తెలుగులో ఈ రోజు ఒక ఆసక్తికర చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరు.. మార్టిన్ లూథర్ కింగ్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేష్ బాబు హీరో కావడం విశేషం. సంపూ హీరోగా హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలు చూశాం. వాటి వరకు అతను బాగానే సెట్ అయ్యాడు. కానీ రెగ్యులర్ కామెడీ రోల్స్ ఇస్తే సంపూ పెద్దగా మెప్పించలేకపోయాడు.
దీంతో ఒక దశ తర్వాత అతను కనుమరుగైపోయాడు. అలాంటి నటుడిని లీడ్ రోల్లో పెట్టి ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా తీశారు. పూజా కొల్లూరు ఈ చిత్రాన్ని రూపొందించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడంతో పాటు ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు. ఆల్రెడీ సినిమాను పూర్తి చేసి నేరుగా ఫస్ట్ లుక్తోనే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
‘మార్టిన్ లూథర్ కింగ్’ స్ట్రెయిట్ మూవీ కాదు. ఇదొక రీమేక్. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మండేలా’ ఆధారంగా తెరకెక్కింది. ఒరిజినల్లో యోగి బాబు లీడ్ రోల్ చేశాడు. ఇది ఒక బార్బర్ కథ. ఒక ఊరిలో పంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితుల్లో ఆ బార్బర్ ఓటే ఫలితాన్ని నిర్దేశించే పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా అతణ్ని చాలా చిన్న చూపు చూసిన జనాలు.. తన ఓటు కీలకం కావడంతో అతణ్ని మహారాజులా చూసుకోవడం మొదలుపెడతాయి. చివరికి ఏమైందన్నది మిగతా కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే.. చివర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఉంటుందీ సినిమా.
తమిళంలో గత కొన్నేళ్లలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇదొకటి. యోగిబాబు సూపర్ పెర్ఫామెన్స్తో మండేలా సినిమాను నిలబెట్టాడు. అతను కామెడీతో పాటు ఎమోషన్లను కూడా గొప్పగా పండించాడు. అలాంటి పాత్రకు సంపూను తీసుకోవడం అంటే సాహసమే. స్పూఫ్ కామెడీల వరకు ఓకే కానీ.. సంపూ ఇలాంటి పాత్రను పండించగలడా అన్నది ప్రశ్న. అతను మెప్పిస్తే మాత్రం సినిమా మంచి ఫలితాన్నందుకునే అవకాశముంది. అక్టోబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on September 19, 2023 2:31 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…