సరిగ్గా ఇంకో పదే రోజుల్లో స్కంద విడుదల కానుంది. కౌంట్ డౌన్ పోస్టర్లు వదులుతున్నారు. సహజంగా ఇంత పెద్ద మూవీ చేయాల్సిన హడావిడి ఎందుకో దీనికి జరగడం లేదు. సినిమా మీద నమ్మకమో లేక పోటీ వీక్ గా ఉంది కాబట్టి గెలిచే తీరతామనే ధీమానో తెలియదు కానీ మొత్తానికి టీమ్ అయితే సైలెంట్ గానే ఉంది. రామ్, శ్రీలీల, బోయపాటి శీను ఇంకో రెండు మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు గట్రా మొదలుపెట్టబోతున్నారు. ప్రెస్ మీట్లు వగైరా ఎలాగూ ఉంటాయి. ఇవాళ కల్ట్ మామా స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ట్యూన్ పర్లేదు కానీ మరీ ఆహా ఓహో అనిపించే రేంజ్ అయితే కాదు.
కాంపిటీషన్ ని ఎంత తేలిగ్గా తీసుకున్నా స్కంద మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. చంద్రముఖి 2 ట్రైలర్ చూశాక దాని మీద నెగటివ్ వైబ్రేషన్స్ వచ్చిన మాట వాస్తవం. పాత కథనే మళ్ళీ తీశారనే ఫీలింగ్ దర్శకుడు పి వాసు కలిగించినా ఊహించని సర్ప్రైజ్ లు సెకండ్ హాఫ్ లో చాలా ఉంటాయని అవే ఫలితాన్ని శాశించబోతున్నాయని చెన్నై వర్గాలంటున్నాయి. ఇక పెదకాపు 1 మీద విపరీతమైన బజ్ ఏమి లేదు కానీ ఇది కూడా షాక్ ఇచ్చేలానే ఉంటుందని అంటున్నారు. అలాంటప్పుడు స్కంద అలెర్ట్ గా ఉండటం అవసరం. కొత్త ట్రైలర్ ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పటికైతే స్పందన లేదు.
అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శీను చేస్తున్న సినిమాగా స్కంద పూర్తిగా మాస్ ప్యాకేజ్ గా రూపొందింది. ఇక వారియర్ డిజాస్టర్ నుంచి కోలుకున్న రామ్ మళ్ళీ ఇస్మార్ట్ రేంజ్ సక్సెస్ స్కందతోనే వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. విజువల్స్ గట్రా ఓవర్ మాస్ గానే ఉన్నాయి కానీ వినయ విధేయ రామ లాగా దెబ్బ కొట్టకపోతే చాలని రామ్ అభిమానులు కోరుకుంటున్నారు. వినాయక చవితి పండగను వదిలేసుకోవడం వల్ల కొంత మూల్యం చెల్లించిన స్కందకు ఆ లోటు తెలియకుండా ఉండాలంటే ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాల్సిందే. వేరే ఆప్షన్ లేదు.
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…