క్రమంగా మబ్బులు వీడుతున్నాయి. సలార్ విడుదల గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా డిస్ట్రిబ్యూషన్ వర్గాలు డిసెంబర్ 22 పక్కా అని చెబుతున్నాయి. కొన్ని ఓవర్సీస్ బుకింగ్ సైట్స్ టికెట్లు ఇంకా అమ్మకపోయినా తేదీకి సంబంధించిన కన్ఫర్మేషన్ పెట్టేశారు. నిర్మాత చెప్పనిదే ఇదంతా జరగదు. షారుఖ్ ఖాన్ డుంకీ ఉందని తెలిసినా కూడా హోంబాలే ఫిలిమ్స్ క్లాష్ కి సిద్ధమంటోంది. గతంలో జీరో టైంలో తామే నిర్మించిన కెజిఎఫ్ చాప్టర్ 1 అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించడం ఉదాహరణగా చెబుతున్నారట. పైగా ఈసారి ప్రభాస్ తోడున్నాడు.
ఇప్పుడిది ధృవీకరణ కావడం కోసం పదుల సంఖ్యలో నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్, జనవరిలో రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళు సలార్ ని బట్టి తమ ప్లానింగ్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్లకున్న నెట్ వర్క్ లో ఎంత ప్రయత్నించినా బెంగళూరు నుంచి సరైన సమాచారం రాబట్టుకోలేకపోతున్నారు. అటుఇటు తిరిగి డిసెంబర్ 22 అనే మాట తప్ప మరొకటి వినిపించడం లేదట. బిజినెస్ లావాదేవీలు కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం, డుంకీలను ఓవర్సీస్ లో ఎలా ఎదురుకోవాలనే అంశం సులభంగా ఉండదు.
యుఎస్, యుకె లాంటి దేశాల్లో స్క్రీన్లను దక్కించుకోవడం పెద్ద సవాల్. సలార్ ఐమాక్స్ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో థియేటర్లను బ్లాక్ చేసుకోవడం కీలకం. ఈ కసరత్తు వల్లే అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇవాళ రేపో లేదా ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. క్లైమాక్స్ కు సంబంధించి కొన్ని కీలక రిపేర్లు చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడని, ఆయన ఫ్రీ అయ్యాక ప్రమోషన్లు ఎలా చేయాలనే ప్లాన్ ని సిద్ధం చేస్తారని ఇన్ సైడ్ టాక్. సో విడుదల విషయంలో సలార్ సందేహాలు దాదాపు తీరిపోయినట్టే.
This post was last modified on September 29, 2023 10:12 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…