గదర్ 2, జవాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా తర్వాత కొన్ని నెలల పాటు స్థబ్దుగా ఉండిపోయిన బిజినెస్ కి మంచి జోష్ ఇస్తూ గత కొన్ని నెలల్లో మంచి విజయాలే నమోదయ్యాయి. ఇప్పుడందరి చూపు డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ మీదే ఉంది. రన్బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం క్రైమ్ థ్రిల్లర్ గురించి అంచనాలు మాములుగా లేవు. పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని, సత్యతో వర్మ సెట్ చేసిన స్టాండర్డ్ ని మించిపోయేలా ఒక కొత్త హీరోయిజంని చూస్తామని యూనిట్ తెగ ఊరిస్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనిమల్ కంటెంట్ చాలా వయొలెంట్ గా ఉంటుందట. కాలేజీలో హీరో ఫిజిక్స్ లెక్చరర్ గా ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ గా సాగి తండ్రి చనిపోయాక అత్యంత హింసాత్మకంగా మారే ట్రాన్స్ఫర్మేషన్ ఒళ్ళు గడుర్పొడిచేలాలా ఉంటుందట. సెన్సార్ అభ్యంతరాలు, బ్లర్లు భారీగా ఉంటాయని అంటున్నారు. అనిమల్ బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదు. ఈ నెల 28న టీజర్ రిలీజ్ చేశాక ఒక్కసారిగా హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుందని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని టి సిరీస్ నిర్ణయించింది. ఇవాళ వినాయక్ చవితి సందర్భంగా వదిలిన పోస్టర్ లో రన్బీర్ ని డీసెంట్ గానే చూపించారు.
డిసెంబర్ లో తీవ్రమైన పోటీ ఉన్న నేపదాయంలో అనిమల్ రిలీజ్ కి ఎలాంటి పోటీ లేకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు. సలార్ రావొచ్చనే వార్తల నేపథ్యంలో ఒకవేళ అది జరిగినా కూడా వెనకడుగు వేయకూడదని దర్శక నిర్మాతలు డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ హై వోల్టేజ్ డ్రామాలో అనిల్ కపూర్ తండ్రిగా, బాబీ డియోల్ విలన్ గా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇది ఒక భాగమే ఉంటుందా లేక ట్రెండ్ ని ఫాలో అవుతూ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తారా అంటే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ లకు కమిట్ మెంట్స్ ఇచ్చాడు కాబట్టి అనిమల్ 2 రాదు.
This post was last modified on September 18, 2023 12:41 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…