అక్టోబర్ లో ‘టైగర్ నాగేశ్వరరావ్’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న రవితేజ జనవరికి ఈగల్ ను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు మాస్ మహారాజా. మైత్రి మూవీ మేకర్స్ లో ‘క్రాక్’ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా రష్మిక మందన్న ను ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలో కీ రోల్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు గోపీచంద్.
తాజాగా తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ను కలిసి సినిమాలో కీ రోల్ ఆఫర్ చేశాడట గోపీచంద్. కేరెక్టర్ నచ్చడంతో సెల్వ రాఘవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ మధ్య విజయ్ బీస్ట్ లో మంచి కేరెక్టర్ ప్లే చేసి థియేటర్స్ లో ఎంటర్టైన్ చేశాడు సెల్వ. తమిళ్ లో ఆడదడపా రోల్స్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెల నుండి 7g బృందావన్ కాలనీ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు సెల్వ. అటు దర్శకుడిగా ఆ సినిమా చేస్తూనే ఇటు తెలుగులో రవితేజ సినిమాకు నటుడిగా డేట్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
క్రాక్ లో తమిళ దర్శకుడు సముద్రఖని చేత మంచి విలన్ రోల్ చేయించిన గోపీచంద్ , సెల్వ రాఘవన్ ను ఈ సినిమాలో ఎలా చూపిస్తాడు ? ఎలాంటి కేరెక్టర్ డిజైన్ చేశాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి రవితేజకి సెల్వ మెయిన్ విలన్ గా ఏమైనా కనిపిస్తాడా ? లేదా క్రాక్ తరహాలాగే ఇద్దరు ముగ్గురు విలన్స్ లో ఒకడిగా కనిపిస్తాడా ? తెలియాల్సి ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ ఘాట్ మొదలు కానుంది.
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…