సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి.. ఈ రెండు పేర్లకూ అసలు సంబంధమే లేదు. ఇంతకుముందు ఎప్పుడూ వాళ్లిద్దరూ కలిసి కనిపించింది లేదు. కలిసి సినిమా చేసింది లేదు. ఐతే ఈ మధ్యే వాళ్లిద్దరూ కలిసి సత్య అనే చిన్న షార్ట్ ఫిలిం ఒకటి చేశారు. ఐతే మంగళవారం వీళ్లిద్దరి గురించి సామాన్య జనాలకు ఓ కొత్త విషయం తెలిసింది. తేజు, స్వాతి కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారట. వాళ్లిద్దరూ క్లాస్ మేట్స్ కూడానట.
ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం ఈ రోజే బయటి ప్రపంచానికి వెల్లడించారు. స్వాతి ప్రధాన పాత్ర పోషించిన మంత్ ఆఫ్ మధు అక్టోబరు 6న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు తేజు అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా స్టేజ్ మీద ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్లా మూవ్ అవుతుంటే ఏమో అనుకున్నారు మీడియా వాళ్లు.
కానీ ఆ తర్వాతే తెలిసింది ఇద్దరూ క్లాస్ మేట్స్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. స్వాతినే ఈ విషయాన్ని వెల్లడించింది. తేజును ఆమె రేయ్, వాడు అని కూడా సంబోధించడం విశేషం. తామిద్దరం కలిసి ఒకే కాలేజీలో డిగ్రీ చదివామని ఆమె తెలిపింది. అందరూ తాను తేజు కంటే పెద్దదాన్ని అనుకుంటారని.. ఐతే నటిగా తాను ముందు డెబ్యూ చేశాను అంతే అని.. తమ ఇద్దరిదీ ఒకే వయసని తెలిపింది.
కలిసి చదువుకున్నపుడు తేజు తన పేపర్లోనే చూసి కాపీ కొట్టేవాడని.. తన వల్లే పాసయ్యాడని స్వాతి పేర్కొనగా.. అసలు పరీక్షల్లో చూపించేదే కాదు అని తేజు చమత్కరించాడు. తన పేర్లు ఎస్తో మొదలు కావడంతో ప్రాక్టికల్స్లో కూడా ఒకేదగ్గర పడేవాళ్లమని స్వాతి చెప్పింది. ఇలా కొంతసేపు కామెడీ చేశాక.. తేజ తనకు జీవితంలో చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని, తనకెంతో సపోర్ట్ ఇస్తాడని స్వాతి చెప్పగా.. తేజు కూడా తనెంత క్లోజ్ ఫ్రెండో వివరించాడు.
This post was last modified on September 26, 2023 11:48 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…