గంపెడాశలతో సెప్టెంబర్ లోనే చూసేస్తామని ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు షాక్ ఇస్తూ సలార్ వాయిదా పడటం ఎన్ని ప్రకంపనలకు దారి తీసిందో గత ఇరవై రోజులుగా చూస్తూనే ఉన్నాం. హోంబాలే ఫిలింస్ అధికారిక ప్రకటన ఈ మధ్య ఇచ్చింది కానీ విషయం అప్పటికే పొక్కిపోయి రోజులు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలకమైన కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేసే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు బెంగళూరు టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ తాను అనుకున్న విధంగా రాలేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే వద్దని నిర్మాతలకు తేల్చి చెప్పాడట.
బిజినెస్ పరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికీ అవుట్ ఫుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద సైతం సంతృప్తి వ్యక్తం చేయలేదని సన్నిహితులు అంటున్నారు. పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తపించే తెగించే నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని, వరస ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు అందుకోకపోతే తప్పు మనదే అవుతుంది తప్ప దాన్ని హీరో దురదృష్టం కిందకు తోసేయలేమని అంటున్నారట. 2024 మార్చి ఒక ఆప్షన్ గా పెట్టుకుని లేదంటే సమ్మర్ కి వెళ్లి సోలో రిలీజ్ ఉన్న డేట్ పట్టుకునే ఆలోచనలో ప్రొడ్యూసర్లున్నారు.
మొత్తానికి ప్రశాంత్ నీల్ గ్యారేజ్ లో సలార్ మరమత్తులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంతే కాదు ప్రభాస్ అవసరం లేని ఒక కీలక ఎపిసోడ్ ని సైతం మళ్ళీ చిత్రీకరించారని తెలిసింది. డార్లింగ్ అందుబాటులోకి వచ్చాక ముఖ్యమైన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయించి డిసెంబర్ లోగా డబ్బింగ్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజుకి ట్రైలర్ వస్తుందా లేదానేది ఇంకా డోలాయమానంలోనే ఉంది. ఇప్పటికిప్పుడు తేల్చే అవకాశం లేకపోవడంతో విడుదల తేదీ సస్పెన్స్ కూడా కొనసాగనుంది. ఓవర్సీస్ హక్కులు ముప్పై ఆరు కోట్లకు పైగానే అమ్మినట్టు ట్రేడ్ న్యూస్.
This post was last modified on September 25, 2023 3:19 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…