తేజు, క‌ల‌ర్స్ స్వాతి అంత క్లోజ్ ఫ్రెండ్సా?

సాయిధ‌ర‌మ్ తేజ్, క‌ల‌ర్స్ స్వాతి.. ఈ రెండు పేర్ల‌కూ అస‌లు సంబంధ‌మే లేదు. ఇంత‌కుముందు ఎప్పుడూ వాళ్లిద్ద‌రూ క‌లిసి క‌నిపించింది లేదు. క‌లిసి సినిమా చేసింది లేదు. ఐతే ఈ మ‌ధ్యే వాళ్లిద్ద‌రూ క‌లిసి స‌త్య అనే చిన్న షార్ట్ ఫిలిం ఒక‌టి చేశారు. ఐతే మంగ‌ళ‌వారం వీళ్లిద్ద‌రి గురించి సామాన్య జ‌నాల‌కు ఓ కొత్త విష‌యం తెలిసింది. తేజు, స్వాతి క‌లిసి ఒకే కాలేజీలో చ‌దువుకున్నార‌ట‌. వాళ్లిద్ద‌రూ క్లాస్ మేట్స్ కూడాన‌ట‌.

ఇద్ద‌రూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విష‌యం ఈ రోజే బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డించారు. స్వాతి ప్ర‌ధాన పాత్ర పోషించిన మంత్ ఆఫ్ మ‌ధు అక్టోబ‌రు 6న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. దీని ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు తేజు అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా స్టేజ్ మీద ఇద్ద‌రూ క్లోజ్ ఫ్రెండ్స్‌లా మూవ్ అవుతుంటే ఏమో అనుకున్నారు మీడియా వాళ్లు.

కానీ ఆ త‌ర్వాతే తెలిసింది ఇద్ద‌రూ క్లాస్ మేట్స్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. స్వాతినే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. తేజును ఆమె రేయ్, వాడు అని కూడా సంబోధించ‌డం విశేషం. తామిద్ద‌రం క‌లిసి ఒకే కాలేజీలో డిగ్రీ చ‌దివామ‌ని ఆమె తెలిపింది. అందరూ తాను తేజు కంటే పెద్దదాన్ని అనుకుంటార‌ని.. ఐతే న‌టిగా తాను ముందు డెబ్యూ చేశాను అంతే అని.. త‌మ ఇద్ద‌రిదీ ఒకే వ‌య‌స‌ని తెలిపింది.

క‌లిసి చ‌దువుకున్న‌పుడు తేజు త‌న పేప‌ర్లోనే చూసి కాపీ కొట్టేవాడ‌ని.. త‌న వ‌ల్లే పాస‌య్యాడ‌ని స్వాతి పేర్కొన‌గా.. అస‌లు ప‌రీక్ష‌ల్లో చూపించేదే కాదు అని తేజు చ‌మ‌త్క‌రించాడు. త‌న పేర్లు ఎస్‌తో మొద‌లు కావ‌డంతో ప్రాక్టిక‌ల్స్‌లో కూడా ఒకేద‌గ్గ‌ర ప‌డేవాళ్ల‌మ‌ని స్వాతి చెప్పింది. ఇలా కొంత‌సేపు కామెడీ చేశాక‌.. తేజ త‌న‌కు జీవితంలో చాలా ముఖ్య‌మైన ఫ్రెండ్ అని, త‌న‌కెంతో స‌పోర్ట్ ఇస్తాడ‌ని స్వాతి చెప్ప‌గా.. తేజు కూడా త‌నెంత క్లోజ్ ఫ్రెండో వివ‌రించాడు.