మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆధ్యాత్మిక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప క్యాస్టింగ్ అంతకంతా పెద్ద స్థాయికి చేరుకుంటోంది. శివ పార్వతులుగా ప్రభాస్ నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా తాజాగా కేరళ సీనియర్ స్టార్ మోహన్ లాల్ ఈ బృందంలో చేరడం అంచనాలు పెంచేస్తోంది. చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమాలు చేసే లాలెట్టాన్ గత కొన్నేళ్లలో ఓకే చెప్పినవి రెండే. మనమంతా, జనతా గ్యారేజ్. మళ్ళీ కన్నప్ప సబ్జెక్టు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. పాత్ర తీరుతెన్నులు బయటికి చెప్పలేదు కానీ ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్యారెక్టరని లీక్ ఉంది.
అన్ని బాషల నుంచి నటీనటులను తీసుకోవడం ద్వారా కన్నప్ప రేంజ్ ని పెంచుతున్నారు. కన్నడ, హిందీ నుంచి ఎవరు ఉంటారనే ఆసక్తి పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ తో ప్రాథమికంగా చర్చలు జరిగాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ తో పాటు సుదీప్ ని కూడా అడుగుతున్నారట. ఎవరినీ ఖరారు చేయలేదు. పారితోషికాల విషయంలో రాజీ పడకుండా మంచు బృందం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. విదేశాల్లో షెడ్యూల్ కోసం ఏకంగా ఆరు వందల మందిని తీసుకెళ్లడమే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు.
తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప గురించి గొప్పగా చెబుతున్న విష్ణు అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఫారిన్ లొకేషన్లలో తీస్తున్నా సరే నేటివిటీ తగ్గకుండా ఆర్ట్ డిపార్ట్ మెంట్ నుంచి బెస్ట్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. హీరోయిన్ నుపుర్ సనన్ డేట్ల ఇష్యూ వల్ల తప్పుకోవడంతో ప్రత్యాన్మయం వెతకడంలో టీమ్ బిజీగా ఉంది. మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. 2025 మహా శివరాత్రికి విడుదల చేసే లక్ష్యంతో పని చేస్తున్నారని టాక్. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ డ్రామాకు మణిశర్మ అందించబోయే సంగీతం ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలవనుంది.
This post was last modified on September 30, 2023 5:10 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…