ఇవాళ చిన్న సినిమాలు చాలానే రిలీజయ్యాయి. పెద్దవి లేకపోవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు యథాశక్తి ప్రమోషన్లు చేసుకుని థియేటర్లలో అడుగు పెట్టాయి. కానీ దేనికీ కనీస ఓపెనింగ్స్ లేవు. అష్టదిగ్బంధనం, ఛీటర్, మట్టి కథ, నచ్చినవాడు, నెల్లూరి నెరజాణ, ఓయ్ ఇడియట్, రుద్రంకోట, వారెవ్వా జతగాళ్ళు ఇలా 8 స్ట్రెయిట్ మూవీస్ విడుదలైతే డబ్బింగ్ బ్యాచు నుంచి ఒక వర్గం ప్రత్యేక అంచనాలతో కన్నడ అనువాదం సప్త సాగరాలు దాటి సైడ్ ఏ వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణ కావడంతో భారీగా కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు దక్కాయి.
ఇవి కాకుండా కలివీరుడు, ఎక్స్ పెండబుల్స్ 4, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలు లిస్టులో ఉన్నాయి. ఇక్కడ మిస్ అయినవి లేకపోలేదు. వీటికన్నా మెరుగ్గా రీ రిలీజ్ 7జి బృందావన కాలనీ వసూళ్లు రాబడుతుందని బయ్యర్లు అంచనా వేశారు. ట్రాజెడీ ఏంటంటే జనాలు అసలు థియేటర్లలు వెళ్లే మూడ్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. దానికి రెండు కారణాలు. ఒకటి వినాయక చవితి పండగ సంబరాలకు సగటు మధ్యతరగతి జీవుల దగ్గర డబ్బులు ఖర్చయిపోవడం. మరొకటి పొడిగా ఉన్న వాతావరణం వల్ల కొత్త సినిమాలు చూడాలని ఉత్సాహం రేపేంత రేంజ్ లో ఏవీ కనిపించకపోవడం.
ఒకవేళ స్కంద వచ్చి ఉంటే సీన్ ఇలా ఉండేది కాదు. కానీ సలార్ డేట్ వాడుకోవాలని నెలాఖరుకు వెళ్లడంతో చిక్కొచ్చి పడింది. దీంతో ఈ శుక్రవారం ఇలా మారిపోయింది. ఇక్కడ చెప్పిన వాటికన్నా జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలే కొంచెం మెరుగ్గా కనిపించాయంటే అతిశయోక్తి కాదు. ఓటిటి కంపెనీలు థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామనే కండీషన్ ని కఠినతరం చేయడంతో ఛోటా ప్రొడ్యూసర్లు గంపగుత్తగా బాక్సాఫీస్ మీద పడిపోవడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. దీని వల్ల ఒనగూరుతున్న ప్రయోజనం కూడా ఒకరిద్దరికే దక్కుతోంది తప్ప అందరికీ కాదు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…