Movie News

తేజు, క‌ల‌ర్స్ స్వాతి అంత క్లోజ్ ఫ్రెండ్సా?

సాయిధ‌ర‌మ్ తేజ్, క‌ల‌ర్స్ స్వాతి.. ఈ రెండు పేర్ల‌కూ అస‌లు సంబంధ‌మే లేదు. ఇంత‌కుముందు ఎప్పుడూ వాళ్లిద్ద‌రూ క‌లిసి క‌నిపించింది లేదు. క‌లిసి సినిమా చేసింది లేదు. ఐతే ఈ మ‌ధ్యే వాళ్లిద్ద‌రూ క‌లిసి స‌త్య అనే చిన్న షార్ట్ ఫిలిం ఒక‌టి చేశారు. ఐతే మంగ‌ళ‌వారం వీళ్లిద్ద‌రి గురించి సామాన్య జ‌నాల‌కు ఓ కొత్త విష‌యం తెలిసింది. తేజు, స్వాతి క‌లిసి ఒకే కాలేజీలో చ‌దువుకున్నార‌ట‌. వాళ్లిద్ద‌రూ క్లాస్ మేట్స్ కూడాన‌ట‌.

ఇద్ద‌రూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విష‌యం ఈ రోజే బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డించారు. స్వాతి ప్ర‌ధాన పాత్ర పోషించిన మంత్ ఆఫ్ మ‌ధు అక్టోబ‌రు 6న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. దీని ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు తేజు అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా స్టేజ్ మీద ఇద్ద‌రూ క్లోజ్ ఫ్రెండ్స్‌లా మూవ్ అవుతుంటే ఏమో అనుకున్నారు మీడియా వాళ్లు.

కానీ ఆ త‌ర్వాతే తెలిసింది ఇద్ద‌రూ క్లాస్ మేట్స్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. స్వాతినే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. తేజును ఆమె రేయ్, వాడు అని కూడా సంబోధించ‌డం విశేషం. తామిద్ద‌రం క‌లిసి ఒకే కాలేజీలో డిగ్రీ చ‌దివామ‌ని ఆమె తెలిపింది. అందరూ తాను తేజు కంటే పెద్దదాన్ని అనుకుంటార‌ని.. ఐతే న‌టిగా తాను ముందు డెబ్యూ చేశాను అంతే అని.. త‌మ ఇద్ద‌రిదీ ఒకే వ‌య‌స‌ని తెలిపింది.

క‌లిసి చ‌దువుకున్న‌పుడు తేజు త‌న పేప‌ర్లోనే చూసి కాపీ కొట్టేవాడ‌ని.. త‌న వ‌ల్లే పాస‌య్యాడ‌ని స్వాతి పేర్కొన‌గా.. అస‌లు ప‌రీక్ష‌ల్లో చూపించేదే కాదు అని తేజు చ‌మ‌త్క‌రించాడు. త‌న పేర్లు ఎస్‌తో మొద‌లు కావ‌డంతో ప్రాక్టిక‌ల్స్‌లో కూడా ఒకేద‌గ్గ‌ర ప‌డేవాళ్ల‌మ‌ని స్వాతి చెప్పింది. ఇలా కొంత‌సేపు కామెడీ చేశాక‌.. తేజ త‌న‌కు జీవితంలో చాలా ముఖ్య‌మైన ఫ్రెండ్ అని, త‌న‌కెంతో స‌పోర్ట్ ఇస్తాడ‌ని స్వాతి చెప్ప‌గా.. తేజు కూడా త‌నెంత క్లోజ్ ఫ్రెండో వివ‌రించాడు.

Satya

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

6 minutes ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

1 hour ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

4 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

10 hours ago