బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఆ భేటీలో ఏం జరిగిందో విచారణ జరపాలని అన్నారు. ఇక, సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ…తాజాగా రియా, ఇంద్రజిత్ లకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ రోజు ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో సీబీఐ ప్రత్యేక బృందం సీన్ రీ క్రియేట్ చేసింది. ఆ ఫ్లాట్ సీలింగ్ ఎత్తు..సుశాంత్ ఎత్తు…వంటి ఆధారాలు సేకరిస్తున్నారు. సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య ఎన్ని గంటలకు జరిగిందన్న దానిపై స్పష్టత లేకపోవడం, సుశాంత్ నివాసం దగ్గర్లోనే 2 హాస్పిటల్స్ ఉన్నా 5 కిలోమీటర్ల దూరంలోని కూపర్ హాస్పిటల్కే సుశాంత్ డెడ్బాడీని ఎందుకు తరలించారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ డిప్రెషన్ కు చికిత్స తీసుకున్న హిందుజా ఆసుపత్రిని సీబీఐ బృందం సందర్శించింది.
This post was last modified on August 24, 2020 8:18 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…