అఖండ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను నుంచి వస్తున్న సినిమా స్కంద. ఎనర్జిటిక్ స్టార్ రామ్తో బోయపాటి జట్టు కట్టడంతో ఈ సినిమాపై ముందు మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్, టీజర్ లాంచ్ అయినంత వరకు అంతా బాగానే ఉంది. కానీ ట్రైలర్ లాంచ్ అయ్యాక పరిస్థితి మారిపోయింది. మరీ రొడ్డకొట్టుడు స్టయిల్లో ట్రైలర్ సాగడంతో జనాలకు సినిమా మీద పెద్దగా ఆసక్తి కలగలేదు.
బోయపాటి మైండ్ లెస్ మాస్.. బాలయ్యకు సెట్ అయినట్లు వేరే హీరోలకు సెట్ కాదన్నది తెలిసిన సంగతే. రామ్ విషయంలోనూ అదే జరిగినట్లు కనిపించింది ట్రైలర్ చూస్తే. ఓవర్ ద టాప్ మాస్, యాక్షన్, డ్రామా చూసి జనాలకు సినిమా మీద నెగెటివ్ ఫీలింగ్ వచ్చేసింది.
దీనికి తోడు సినిమా నుంచి రిలీజ్ చేసిన ఏ పాటా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. లేటెస్ట్గా వచ్చిన కల్ట్ మామా పాటతోనూ తమన్ నిరాశ పరిచాడు. సినిమా అనుకున్న తేదీ నుంచి వాయిదా పడటం.. ప్రమోషన్ల హడావుడి తగ్గిపోవడం కూడా మైనస్ అయి స్కందకు హైప్ క్రియేట్ కాలేదు. ఐతే రిలీజ్ వీక్లో ఎలాగైనా హైప్ పెంచాలని టీం చూస్తోంది.
ఇందులో భాగంగా కొత్త ట్రైలర్ రెడీ చేస్తున్నారట. ఈసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎలిమెంట్స్ జోడించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది. ఆ ట్రైలర్ వచ్చాక సినిమా మీద అభిప్రాయం మారుతుందని ఆశిస్తోంది టీం. అలాగే రిలీజ్ వీక్లో ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తారట. కొత్తగా పెద్ద స్థాయిలో ఇంకో ఈవెంట్ కూడా చేస్తారట. మొత్తంగా 28న సినిమా మంచి బజ్ మధ్య రిలీజయ్యేలా.. భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…