బిగ్బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఆల్రెడీ కంటెస్ట్లెను హోమ్ క్వారంటైన్కి పంపించారు. పధ్నాలుగు రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత వాళ్లంతా బిగ్బాస్ హౌస్లోకి వెళతారు. హౌస్లోకి వెళ్లే వాళ్లు తప్ప మరెవరూ వీరితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవరు.
హోస్ట్ నాగార్జున కూడా వీరిని స్టేజీపై పరిచయం చేయబోవడం లేదు. అసలు ఈసారి ఎప్పటిలా ఆడియన్స్ ని ఆహ్వానించే స్టేజ్ వుండదు. మొత్తం ఇన్డోర్స్లోనే ప్లాన్ చేసారు. వివిధ సెలబ్రిటీలను షోకి ఆహ్వానించడం కూడా వుండదు.
కాకపోతే ప్రమోషన్స్ కోసం వచ్చే వారిని వీడియో కాల్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్ సభ్యులతో మాట్లాడిస్తారు. కుటుంబ సభ్యులను పిలిచే కార్యక్రమం కూడా వుండదు. అది కూడా వీడియో కాల్ ద్వారానే జరుగుతుంది. ఈసారి బిగ్ బాస్ షో రసవత్తరంగా వుండే అవకాశముంది.
ఎందుకంటే గతంలో బయటి వాళ్లు వచ్చి లీకులు ఇవ్వడంతో ఎవరు లీడింగ్లో వున్నారనేది హౌస్లో వాళ్లకు తెలిసిపోయేది. తదననుగుణంగా వారు తమ గేమ్ ప్లాన్ మారుస్తూ వుండేవాళ్లు. కానీ ఈసారి అలా లీక్స్ ఇచ్చే వీలుండదు. అలాగే బిగ్బాస్ ఎలిమినేషన్ సంగతులు కూడా ముందే లీక్ అయ్యే ఛాన్సుండదు.
This post was last modified on August 23, 2020 12:06 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…