ఇంకా కాలేజీ చదువు కూడా దాటని గారాల కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడాన్ని తమిళ హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోవడం చూస్తున్నాం. తనతో పాటు నేను కూడా చనిపోయానని నిన్న చేసిన ట్వీట్ హృదయాలను మెలిపెట్టేలా ఉంది. పిల్లలే ప్రపంచంగా బ్రతికే తండ్రికి అందులో ఒకరు దూరమైతే కలిగే బాధను ప్రపంచంలో ఎవరూ ఓదార్చలేరు. అతన్ని కలిసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం విజయ్ ఆంటోనీని చూస్తూ కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా ఉందట. ఇంత బాధలో ఉన్నా తన కొత్త సినిమా విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం.
అక్టోబర్ 6న విజయ్ ఆంటోనీ కొత్త మూవీ రత్తం రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు వాయిదాల తర్వాత మంచి డేట్ చూసుకుని రంగంలోకి దిగుతోంది. సిఎస్ ఆముదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ కూడా సిద్ధమవుతోంది. క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పని చేసే ఆఫీసర్ గా విజయ్ ఆంటోనీ ఇందులో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించాడు. కిందటి వారం నుంచే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. అయితే బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను ముందస్తుగానే లాక్ చేసుకోవడంతో ఒకవేళ మళ్ళీ వాయిదా అంటే నిర్మాతకు బాగా నష్టం వస్తుంది.
ఈ కారణంగానే రత్తంని అనుకున్న టైంకే రిలీజ్ చేసేయమని ఓదార్చడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు విజయ్ ఆంటోనీ చెప్పేసినట్టు తెలిసింది. ప్రమోషన్ లోనూ పరిమితంగా పాల్గొంటానని, జరిగిన దుర్ఘటన మర్చిపోయి కూతురు కోరుకున్నది చేయాలంటే వెంటనే సినిమాల్లో యాక్టివ్ కావడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారట. బిచ్చగాడుతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే చూశాడు కానీ ఆ బ్రాండే అతన్ని కాపాడుతూ వస్తోంది. సీక్వెల్ సైతం తమిళంలో కన్నా తెలుగులోనే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 7:47 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…