ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్లో భారీ అంచనాలతో రాబోతున్న పెద్ద సినిమాల్లో ‘లియో’ ఒకటి. ఇది తమిళ సినిమానే అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగు, హిందీలో కూడా ‘లియో’కు క్రేజ్ తక్కువగా లేదు. ‘విక్రమ్’ తర్వాత నార్త్లో కూడా లోకేష్ కనకరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోగా.. సంజయ్ దత్ విలన్ పాత్ర చేస్తుండటం అక్కడ సినిమాకు మరింత హైప్ వచ్చేలా చేసింది.
కానీ ఈ మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసే భాగ్యం హిందీ ప్రేక్షకులకు దక్కేలా లేదు. అందుక్కారణం.. థియేట్రికల్ రిలీజ్కు, డిజిటల్ రిలీజ్కు మధ్య గ్యాప్ 8 వారాలు లేకపోవడమే. ఈ అంతరం లేని హిందీ చిత్రాలను నేషనల్ మల్టీప్లెక్సులు ప్రదర్శించడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘జైలర్’కు కూడా మల్టీప్లెక్సులు నో చెప్పాయి.
ఇప్పుడు ‘లియో’కు సైతం ఈ విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. ఆల్రెడీ ఒక పెద్ద ఓటీటీతో డిజిటల్ డీల్ పూర్తి చేసింది ‘లియో’ టీం. నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. పెద్ద మొత్తంలో డీల్ కుదరడంతో దాన్ని మార్చే పరిస్థితి లేదు. హిందీలో సినిమాకు మంచి క్రేజే ఉన్నప్పటికీ మల్టీప్లెక్సుల్లో వచ్చే ఆ ఆదాయం కోసమని డిజిటల్ డీల్ను రివైజ్ చేయాలనుకోవట్లేదు చిత్ర బృందం.
దీంతో హిందీలో ఈ సినిమా కేవలం సింగిల్ స్క్రీన్లలో మాత్రమే రిలీజ్ కాబోతోంది. దసరా కానుకగా అక్టోబరు 19న ‘లియో’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ రిలీజ్ చేస్తోంది. విజయ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే తెలుగులో విజయ్కి ఇది హైయెస్ట్ గ్రాసర్ కూడా కావచ్చు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…