అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లోనే కాదు దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ జెండా ఎగరేసిన దర్శకుడు సందీప్ వంగా ఈసారి అనిమల్ తో రాబోతున్నాడు. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన ఈ మాఫియా డ్రామా డిసెంబర్ 1 విడుదల కాబోతోంది. డిఫరెంట్ ట్రీట్ మెంట్, అల్ట్రా వయొలెన్స్ తో దీన్ని రూపొందించినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. టి సిరీస్ సంస్థ రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉందీ అనిమల్. అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఇవాళ రెండున్నర నిమిషాల పాటు ఉన్న టీజర్ రిలీజ్ చేశారు.
కొడుకుని క్రమశిక్షణలో పెట్టడానికి విపరీతంగా కొట్టడానికి వెనుకాడని బల్బీర్ సింగ్(అనిల్ కపూర్)నిత్యం నేర సామ్రాజ్యంలో మునిగి తేలుతూ ఉంటాడు. అయితే తండ్రి ఎంతగా దండించినా అతన్ని పల్లెత్తు మాట అనేందుకు సాహసించని యువకుడు(రన్బీర్ కపూర్) ముందు మాములు జీవితాన్ని గడుపుతాడు. అతనికో ప్రియురాలు(రష్మిక మందన్న)ఉంటుంది. అయితే సాత్వికంగా ఉండే అతడు కొన్ని పరిణామాల తర్వాత జంతువుగా మారిపోయి శత్రువులను వేటాడటం మొదలుపెడతాడు. చివరి లక్ష్యాన్ని చేరుకుంటాడు. అక్కడిదాకా ప్రయాణం ముళ్ళమధ్య సాగుతుంది. అదే అసలు స్టోరీ.
సందీప్ వంగా తనదైన శైలిలో స్క్రీన్ ప్లే నడిపించినట్టు కనిపిస్తుంది. కథకు సంబంధించి క్లూస్ ఎక్కువగా ఇవ్వకపోయినా మెయిన్ లైన్ ఏంటో చెప్పేశారు. బారుడు గెడ్డంతో వెనుక సింగ్ గ్యాంగ్ తో మెషీన్ గన్లు పట్టుకుని యుద్ధానికి వెళ్తున్న రేంజ్ లో చూపించిన సీన్స్ లో మంచి ఎలివేషన్లు కనిపిస్తున్నాయి. మెయిన్ ఆర్టిస్టులను తప్ప మిగిలినవాళ్ళను రివీల్ చేయలేదు. ఇది టీజర్ కాబట్టి అసలు ట్రైలర్ లో బోలెడు కంటెంట్ చూపించే ఛాన్స్ ఉంది. స్టైలిష్ మేకింగ్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాడని పేరున్న సందీప్ వంగా రన్బీర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ తో ఎలాంటి హీరోయిజం చూపించాడో రెండు నెలల్లో తేలిపోతుంది
This post was last modified on September 28, 2023 11:28 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…