గంపెడాశలతో సెప్టెంబర్ లోనే చూసేస్తామని ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు షాక్ ఇస్తూ సలార్ వాయిదా పడటం ఎన్ని ప్రకంపనలకు దారి తీసిందో గత ఇరవై రోజులుగా చూస్తూనే ఉన్నాం. హోంబాలే ఫిలింస్ అధికారిక ప్రకటన ఈ మధ్య ఇచ్చింది కానీ విషయం అప్పటికే పొక్కిపోయి రోజులు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలకమైన కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేసే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు బెంగళూరు టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ తాను అనుకున్న విధంగా రాలేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే వద్దని నిర్మాతలకు తేల్చి చెప్పాడట.
బిజినెస్ పరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికీ అవుట్ ఫుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద సైతం సంతృప్తి వ్యక్తం చేయలేదని సన్నిహితులు అంటున్నారు. పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తపించే తెగించే నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని, వరస ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు అందుకోకపోతే తప్పు మనదే అవుతుంది తప్ప దాన్ని హీరో దురదృష్టం కిందకు తోసేయలేమని అంటున్నారట. 2024 మార్చి ఒక ఆప్షన్ గా పెట్టుకుని లేదంటే సమ్మర్ కి వెళ్లి సోలో రిలీజ్ ఉన్న డేట్ పట్టుకునే ఆలోచనలో ప్రొడ్యూసర్లున్నారు.
మొత్తానికి ప్రశాంత్ నీల్ గ్యారేజ్ లో సలార్ మరమత్తులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంతే కాదు ప్రభాస్ అవసరం లేని ఒక కీలక ఎపిసోడ్ ని సైతం మళ్ళీ చిత్రీకరించారని తెలిసింది. డార్లింగ్ అందుబాటులోకి వచ్చాక ముఖ్యమైన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయించి డిసెంబర్ లోగా డబ్బింగ్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజుకి ట్రైలర్ వస్తుందా లేదానేది ఇంకా డోలాయమానంలోనే ఉంది. ఇప్పటికిప్పుడు తేల్చే అవకాశం లేకపోవడంతో విడుదల తేదీ సస్పెన్స్ కూడా కొనసాగనుంది. ఓవర్సీస్ హక్కులు ముప్పై ఆరు కోట్లకు పైగానే అమ్మినట్టు ట్రేడ్ న్యూస్.
This post was last modified on September 25, 2023 3:19 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…