Movie News

ఓటిటి అభిమానులకు ప్రైమ్ షాక్

ఏదైనా ఓటిటి యాప్ కి ఏడాది పాటు చందా కడితే నిశ్చింతగా బోలెడు కంటెంట్ చూసుకోవచ్చనే ట్రెండ్ ఇండియాలో ఉధృతం చేసింది అమెజాన్ ప్రైమే. ముఖ్యంగా కరోనా టైంలో దీని సేవలు అందుకున్న వినియోగదారులు లక్షల నుంచి కోట్లలోకి పెరిగిపోయారు. అయితే క్రమంగా తన బిజినెస్ మోడల్ ని బయట పెడుతున్న యాజమాన్యం కొన్నాళ్ల క్రితం రెంటల్ పద్ధతి మొదలుపెట్టి ఫస్ట్ షాక్ ఇచ్చింది. 75 రూపాయలతో మొదలుకుని 400 రూపాయల దాకా స్టోర్ అనే ఆప్షన్ లో డబ్బులు చెల్లించి కొత్త సినిమాలు చూసే సిస్టంని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు.

ఫ్రెష్ గా రాబోయే ట్విస్ట్ ఏంటంటే త్వరలో ప్రైమ్ లో యూట్యూబ్ తరహాలో ప్రకటనలు రాబోతున్నాయట. ఒకవేళ వాటిని వద్దనుకుంటే ఇప్పుడు రెగ్యులర్ గా చెల్లించే మొత్తానికి అదనంగా మరికొంత సొమ్ము కడితే యాడ్స్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అందుకోవచ్చు. తొలుత యుఎస్, యుకె, జర్మనీ, కెనడాలో తీసుకొచ్చి ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో లాంచ్ చేస్తారు. భారతదేశానికి ఎప్పుడనే దాని మీద ఇంకా సరైన సమాచారం లేదు. మనకేదో ప్రత్యేకంగా మినహాయిస్తారని ఎలాంటి గ్యారెంటీ లేదు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

నిజానికీ యాడ్స్ ప్రహసనం ఆహా, డిస్నీ హాట్ స్టార్ లాంటి వాటిలో ఆల్రెడీ ఉంది. ప్రీమియం ప్యాక్ తీసుకుంటే తప్ప వీటిని తప్పించుకోలేం. ఇప్పుడు ప్రైమ్ కూడా అదే దారిలో వెళ్లబోతోంది. అంటే రెగ్యులర్ రేట్లతో ఓటిటిని చూడాలంటె అచ్చం శాటిలైట్ ఛానల్స్ తరహాలో ప్రతి పావుగంటకోసారి ప్రకటనలు భరించాల్సి ఉంటుందన్న మాట. ఏదైనా ట్రెండ్ ని మెల్లగా అలవాటు చేసి దానికి అడిక్ట్ అయిపోయాక క్రమంగా వాతలు పెట్టుకుంటూ పోవడమంటే ఇదేనేమో. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చిత్ర విచిత్ర పరిణామాలు, మార్పులు చూడాల్సి ఉంటుందో. కొత్తొక వింత పాతొక రోతని పెద్దలు ఊరికే అనలేదు. 

This post was last modified on September 26, 2023 11:26 pm

Share

Recent Posts

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

17 minutes ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

46 minutes ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

53 minutes ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

1 hour ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

1 hour ago

అన్నయ్యను పలకరించాలి బ్రహ్మానందం గారూ…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…

2 hours ago