మాములుగా ఒక డిజాస్టర్ పడితేనే నిర్మాతకు కోలుకోవడానికి టైం పడుతుంది. అలా అని సినిమాలు తీయడం ఆపేయడు. ఇంకా కసితో పోయిన చోటే వెతుక్కోవాలని మళ్ళీ పెట్టుబడి సిద్ధం చేసుకుంటాడు. కానీ ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు దెబ్బలు తగిలితే మాత్రం ఎంత డబ్బున్నా రికవరీ అంత సులభంగా ఉండదు. ప్రస్తుతం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అధినేత శ్రీనివాస్ చిట్టూరిని చూస్తే అదే అనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం స్కంద ఓపెనింగ్స్ వరకు బాగానే ఉన్నప్పటికీ టాక్ తీసికట్టుగా ఉండటంతో హిట్ కావడం దుర్లభమనే విషయం త్వరగానే అర్థమైపోయింది.
బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి రామ్ కెరీర్ లోనే అత్యధిక ఫస్ట్ డే వసూళ్లు సాధించినా చివరికి దాని ప్రయోజనం అందేలా లేదు. శ్రీనివాస్ ఇంతకు ముందు తీసిన నాగచైతన్య కస్టడీ కూడా ఇంతే. వెంకట్ ప్రభు లాంటి టాలెంటెడ్ దర్శకుడితో నాగచైతన్య కాంబోని సెట్ చేసి, ఖరీదైన అరవింద్ స్వామిని విలన్ గా పెట్టినా లాభం లేకపోయింది. వారం తిరిగేలోపే టపా కట్టేసింది. రామ్ తోనే లింగుస్వామి కాంబోలో తీసిన ది వారియర్ మరో విషాద గాథ. ఆ గాయం నుంచి స్కంద కోలుకునేలా చేస్తుందనుకుంటే ఇదింకా పెద్దది చేసింది. గోపీచంద్ సీటిమార్, సమంతా యుటర్న్ అన్నీ ఒకటే ఫలితాలు.
నిజానికి శ్రీనివాస్ చిట్టూరి ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు. హీరో, డైరెక్టర్ మార్కెట్, డిమాండ్ కు మించి కోట్లు కుమ్మరించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. దురదృష్టం కొద్దీ ఫలితాలు ఎంత మాత్రం అనుకూలంగా రావడం లేదు. కనీసం యావరేజ్ అనిపించుకునే పర్వాలేదు కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం హిట్ అనిపించుకున్నవి లేకపోవడం ట్రాజెడీ. కాంబోలకన్నా స్క్రిప్ట్ మీద సీరియస్ గా విశ్లేషణ చేసుకోవడం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద వాళ్ళతో తీస్తున్నా సరే జడ్జ్ మెంట్ విషయంలో ప్రొడ్యూసర్ జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివే తరచు చూడాల్సి వస్తుంది.
This post was last modified on September 30, 2023 1:54 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…