మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఉర్రూతలూగించేశాడు రాజమౌళి. అదిరిపోయే విజువల్స్, వావ్ అనిపించే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెన్స్.. గూస్ బంప్స్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్తో అ్లలూరి సీతారామరాజు పాత్ర పరిచయ వీడియో అద్భుత స్పందన వచ్చింది.
అది చూశాక మే 20న తారక్ పుట్టిన రోజుకు ఇదే తరహా పవర్ ఫుల్ టీజర్ విత్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని ఫిక్సయిపోయి ఉన్నారు నందమూరి అభిమానులు. కానీ లాక్ డౌన్ వల్ల తారక్ కోసం టీజర్ రెడీ చేసే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత నెలలు గడిచిపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ టీం షూటింగ్ కోసం సన్నాహాలు మొదలు పెట్టినట్ల పెట్టి ఆపేసింది. దీంతో తారక్ టీజర్ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈ టీజర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి.
ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న జక్కన్న తాజాగా ఓ టీవీ ఛానెల్తో మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను పున:ప్రారంభించడంతో పాటు తారక్ టీజర్ రిలీజ్ చేయడం గురించి ఇందులో జక్కన్న మాట్లాడాడు. ప్రస్తుతం హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఎలా ఉందనే విషయమై తాము వైద్య నిపుణులతో మాట్లాడుతున్నామని.. వాళ్ల సూచనల్ని బట్టి షూటింగ్ పున:ప్రారంభిస్తామని రాజమౌళి తెలిపాడు.
వైద్యులు ఓకే అంటే రెండు మూడు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. ఐతే చిత్రీకరణ మొదలుపెట్టి అంతా ఓకే అనుకున్నాక తారక్ టీజర్ కోసం కంటెంట్ రూపొందించడానికి 10-15 రోజులు సమయం పడుతుందని రాజమౌళి తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల ఏదో ఒక దశలో షూటింగ్ మొదలైతే.. నెలాఖరుకు టీజర్ కంటెంట్ రెడీ అవుతుందేమో. ఆ తర్వాతి నెలలో దసరా వస్తుంది కాబట్టి అప్పటికి టీజర్ను రిలీజ్ చేసే అవకాశముంది.
This post was last modified on August 23, 2020 1:34 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…