ఇంకా కాలేజీ చదువు కూడా దాటని గారాల కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడాన్ని తమిళ హీరో విజయ్ ఆంటోనీ జీర్ణించుకోలేకపోవడం చూస్తున్నాం. తనతో పాటు నేను కూడా చనిపోయానని నిన్న చేసిన ట్వీట్ హృదయాలను మెలిపెట్టేలా ఉంది. పిల్లలే ప్రపంచంగా బ్రతికే తండ్రికి అందులో ఒకరు దూరమైతే కలిగే బాధను ప్రపంచంలో ఎవరూ ఓదార్చలేరు. అతన్ని కలిసిన వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం విజయ్ ఆంటోనీని చూస్తూ కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా ఉందట. ఇంత బాధలో ఉన్నా తన కొత్త సినిమా విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం.
అక్టోబర్ 6న విజయ్ ఆంటోనీ కొత్త మూవీ రత్తం రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు వాయిదాల తర్వాత మంచి డేట్ చూసుకుని రంగంలోకి దిగుతోంది. సిఎస్ ఆముదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ కూడా సిద్ధమవుతోంది. క్రైమ్ డిపార్ట్ మెంట్ లో పని చేసే ఆఫీసర్ గా విజయ్ ఆంటోనీ ఇందులో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించాడు. కిందటి వారం నుంచే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. అయితే బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను ముందస్తుగానే లాక్ చేసుకోవడంతో ఒకవేళ మళ్ళీ వాయిదా అంటే నిర్మాతకు బాగా నష్టం వస్తుంది.
ఈ కారణంగానే రత్తంని అనుకున్న టైంకే రిలీజ్ చేసేయమని ఓదార్చడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు విజయ్ ఆంటోనీ చెప్పేసినట్టు తెలిసింది. ప్రమోషన్ లోనూ పరిమితంగా పాల్గొంటానని, జరిగిన దుర్ఘటన మర్చిపోయి కూతురు కోరుకున్నది చేయాలంటే వెంటనే సినిమాల్లో యాక్టివ్ కావడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారట. బిచ్చగాడుతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే చూశాడు కానీ ఆ బ్రాండే అతన్ని కాపాడుతూ వస్తోంది. సీక్వెల్ సైతం తమిళంలో కన్నా తెలుగులోనే పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2023 7:47 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…