బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన కంగనా రనౌత్.. టాలీవుడ్లోనూ ఒక పెద్ద సినిమాలో కథానాయికగా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన చేసిన ఆ చిత్రమే ఏక్ నిరంజన్. ఐతే అందులో ఆమె పాత్ర పెద్దగా క్లిక్ కాలేదు. సినిమా కూడా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో కంగనా మళ్లీ టాలీవుడ్లో కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో ఆమె పెద్ద రేంజికి వెళ్లింది.
నిజానికి ఏక్ నిరంజన్ కంటే ముందు పూరి తీసిన బ్లాక్బస్టర్ మూవీ పోకిరిలో ఆమె కథానాయికగా చేయాల్సిందట. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమాను తనే వదులుకోవాల్సి వచ్చిందని కంగనా రనౌత్ చంద్రముఖి-2 ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పూరి సర్ నాకెంతో నచ్చిన డైరెక్టర్. అసలు నా ప్రతిభను గుర్తించిందే ఆయన.
కెరీర్ ఆరంభంలోనే నన్ను చూసి పెద్ద స్టార్ అవుతానని అంచనా వేశారు. మహేష్ బాబుతో పోకిరి సినిమాకు ఆయన నన్నే కథానాయికగా ఎంచుకున్నారు. ఐతే అదే సమయంలో నాకు గ్యాంగ్స్టర్ మూవీలో ఆఫర్ వచ్చింది. సరిగ్గా అక్టోబరులో రెండు సినిమాలకూ డేట్లు అవసరం అయ్యాయి. నేను గ్యాంగ్స్టర్ మూవీనే ఎంచుకున్నాను.
పోకిరి సినిమాను వదులుకున్నందుకు బాధ అనిపిస్తుంటుంది అని కంగనా వెల్లడించింది. పోకిరి మిస్ అయినప్పటికీ పూరితో ఏక్ నిరంజన్ చేశానని.. అది తనకు ఆనందాన్నిచ్చే విషయమని ఆమె అంది. చంద్రముఖి సీక్వెల్లో ఛాన్స్ రావడం పట్ల చాలా ఎగ్జైట్ అయ్యానని.. ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తమిళంలో దీనికంటే ముందు ఆమె చేసిన తలైవి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…