కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో పేరుకి తమిళ సినిమానే కానీ క్రేజ్ మాత్రం ఇతర భాషల్లో ఓ రేంజ్ లో పుంజుకుంటోంది. వరసగా వదులుతున్న పోస్టర్ల మీద సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగే కనిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి ఇది ఆశించలేదని ఒక వర్గం అంటుండగా, తుపాను ముందు ప్రశాంతతలా కావాలనే లో ప్రొఫైల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారని ఫ్యాన్స్ అంటున్నారు. తెలుగులో అత్యధిక రేటు పెట్టి కొన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులకు ధీటుగా స్క్రీన్ షేరింగ్ ఉంటుందని ట్రేడ్ టాక్.
దీని సంగతలా ఉంచితే లియోలో అసలు పాయింట్ మన మున్నాకు దగ్గరగా ఉంటుందని కోలీవుడ్ టాక్. అదేంటంటే మున్నాలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ మీద స్వంత కొడుకు ప్రభాసే ప్రతీకారం తీర్చుకోవడం మీద దర్శకుడు వంశీ పైడిపల్లి ఏదో వెరైటీగా యాక్షన్ టచ్ తో ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడదే అంశాన్ని తీసుకుని లోకేష్ తనదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. ఆంటోనీ దాస్ గా నటించిన సంజయ్ దత్ కు హీరో విజయ్ కు మధ్య క్లాష్, మధ్యలో అన్నగా నటిస్తున్న అర్జున్ తో యాక్షన్ ప్లస్ ఎమోషన్ తో నడుస్తుందట.
ఇది ఖచ్చితంగా నిజమేనని ఆధారమేమీ లేదు కానీ అంతర్గతంగా వినిపిస్తున్న ప్రకారమైతే అంత ఈజీగా కొట్టిపారేయలేం. కథ ఎలా ఉన్నా కథనంలో ప్రత్యేకమైన మార్క్ చూపిస్తున్న లోకేష్ కనగరాజ్ లియోని అంచనాలకు మించి తీశాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. ఇప్పటిదాకా అపజయం ఎరుగని డైరెక్టర్ల లిస్టులో కొనసాగుతున్న ఈ విలక్షణ దర్శకుడు ఈసారి అనిరుద్ రవిచందర్ నుంచి ఎలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడో చూడాలి. అన్నట్టు లియో కూడా రివెంజ్ డ్రామానే. ఏదో రెగ్యులర్ గా కాకుండా ఒళ్ళు గగుర్పొడిచేలా విజయ్ ఫ్లాష్ బ్యాక్ ని డిజైన్ చేశాడట. చూద్దాం.
This post was last modified on September 22, 2023 1:46 pm
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…