Movie News

కంగ‌నా పోకిరి చేయాల్సింది కానీ..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఎదిగిన కంగ‌నా ర‌నౌత్‌.. టాలీవుడ్లోనూ ఒక పెద్ద సినిమాలో క‌థానాయిక‌గా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న చేసిన ఆ చిత్ర‌మే ఏక్ నిరంజ‌న్. ఐతే అందులో ఆమె పాత్ర పెద్ద‌గా క్లిక్ కాలేదు. సినిమా కూడా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. దీంతో కంగ‌నా మ‌ళ్లీ టాలీవుడ్‌లో క‌నిపించ‌లేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్లో ఆమె పెద్ద రేంజికి వెళ్లింది.

నిజానికి ఏక్ నిరంజ‌న్ కంటే ముందు పూరి తీసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ పోకిరిలో ఆమె క‌థానాయిక‌గా చేయాల్సింద‌ట‌. కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ సినిమాను త‌నే వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని కంగ‌నా ర‌నౌత్ చంద్ర‌ముఖి-2 ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. పూరి స‌ర్ నాకెంతో న‌చ్చిన డైరెక్ట‌ర్. అస‌లు నా ప్ర‌తిభ‌ను గుర్తించిందే ఆయ‌న‌.

కెరీర్ ఆరంభంలోనే న‌న్ను చూసి పెద్ద స్టార్ అవుతాన‌ని అంచ‌నా వేశారు. మ‌హేష్ బాబుతో పోకిరి సినిమాకు ఆయ‌న న‌న్నే క‌థానాయికగా ఎంచుకున్నారు. ఐతే అదే స‌మ‌యంలో నాకు గ్యాంగ్‌స్ట‌ర్ మూవీలో ఆఫ‌ర్ వ‌చ్చింది. స‌రిగ్గా అక్టోబ‌రులో రెండు సినిమాల‌కూ డేట్లు అవ‌స‌రం అయ్యాయి. నేను గ్యాంగ్‌స్ట‌ర్ మూవీనే ఎంచుకున్నాను.

పోకిరి సినిమాను వ‌దులుకున్నందుకు బాధ అనిపిస్తుంటుంది అని కంగ‌నా వెల్ల‌డించింది. పోకిరి మిస్ అయిన‌ప్ప‌టికీ పూరితో ఏక్ నిరంజ‌న్ చేశాన‌ని.. అది త‌న‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మ‌ని ఆమె అంది. చంద్ర‌ముఖి సీక్వెల్లో ఛాన్స్ రావ‌డం ప‌ట్ల చాలా ఎగ్జైట్ అయ్యాన‌ని.. ఆ సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని.. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడుతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసింది. త‌మిళంలో దీనికంటే ముందు ఆమె చేసిన త‌లైవి డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago