Movie News

కన్నప్పకు తోడవుతున్న ప్యాన్ ఇండియా స్టార్లు

మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆధ్యాత్మిక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప క్యాస్టింగ్ అంతకంతా పెద్ద స్థాయికి చేరుకుంటోంది. శివ పార్వతులుగా ప్రభాస్ నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా తాజాగా కేరళ సీనియర్ స్టార్ మోహన్ లాల్ ఈ బృందంలో చేరడం అంచనాలు పెంచేస్తోంది. చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమాలు చేసే లాలెట్టాన్ గత కొన్నేళ్లలో ఓకే చెప్పినవి రెండే. మనమంతా, జనతా గ్యారేజ్. మళ్ళీ కన్నప్ప సబ్జెక్టు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. పాత్ర తీరుతెన్నులు బయటికి చెప్పలేదు కానీ ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్యారెక్టరని లీక్ ఉంది.

అన్ని బాషల నుంచి నటీనటులను తీసుకోవడం ద్వారా కన్నప్ప రేంజ్ ని పెంచుతున్నారు. కన్నడ, హిందీ నుంచి ఎవరు ఉంటారనే ఆసక్తి పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ తో ప్రాథమికంగా చర్చలు జరిగాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ తో పాటు సుదీప్ ని కూడా అడుగుతున్నారట. ఎవరినీ ఖరారు చేయలేదు. పారితోషికాల విషయంలో రాజీ పడకుండా మంచు బృందం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. విదేశాల్లో షెడ్యూల్ కోసం ఏకంగా ఆరు వందల మందిని తీసుకెళ్లడమే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు.

తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప గురించి గొప్పగా చెబుతున్న విష్ణు అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఫారిన్ లొకేషన్లలో తీస్తున్నా సరే నేటివిటీ తగ్గకుండా ఆర్ట్ డిపార్ట్ మెంట్ నుంచి బెస్ట్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. హీరోయిన్ నుపుర్ సనన్ డేట్ల ఇష్యూ వల్ల తప్పుకోవడంతో ప్రత్యాన్మయం వెతకడంలో టీమ్ బిజీగా ఉంది. మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. 2025 మహా శివరాత్రికి విడుదల చేసే లక్ష్యంతో పని చేస్తున్నారని టాక్. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ డ్రామాకు మణిశర్మ అందించబోయే సంగీతం ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలవనుంది.

This post was last modified on September 30, 2023 5:10 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago