టాలీవుడ్ బాక్సాఫీస్లో కొన్ని వారాలుగా స్లంప్ నడుస్తోంది. ఈ నెలలో తొలి రెండు వారాల్లో ఖుషి, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి వారాలను ఖాళీగా వదిలేశారు. వరుసగా రెండు వారాలు చెప్పుకోదగ్గ రిలీజ్లే లేవు. మళ్లీ చివరి వీకెండ్లో సందడి కనిపించేలా ఉంది. ఈ వారం స్కంద, చంద్రముఖి-2 లాంటి క్రేజీ చిత్రాలు.. ‘పెదకాపు’ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజవుతున్నాయి.
ఐతే ముందు వారాల్లోని డల్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుండటం వల్లో ఏమో.. ఈ మూడు చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశాజనకంగా లేవు. ఉన్నంతలో ‘స్కంద’ మూవీ పరిస్థితి బెటర్. అక్కడక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు చూపిస్తున్నాయి. కానీ బోయపాటి-రామ్ కాంబినేషన్ మూవీకి ఉండాల్సినంత క్రేజ్ అయితే లేదు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్, పాటల వల్ల బజ్ తగ్గిపోవడం ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.
ఇక ‘చంద్రముఖి-2’కు ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. సినిమా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతూ వస్తోంది. ఈ సినిమా ప్రోమోలు కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఇక ‘పెదకాపు’ ప్రోమోలు బాగున్నా.. కొత్త హీరో కావడం మైనస్ అవుతోంది. ఇప్పటికైతే ప్రేక్షకులు ఆ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. తక్కువ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా.. వాటికీ స్పందన సరిగా లేదు.
ఈ మూడు చిత్రాలకూ టాక్ కీలకం కానుంది. ఐతే స్కంద, చంద్రముఖి-2 మాస్ సినిమాలు కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నా.. రిలీజ్ టైంకి టార్గెట్ ఆడియన్స్ నేరుగా థియేటర్లకు పెద్ద సంఖ్యలోనే వస్తారని భావిస్తున్నారు. ‘పెదకాపు’ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది కాబట్టి.. టాక్ బాగుంటే అది కూడా పుంజుకుంటుంది. మరి ఈ వారం అయినా బాక్సాఫీస్’లో తిరిగి సందడి నెలకొంటుందేమో చూడాలి.
This post was last modified on September 27, 2023 10:51 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…