తెలుగులో ఈ రోజు ఒక ఆసక్తికర చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు.. మార్టిన్ లూథర్ కింగ్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేష్ బాబు హీరో కావడం విశేషం. సంపూ హీరోగా హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలు చూశాం. వాటి వరకు అతను బాగానే సెట్ అయ్యాడు. కానీ రెగ్యులర్ కామెడీ రోల్స్ ఇస్తే సంపూ పెద్దగా మెప్పించలేకపోయాడు.
దీంతో ఒక దశ తర్వాత అతను కనుమరుగైపోయాడు. అలాంటి నటుడిని లీడ్ రోల్లో పెట్టి ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తీశారు. పూజా కొల్లూరు ఈ చిత్రాన్ని రూపొందించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో పాటు ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు. ఆల్రెడీ సినిమాను పూర్తి చేసి నేరుగా ఫస్ట్ లుక్తోనే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
‘మార్టిన్ లూథర్ కింగ్’ స్ట్రెయిట్ మూవీ కాదు. ఇదొక రీమేక్. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మండేలా’ ఆధారంగా తెరకెక్కింది. ఒరిజినల్లో యోగి బాబు లీడ్ రోల్ చేశాడు. ఇది ఒక బార్బర్ కథ. ఒక ఊరిలో పంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితుల్లో ఆ బార్బర్ ఓటే ఫలితాన్ని నిర్దేశించే పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా అతణ్ని చాలా చిన్న చూపు చూసిన జనాలు.. తన ఓటు కీలకం కావడంతో అతణ్ని మహారాజులా చూసుకోవడం మొదలుపెడతాయి. చివరికి ఏమైందన్నది మిగతా కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే.. చివర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఉంటుందీ సినిమా.
తమిళంలో గత కొన్నేళ్లలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇదొకటి. యోగిబాబు సూపర్ పెర్ఫామెన్స్తో మండేలా సినిమాను నిలబెట్టాడు. అతను కామెడీతో పాటు ఎమోషన్లను కూడా గొప్పగా పండించాడు. అలాంటి పాత్రకు సంపూను తీసుకోవడం అంటే సాహసమే. స్పూఫ్ కామెడీల వరకు ఓకే కానీ.. సంపూ ఇలాంటి పాత్రను పండించగలడా అన్నది ప్రశ్న. అతను మెప్పిస్తే మాత్రం సినిమా మంచి ఫలితాన్నందుకునే అవకాశముంది. అక్టోబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on September 19, 2023 2:31 pm
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…