క్రమంగా మబ్బులు వీడుతున్నాయి. సలార్ విడుదల గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా డిస్ట్రిబ్యూషన్ వర్గాలు డిసెంబర్ 22 పక్కా అని చెబుతున్నాయి. కొన్ని ఓవర్సీస్ బుకింగ్ సైట్స్ టికెట్లు ఇంకా అమ్మకపోయినా తేదీకి సంబంధించిన కన్ఫర్మేషన్ పెట్టేశారు. నిర్మాత చెప్పనిదే ఇదంతా జరగదు. షారుఖ్ ఖాన్ డుంకీ ఉందని తెలిసినా కూడా హోంబాలే ఫిలిమ్స్ క్లాష్ కి సిద్ధమంటోంది. గతంలో జీరో టైంలో తామే నిర్మించిన కెజిఎఫ్ చాప్టర్ 1 అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించడం ఉదాహరణగా చెబుతున్నారట. పైగా ఈసారి ప్రభాస్ తోడున్నాడు.
ఇప్పుడిది ధృవీకరణ కావడం కోసం పదుల సంఖ్యలో నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్, జనవరిలో రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళు సలార్ ని బట్టి తమ ప్లానింగ్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్లకున్న నెట్ వర్క్ లో ఎంత ప్రయత్నించినా బెంగళూరు నుంచి సరైన సమాచారం రాబట్టుకోలేకపోతున్నారు. అటుఇటు తిరిగి డిసెంబర్ 22 అనే మాట తప్ప మరొకటి వినిపించడం లేదట. బిజినెస్ లావాదేవీలు కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం, డుంకీలను ఓవర్సీస్ లో ఎలా ఎదురుకోవాలనే అంశం సులభంగా ఉండదు.
యుఎస్, యుకె లాంటి దేశాల్లో స్క్రీన్లను దక్కించుకోవడం పెద్ద సవాల్. సలార్ ఐమాక్స్ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో థియేటర్లను బ్లాక్ చేసుకోవడం కీలకం. ఈ కసరత్తు వల్లే అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇవాళ రేపో లేదా ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. క్లైమాక్స్ కు సంబంధించి కొన్ని కీలక రిపేర్లు చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడని, ఆయన ఫ్రీ అయ్యాక ప్రమోషన్లు ఎలా చేయాలనే ప్లాన్ ని సిద్ధం చేస్తారని ఇన్ సైడ్ టాక్. సో విడుదల విషయంలో సలార్ సందేహాలు దాదాపు తీరిపోయినట్టే.
This post was last modified on September 29, 2023 10:12 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…