అక్టోబర్ లో ‘టైగర్ నాగేశ్వరరావ్’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న రవితేజ జనవరికి ఈగల్ ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మాస్ మహారాజా. మైత్రి మూవీ మేకర్స్ లో ‘క్రాక్’ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలో కీ రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు గోపీచంద్.
తాజాగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ను కలిసి సినిమాలో కీ రోల్ ఆఫర్ చేశాడట గోపీచంద్. కేరెక్టర్ నచ్చడంతో సెల్వ రాఘవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ మధ్య విజయ్ బీస్ట్ లో మంచి కేరెక్టర్ ప్లే చేసి థియేటర్స్ లో ఎంటర్టైన్ చేశాడు సెల్వ. తమిళ్ లో ఆడదడపా రోల్స్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెల నుండి 7g బృందావన్ కాలనీ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సెల్వ. అటు దర్శకుడిగా ఆ సినిమా చేస్తూనే ఇటు తెలుగులో రవితేజ సినిమాకు నటుడిగా డేట్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
క్రాక్ లో తమిళ దర్శకుడు సముద్రఖని చేత మంచి విలన్ రోల్ చేయించిన గోపీచంద్ , సెల్వ రాఘవన్ ను ఈ సినిమాలో ఎలా చూపిస్తాడు ? ఎలాంటి కేరెక్టర్ డిజైన్ చేశాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి రవితేజకి సెల్వ మెయిన్ విలన్ గా ఏమైనా కనిపిస్తాడా ? లేదా క్రాక్ తరహాలాగే ఇద్దరు ముగ్గురు విలన్స్ లో ఒకడిగా కనిపిస్తాడా ? తెలియాల్సి ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ ఘాట్ మొదలు కానుంది.
This post was last modified on September 28, 2023 10:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…