బిగ్బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఆల్రెడీ కంటెస్ట్లెను హోమ్ క్వారంటైన్కి పంపించారు. పధ్నాలుగు రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత వాళ్లంతా బిగ్బాస్ హౌస్లోకి వెళతారు. హౌస్లోకి వెళ్లే వాళ్లు తప్ప మరెవరూ వీరితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవరు.
హోస్ట్ నాగార్జున కూడా వీరిని స్టేజీపై పరిచయం చేయబోవడం లేదు. అసలు ఈసారి ఎప్పటిలా ఆడియన్స్ ని ఆహ్వానించే స్టేజ్ వుండదు. మొత్తం ఇన్డోర్స్లోనే ప్లాన్ చేసారు. వివిధ సెలబ్రిటీలను షోకి ఆహ్వానించడం కూడా వుండదు.
కాకపోతే ప్రమోషన్స్ కోసం వచ్చే వారిని వీడియో కాల్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్ సభ్యులతో మాట్లాడిస్తారు. కుటుంబ సభ్యులను పిలిచే కార్యక్రమం కూడా వుండదు. అది కూడా వీడియో కాల్ ద్వారానే జరుగుతుంది. ఈసారి బిగ్ బాస్ షో రసవత్తరంగా వుండే అవకాశముంది.
ఎందుకంటే గతంలో బయటి వాళ్లు వచ్చి లీకులు ఇవ్వడంతో ఎవరు లీడింగ్లో వున్నారనేది హౌస్లో వాళ్లకు తెలిసిపోయేది. తదననుగుణంగా వారు తమ గేమ్ ప్లాన్ మారుస్తూ వుండేవాళ్లు. కానీ ఈసారి అలా లీక్స్ ఇచ్చే వీలుండదు. అలాగే బిగ్బాస్ ఎలిమినేషన్ సంగతులు కూడా ముందే లీక్ అయ్యే ఛాన్సుండదు.
This post was last modified on August 23, 2020 12:06 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…