ఇవాళ చిన్న సినిమాలు చాలానే రిలీజయ్యాయి. పెద్దవి లేకపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యథాశక్తి ప్రమోషన్లు చేసుకుని థియేటర్లలో అడుగు పెట్టాయి. కానీ దేనికీ కనీస ఓపెనింగ్స్ లేవు. అష్టదిగ్బంధనం, ఛీటర్, మట్టి కథ, నచ్చినవాడు, నెల్లూరి నెరజాణ, ఓయ్ ఇడియట్, రుద్రంకోట, వారెవ్వా జతగాళ్ళు ఇలా 8 స్ట్రెయిట్ మూవీస్ విడుదలైతే డబ్బింగ్ బ్యాచు నుంచి ఒక వర్గం ప్రత్యేక అంచనాలతో కన్నడ అనువాదం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణ కావడంతో భారీగా కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు దక్కాయి.
ఇవి కాకుండా కలివీరుడు, ఎక్స్ పెండబుల్స్ 4, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలు లిస్టులో ఉన్నాయి. ఇక్కడ మిస్ అయినవి లేకపోలేదు. వీటికన్నా మెరుగ్గా రీ రిలీజ్ 7జి బృందావన కాలనీ వసూళ్లు రాబడుతుందని బయ్యర్లు అంచనా వేశారు. ట్రాజెడీ ఏంటంటే జనాలు అసలు థియేటర్లలు వెళ్లే మూడ్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. దానికి రెండు కారణాలు. ఒకటి వినాయక చవితి పండగ సంబరాలకు సగటు మధ్యతరగతి జీవుల దగ్గర డబ్బులు ఖర్చయిపోవడం. మరొకటి పొడిగా ఉన్న వాతావరణం వల్ల కొత్త సినిమాలు చూడాలని ఉత్సాహం రేపేంత రేంజ్ లో ఏవీ కనిపించకపోవడం.
ఒకవేళ స్కంద వచ్చి ఉంటే సీన్ ఇలా ఉండేది కాదు. కానీ సలార్ డేట్ వాడుకోవాలని నెలాఖరుకు వెళ్లడంతో చిక్కొచ్చి పడింది. దీంతో ఈ శుక్రవారం ఇలా మారిపోయింది. ఇక్కడ చెప్పిన వాటికన్నా జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలే కొంచెం మెరుగ్గా కనిపించాయంటే అతిశయోక్తి కాదు. ఓటిటి కంపెనీలు థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామనే కండీషన్ ని కఠినతరం చేయడంతో ఛోటా ప్రొడ్యూసర్లు గంపగుత్తగా బాక్సాఫీస్ మీద పడిపోవడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. దీని వల్ల ఒనగూరుతున్న ప్రయోజనం కూడా ఒకరిద్దరికే దక్కుతోంది తప్ప అందరికీ కాదు.
This post was last modified on September 22, 2023 6:00 pm
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…