ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సలార్ విడుదల వ్యవహారంలో కొత్త కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా డిసెంబర్ 22 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్లకు మెయిల్ వచ్చిందన్న వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. దీని గురించి పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. మరోవైపు పంపిణీదారులు అలాంటిదేమీ లేదని అంటున్నారు. బాలీవుడ్ కు సంబందించిన పేరున్న వెరిఫైడ్ హ్యాండిల్స్ అన్నీ షారుఖ్ వర్సెస్ ప్రభాస్ అంటూ కథనాలు మొదలుపెట్టాయి. ఎందుకంటే డుంకీ ఆ డేట్ ని గత ఏడాదే లాక్ చేసుకుంది కాబట్టి.
వీలైనంత త్వరగా హోంబాలే ఫిలిమ్స్ దీనికి చెక్ పెట్టడం అత్యవసరం. లేదూ ఇది అబద్దమైతే దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. లేకపోతే లేనిపోని ప్రచారాలకు చోటు ఇచ్చినట్టవుతుంది. ఇదంతా ఉత్తి పుకారని కొట్టి పారేయలేం. ఎందుకంటే ప్యాన్ ఇండియా మూవీ ఏదైనా ఊరికే ఆషామాషీగా గాలిమాటగా డేట్లు లాక్ చేసుకోవు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారతాయి. చిన్న మార్పు పెద్ద పరిణామానికి దారి తీస్తుంది. అందుకే డిసెంబర్ 22 నిజమా కాదానేది కొంచెం అర్జెంటుగానే తేల్చేస్తే బెటర్.
కొద్దిరోజుల క్రితమే సలార్ నిర్మాతలు మార్చ్ 22 ఆప్షన్ ని చూస్తున్నారని తెలిసిన గంటల వ్యవధిలోనే కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. అసలు ఈ సినిమా ఏ స్టేజిలో ఉందో, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత పెండింగ్, కొంత భాగం రీ షూట్ కు సంబంధించిన వార్తలు వీటన్నింటికి ఏదో ఒక రూపంలో సమాధానం ఇవ్వాలి. సెప్టెంబర్ 28 వదిలేయడమే పెద్ద రచ్చకు దారి తీసింది. స్కంద లాంటి పెద్ద సినిమాలు సైతం చాలా ఇబ్బంది పడ్డాయి. తిరిగి ఇప్పుడు డిసెంబర్ 22 లేక మరొకటా అనే చర్చ ఇతర ప్రొడ్యూసర్లకు టెన్షన్ కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వారం వెంకటేష్, నాని, నితిన్ లు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు మరి.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…