గదర్ 2, జవాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా తర్వాత కొన్ని నెలల పాటు స్థబ్దుగా ఉండిపోయిన బిజినెస్ కి మంచి జోష్ ఇస్తూ గత కొన్ని నెలల్లో మంచి విజయాలే నమోదయ్యాయి. ఇప్పుడందరి చూపు డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ మీదే ఉంది. రన్బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం క్రైమ్ థ్రిల్లర్ గురించి అంచనాలు మాములుగా లేవు. పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని, సత్యతో వర్మ సెట్ చేసిన స్టాండర్డ్ ని మించిపోయేలా ఒక కొత్త హీరోయిజంని చూస్తామని యూనిట్ తెగ ఊరిస్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం అనిమల్ కంటెంట్ చాలా వయొలెంట్ గా ఉంటుందట. కాలేజీలో హీరో ఫిజిక్స్ లెక్చరర్ గా ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ గా సాగి తండ్రి చనిపోయాక అత్యంత హింసాత్మకంగా మారే ట్రాన్స్ఫర్మేషన్ ఒళ్ళు గడుర్పొడిచేలాలా ఉంటుందట. సెన్సార్ అభ్యంతరాలు, బ్లర్లు భారీగా ఉంటాయని అంటున్నారు. అనిమల్ బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదు. ఈ నెల 28న టీజర్ రిలీజ్ చేశాక ఒక్కసారిగా హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుందని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని టి సిరీస్ నిర్ణయించింది. ఇవాళ వినాయక్ చవితి సందర్భంగా వదిలిన పోస్టర్ లో రన్బీర్ ని డీసెంట్ గానే చూపించారు.
డిసెంబర్ లో తీవ్రమైన పోటీ ఉన్న నేపదాయంలో అనిమల్ రిలీజ్ కి ఎలాంటి పోటీ లేకుండా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నారు. సలార్ రావొచ్చనే వార్తల నేపథ్యంలో ఒకవేళ అది జరిగినా కూడా వెనకడుగు వేయకూడదని దర్శక నిర్మాతలు డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ హై వోల్టేజ్ డ్రామాలో అనిల్ కపూర్ తండ్రిగా, బాబీ డియోల్ విలన్ గా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇది ఒక భాగమే ఉంటుందా లేక ట్రెండ్ ని ఫాలో అవుతూ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తారా అంటే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ లకు కమిట్ మెంట్స్ ఇచ్చాడు కాబట్టి అనిమల్ 2 రాదు.
This post was last modified on September 18, 2023 12:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…