అక్టోబర్ లో ‘టైగర్ నాగేశ్వరరావ్’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న రవితేజ జనవరికి ఈగల్ ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మాస్ మహారాజా. మైత్రి మూవీ మేకర్స్ లో ‘క్రాక్’ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలో కీ రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు గోపీచంద్.
తాజాగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ను కలిసి సినిమాలో కీ రోల్ ఆఫర్ చేశాడట గోపీచంద్. కేరెక్టర్ నచ్చడంతో సెల్వ రాఘవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ మధ్య విజయ్ బీస్ట్ లో మంచి కేరెక్టర్ ప్లే చేసి థియేటర్స్ లో ఎంటర్టైన్ చేశాడు సెల్వ. తమిళ్ లో ఆడదడపా రోల్స్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెల నుండి 7g బృందావన్ కాలనీ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సెల్వ. అటు దర్శకుడిగా ఆ సినిమా చేస్తూనే ఇటు తెలుగులో రవితేజ సినిమాకు నటుడిగా డేట్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
క్రాక్ లో తమిళ దర్శకుడు సముద్రఖని చేత మంచి విలన్ రోల్ చేయించిన గోపీచంద్ , సెల్వ రాఘవన్ ను ఈ సినిమాలో ఎలా చూపిస్తాడు ? ఎలాంటి కేరెక్టర్ డిజైన్ చేశాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి రవితేజకి సెల్వ మెయిన్ విలన్ గా ఏమైనా కనిపిస్తాడా ? లేదా క్రాక్ తరహాలాగే ఇద్దరు ముగ్గురు విలన్స్ లో ఒకడిగా కనిపిస్తాడా ? తెలియాల్సి ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ ఘాట్ మొదలు కానుంది.
This post was last modified on September 28, 2023 10:35 pm
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…