గంపెడాశలతో సెప్టెంబర్ లోనే చూసేస్తామని ఎదురు చూసిన ప్రభాస్ అభిమానులకు షాక్ ఇస్తూ సలార్ వాయిదా పడటం ఎన్ని ప్రకంపనలకు దారి తీసిందో గత ఇరవై రోజులుగా చూస్తూనే ఉన్నాం. హోంబాలే ఫిలింస్ అధికారిక ప్రకటన ఈ మధ్య ఇచ్చింది కానీ విషయం అప్పటికే పొక్కిపోయి రోజులు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలకమైన కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేసే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు బెంగళూరు టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ తాను అనుకున్న విధంగా రాలేదని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే వద్దని నిర్మాతలకు తేల్చి చెప్పాడట.
బిజినెస్ పరంగా ఎలాంటి ఢోకా లేనప్పటికీ అవుట్ ఫుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద సైతం సంతృప్తి వ్యక్తం చేయలేదని సన్నిహితులు అంటున్నారు. పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తపించే తెగించే నీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని, వరస ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు అందుకోకపోతే తప్పు మనదే అవుతుంది తప్ప దాన్ని హీరో దురదృష్టం కిందకు తోసేయలేమని అంటున్నారట. 2024 మార్చి ఒక ఆప్షన్ గా పెట్టుకుని లేదంటే సమ్మర్ కి వెళ్లి సోలో రిలీజ్ ఉన్న డేట్ పట్టుకునే ఆలోచనలో ప్రొడ్యూసర్లున్నారు.
మొత్తానికి ప్రశాంత్ నీల్ గ్యారేజ్ లో సలార్ మరమత్తులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంతే కాదు ప్రభాస్ అవసరం లేని ఒక కీలక ఎపిసోడ్ ని సైతం మళ్ళీ చిత్రీకరించారని తెలిసింది. డార్లింగ్ అందుబాటులోకి వచ్చాక ముఖ్యమైన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయించి డిసెంబర్ లోగా డబ్బింగ్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ లో ప్రభాస్ పుట్టినరోజుకి ట్రైలర్ వస్తుందా లేదానేది ఇంకా డోలాయమానంలోనే ఉంది. ఇప్పటికిప్పుడు తేల్చే అవకాశం లేకపోవడంతో విడుదల తేదీ సస్పెన్స్ కూడా కొనసాగనుంది. ఓవర్సీస్ హక్కులు ముప్పై ఆరు కోట్లకు పైగానే అమ్మినట్టు ట్రేడ్ న్యూస్.
This post was last modified on September 25, 2023 3:19 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…