Movie News

మేడమ్ టుస్సాడ్స్‌కు బన్నీ

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉండటం గొప్ప గౌరవం. ఇండియన్ సినిమాకు సంబంధించి ఎప్పుడూ బాలీవుడ్ తారలకు మాత్రమే ఇక్కడ చోటు దక్కేది. సౌత్ ఇండియన్ సెలబ్రెటీలను ఇందుకు పరిగణనలోకే తీసుకునే వారు కాదు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి మారింది. సౌత్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్లో గొప్ప పేరు సంపాదించాక మన వాళ్లకూ ఆ మ్యూజియంలో అవకాశం దక్కుతోంది.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబుల మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్‌లో అడుగు పెట్టాయి. అల్లు అర్జున్ సైతం ఈ మ్యూజియంలో అవకాశం దక్కించుకున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందుకు సన్నాహాలు మొదలయ్యాయి. బన్నీ తన మైనపు విగ్రహానికి కొలతలు ఇచ్చేందుకు ఇక్కడ్నుంచి బయల్దేరుతున్నాడు.

లండన్‌లోని మేడం టుస్సాడ్స్‌కే వెళ్లి బన్నీ తన విగ్రహం కోసం కొలతలు ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం అతను ‘పుష్ప-2’ షూట్ నుంచి కూడా బ్రేక్ తీసుకుంటున్నాడు. మరో రెండు రోజుల్లో బన్నీ లండన్ బయల్దేరుతున్నట్లు సమాచారం. రెండు రోజులు అక్కడే ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని బన్నీ ఇండియాకు తిరిగి వస్తాడు. విగ్రహం వచ్చే ఏడాది ఆవిష్కృతం కావచ్చని సమాచారం.

ఇటీవలే బన్నీ ‘పుష్ప’ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకోవడంతో అతడి పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా అతను ఎదిగాడు. అతను నటిస్తున్న ‘పుష్ప-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీ రేంజ్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. ‘పుష్ప-2’ విడుదలయ్యే సమయానికి టుస్సాడ్స్‌లో బన్నీ విగ్రహం కూడా ఆవిష్కృతం అయితే తన పాపులారిటీ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on September 25, 2023 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

29 minutes ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

5 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

9 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

9 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

11 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

11 hours ago