మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఉర్రూతలూగించేశాడు రాజమౌళి. అదిరిపోయే విజువల్స్, వావ్ అనిపించే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెన్స్.. గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్తో అ్లలూరి సీతారామరాజు పాత్ర పరిచయ వీడియో అద్భుత స్పందన వచ్చింది.
అది చూశాక మే 20న తారక్ పుట్టిన రోజుకు ఇదే తరహా పవర్ ఫుల్ టీజర్ విత్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని ఫిక్సయిపోయి ఉన్నారు నందమూరి అభిమానులు. కానీ లాక్ డౌన్ వల్ల తారక్ కోసం టీజర్ రెడీ చేసే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత నెలలు గడిచిపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్ల పెట్టి ఆపేసింది. దీంతో తారక్ టీజర్ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈ టీజర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న జక్కన్న తాజాగా ఓ టీవీ ఛానెల్తో మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను పున:ప్రారంభించడంతో పాటు తారక్ టీజర్ రిలీజ్ చేయడం గురించి ఇందులో జక్కన్న మాట్లాడాడు. ప్రస్తుతం హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనే విషయమై తాము వైద్య నిపుణులతో మాట్లాడుతున్నామని.. వాళ్ల సూచనల్ని బట్టి షూటింగ్ పున:ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపాడు.
వైద్యులు ఓకే అంటే రెండు మూడు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. ఐతే చిత్రీకరణ మొదలుపెట్టి అంతా ఓకే అనుకున్నాక తారక్ టీజర్ కోసం కంటెంట్ రూపొందించడానికి 10-15 రోజులు సమయం పడుతుందని రాజమౌళి తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల ఏదో ఒక దశలో షూటింగ్ మొదలైతే.. నెలాఖరుకు టీజర్ కంటెంట్ రెడీ అవుతుందేమో. ఆ తర్వాతి నెలలో దసరా వస్తుంది కాబట్టి అప్పటికి టీజర్ను రిలీజ్ చేసే అవకాశముంది.
This post was last modified on August 23, 2020 1:34 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…