ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక యంగ్ హీరో.. హీరోగా తొలి సినిమాతో మొదలుపెట్టి హ్యాట్రిక్ హిట్లు కొట్టడం అన్నది అరుదైన విషయమే. నవీన్ పొలిశెట్టి ఈ ఘనతే సాధించాడు ఇటీవల. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఈ మూడు చిత్రాలతో అతడి హ్యాట్రిక్ పూర్తయింది. ఈ సినిమాలు పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడి సక్సెస్ అయినవి. ఏదో అదృష్టం కలిసొచ్చో.. పబ్లిసిటీ గిమ్మిక్కులతో ఆడేసిన సినిమాలు కావివి.
ఈ మూడు చిత్రాల విజయాల్లో నవీన్ పొలిశెట్టి పాత్ర అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నవీన్ లేని ఈ మూడు చిత్రాలను అసలు ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన పెర్ఫామెన్స్తో ఆ పాత్రలు, సినిమాలను నిలబెట్టాడు నవీన్. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో అతడి మీద ప్రేక్షకుల్లో నమ్మకం మరింత పెరిగింది.
నవీన్ సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్కు వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారు ఆడియన్స్. ఇలాంటి భరోసా కలిగించే హీరోను పెద్ద నిర్మాణ సంస్థలు ఎందుకు వదులుకుంటాయి. ఇప్పటికే వైజయంతీ మూవీస్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లలో నటించిన నవీన్.. ప్రస్తుతం టాలీవుడ్లోనే టాప్ బేనర్ అయిన మైత్రీ మూవీ మేకర్స్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు.
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.. నవీన్ను కలిసి హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంపై అభినందించారు. అంతే కాక నవీన్తో తమ బేనర్లో సినిమా రాబోతోందని సంకేతాలు ఇచ్చారు. కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురు చూడాలని అన్నారు. నవీన్తో ఒక ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రేక్షకులను ఊరించారు కూడా. దీన్ని బట్టి అతి త్వరలోనే మైత్రీ సంస్థలో నవీన్ కొత్త సినిమా ప్రకటన ఉంటుందని అర్థమవుతోంది.
This post was last modified on September 21, 2023 9:52 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…