క్రమంగా మబ్బులు వీడుతున్నాయి. సలార్ విడుదల గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా డిస్ట్రిబ్యూషన్ వర్గాలు డిసెంబర్ 22 పక్కా అని చెబుతున్నాయి. కొన్ని ఓవర్సీస్ బుకింగ్ సైట్స్ టికెట్లు ఇంకా అమ్మకపోయినా తేదీకి సంబంధించిన కన్ఫర్మేషన్ పెట్టేశారు. నిర్మాత చెప్పనిదే ఇదంతా జరగదు. షారుఖ్ ఖాన్ డుంకీ ఉందని తెలిసినా కూడా హోంబాలే ఫిలిమ్స్ క్లాష్ కి సిద్ధమంటోంది. గతంలో జీరో టైంలో తామే నిర్మించిన కెజిఎఫ్ చాప్టర్ 1 అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించడం ఉదాహరణగా చెబుతున్నారట. పైగా ఈసారి ప్రభాస్ తోడున్నాడు.
ఇప్పుడిది ధృవీకరణ కావడం కోసం పదుల సంఖ్యలో నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్, జనవరిలో రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళు సలార్ ని బట్టి తమ ప్లానింగ్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్లకున్న నెట్ వర్క్ లో ఎంత ప్రయత్నించినా బెంగళూరు నుంచి సరైన సమాచారం రాబట్టుకోలేకపోతున్నారు. అటుఇటు తిరిగి డిసెంబర్ 22 అనే మాట తప్ప మరొకటి వినిపించడం లేదట. బిజినెస్ లావాదేవీలు కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం, డుంకీలను ఓవర్సీస్ లో ఎలా ఎదురుకోవాలనే అంశం సులభంగా ఉండదు.
యుఎస్, యుకె లాంటి దేశాల్లో స్క్రీన్లను దక్కించుకోవడం పెద్ద సవాల్. సలార్ ఐమాక్స్ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో థియేటర్లను బ్లాక్ చేసుకోవడం కీలకం. ఈ కసరత్తు వల్లే అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇవాళ రేపో లేదా ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. క్లైమాక్స్ కు సంబంధించి కొన్ని కీలక రిపేర్లు చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడని, ఆయన ఫ్రీ అయ్యాక ప్రమోషన్లు ఎలా చేయాలనే ప్లాన్ ని సిద్ధం చేస్తారని ఇన్ సైడ్ టాక్. సో విడుదల విషయంలో సలార్ సందేహాలు దాదాపు తీరిపోయినట్టే.
This post was last modified on September 29, 2023 10:12 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…