అక్టోబర్ లో ‘టైగర్ నాగేశ్వరరావ్’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న రవితేజ జనవరికి ఈగల్ ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మాస్ మహారాజా. మైత్రి మూవీ మేకర్స్ లో ‘క్రాక్’ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలో కీ రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు గోపీచంద్.
తాజాగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ను కలిసి సినిమాలో కీ రోల్ ఆఫర్ చేశాడట గోపీచంద్. కేరెక్టర్ నచ్చడంతో సెల్వ రాఘవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ మధ్య విజయ్ బీస్ట్ లో మంచి కేరెక్టర్ ప్లే చేసి థియేటర్స్ లో ఎంటర్టైన్ చేశాడు సెల్వ. తమిళ్ లో ఆడదడపా రోల్స్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెల నుండి 7g బృందావన్ కాలనీ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సెల్వ. అటు దర్శకుడిగా ఆ సినిమా చేస్తూనే ఇటు తెలుగులో రవితేజ సినిమాకు నటుడిగా డేట్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
క్రాక్ లో తమిళ దర్శకుడు సముద్రఖని చేత మంచి విలన్ రోల్ చేయించిన గోపీచంద్ , సెల్వ రాఘవన్ ను ఈ సినిమాలో ఎలా చూపిస్తాడు ? ఎలాంటి కేరెక్టర్ డిజైన్ చేశాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి రవితేజకి సెల్వ మెయిన్ విలన్ గా ఏమైనా కనిపిస్తాడా ? లేదా క్రాక్ తరహాలాగే ఇద్దరు ముగ్గురు విలన్స్ లో ఒకడిగా కనిపిస్తాడా ? తెలియాల్సి ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ ఘాట్ మొదలు కానుంది.
This post was last modified on September 28, 2023 10:35 pm
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…