మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఉర్రూతలూగించేశాడు రాజమౌళి. అదిరిపోయే విజువల్స్, వావ్ అనిపించే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెన్స్.. గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్తో అ్లలూరి సీతారామరాజు పాత్ర పరిచయ వీడియో అద్భుత స్పందన వచ్చింది.
అది చూశాక మే 20న తారక్ పుట్టిన రోజుకు ఇదే తరహా పవర్ ఫుల్ టీజర్ విత్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని ఫిక్సయిపోయి ఉన్నారు నందమూరి అభిమానులు. కానీ లాక్ డౌన్ వల్ల తారక్ కోసం టీజర్ రెడీ చేసే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత నెలలు గడిచిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్ల పెట్టి ఆపేసింది. దీంతో తారక్ టీజర్ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈ టీజర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న జక్కన్న తాజాగా ఓ టీవీ ఛానెల్తో మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను పున:ప్రారంభించడంతో పాటు తారక్ టీజర్ రిలీజ్ చేయడం గురించి ఇందులో జక్కన్న మాట్లాడాడు. ప్రస్తుతం హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనే విషయమై తాము వైద్య నిపుణులతో మాట్లాడుతున్నామని.. వాళ్ల సూచనల్ని బట్టి షూటింగ్ పున:ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపాడు.
వైద్యులు ఓకే అంటే రెండు మూడు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. ఐతే చిత్రీకరణ మొదలుపెట్టి అంతా ఓకే అనుకున్నాక తారక్ టీజర్ కోసం కంటెంట్ రూపొందించడానికి 10-15 రోజులు సమయం పడుతుందని రాజమౌళి తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల ఏదో ఒక దశలో షూటింగ్ మొదలైతే.. నెలాఖరుకు టీజర్ కంటెంట్ రెడీ అవుతుందేమో. ఆ తర్వాతి నెలలో దసరా వస్తుంది కాబట్టి అప్పటికి టీజర్ను రిలీజ్ చేసే అవకాశముంది.
This post was last modified on August 23, 2020 1:42 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…