గంపెడాశలతో సెప్టెంబర్ లోనే చూసేస్తామని ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు షాక్ ఇస్తూ సలార్ వాయిదా పడటం ఎన్ని ప్రకంపనలకు దారి తీసిందో గత ఇరవై రోజులుగా చూస్తూనే ఉన్నాం. హోంబాలే ఫిలింస్ అధికారిక ప్రకటన ఈ మధ్య ఇచ్చింది కానీ విషయం అప్పటికే పొక్కిపోయి రోజులు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలకమైన కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేసే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు బెంగళూరు టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ తాను అనుకున్న విధంగా రాలేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే వద్దని నిర్మాతలకు తేల్చి చెప్పాడట.
బిజినెస్ పరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికీ అవుట్ ఫుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద సైతం సంతృప్తి వ్యక్తం చేయలేదని సన్నిహితులు అంటున్నారు. పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తపించే తెగించే నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని, వరస ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు అందుకోకపోతే తప్పు మనదే అవుతుంది తప్ప దాన్ని హీరో దురదృష్టం కిందకు తోసేయలేమని అంటున్నారట. 2024 మార్చి ఒక ఆప్షన్ గా పెట్టుకుని లేదంటే సమ్మర్ కి వెళ్లి సోలో రిలీజ్ ఉన్న డేట్ పట్టుకునే ఆలోచనలో ప్రొడ్యూసర్లున్నారు.
మొత్తానికి ప్రశాంత్ నీల్ గ్యారేజ్ లో సలార్ మరమత్తులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంతే కాదు ప్రభాస్ అవసరం లేని ఒక కీలక ఎపిసోడ్ ని సైతం మళ్ళీ చిత్రీకరించారని తెలిసింది. డార్లింగ్ అందుబాటులోకి వచ్చాక ముఖ్యమైన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయించి డిసెంబర్ లోగా డబ్బింగ్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజుకి ట్రైలర్ వస్తుందా లేదానేది ఇంకా డోలాయమానంలోనే ఉంది. ఇప్పటికిప్పుడు తేల్చే అవకాశం లేకపోవడంతో విడుదల తేదీ సస్పెన్స్ కూడా కొనసాగనుంది. ఓవర్సీస్ హక్కులు ముప్పై ఆరు కోట్లకు పైగానే అమ్మినట్టు ట్రేడ్ న్యూస్.
This post was last modified on September 25, 2023 3:19 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…