మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆధ్యాత్మిక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప క్యాస్టింగ్ అంతకంతా పెద్ద స్థాయికి చేరుకుంటోంది. శివ పార్వతులుగా ప్రభాస్ నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాగా తాజాగా కేరళ సీనియర్ స్టార్ మోహన్ లాల్ ఈ బృందంలో చేరడం అంచనాలు పెంచేస్తోంది. చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమాలు చేసే లాలెట్టాన్ గత కొన్నేళ్లలో ఓకే చెప్పినవి రెండే. మనమంతా, జనతా గ్యారేజ్. మళ్ళీ కన్నప్ప సబ్జెక్టు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. పాత్ర తీరుతెన్నులు బయటికి చెప్పలేదు కానీ ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్యారెక్టరని లీక్ ఉంది.
అన్ని బాషల నుంచి నటీనటులను తీసుకోవడం ద్వారా కన్నప్ప రేంజ్ ని పెంచుతున్నారు. కన్నడ, హిందీ నుంచి ఎవరు ఉంటారనే ఆసక్తి పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్ తో ప్రాథమికంగా చర్చలు జరిగాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ తో పాటు సుదీప్ ని కూడా అడుగుతున్నారట. ఎవరినీ ఖరారు చేయలేదు. పారితోషికాల విషయంలో రాజీ పడకుండా మంచు బృందం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. విదేశాల్లో షెడ్యూల్ కోసం ఏకంగా ఆరు వందల మందిని తీసుకెళ్లడమే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు.
తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప గురించి గొప్పగా చెబుతున్న విష్ణు అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఫారిన్ లొకేషన్లలో తీస్తున్నా సరే నేటివిటీ తగ్గకుండా ఆర్ట్ డిపార్ట్ మెంట్ నుంచి బెస్ట్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. హీరోయిన్ నుపుర్ సనన్ డేట్ల ఇష్యూ వల్ల తప్పుకోవడంతో ప్రత్యాన్మయం వెతకడంలో టీమ్ బిజీగా ఉంది. మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. 2025 మహా శివరాత్రికి విడుదల చేసే లక్ష్యంతో పని చేస్తున్నారని టాక్. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ డ్రామాకు మణిశర్మ అందించబోయే సంగీతం ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలవనుంది.
This post was last modified on September 30, 2023 5:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…