Movie News

బ్రదర్స్ సైలెన్స్ – ఒక విశ్లేషణ

అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మౌనంగా ఉన్నారు. ఏదో వివాదాస్పదంగా మాట్లాడితే ఇబ్బంది కాని సైలెంట్ గా ఉన్నా అదో పెద్ద ఇష్యూ అవుతోంది. నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ గురించి తారక్ ఇప్పటిదాకా స్పందించలేదు. సోషల్ మీడియాలో తన పేరుని కొందరు ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయడం తెలిసి కూడా తొట్రుపాటు ప్రదర్శించడం లేదు. మరోవైపు డెవిల్ నిర్మాత దర్శకుడి మధ్య నెలకొన్న వివాదం అసలు పట్టించుకోనట్టు కళ్యాణ్ రామ్ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది.

వీటికి తోడు జూనియర్ ఇటీవలే దుబాయ్ లో జరిగిన సైమా అవార్డులు వేడుకకు వెళ్లడం ఇష్యూ మీద ఇంకొంచెం సీరియస్ ఫోకస్ పెట్టేలా చేసింది. నిజానికి బాబు అరెస్ట్ గురించి ఎవరైనా సరే మాట్లాడ్డం లేకపోవడమనేది వ్యక్తిగత విషయం. నందమూరి కుటుంబ సభ్యుడు కాబట్టి ఏదో ఒకటి చెప్పే తీరాలన్న గ్రౌండ్ రూల్ లేదు. ఆ మాటకొస్తే తారక్ నారా ఫ్యామిలీ కాదు కాదనేది అభిమానుల వాదన. ఇది అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి మనవళ్లుగా ఓ రెండు ముక్కలు చెబితే బాగుంటుందనేది కార్యకర్తల అభిప్రాయం. ఇక్కడ ఒక వర్గం వైపే వకాల్తా తీసుకోలేం.

ఇప్పటికిప్పుడు కాకపోయినా దగ్గరి భవిషత్తులో ఈ పరిణామం మీద మాట్లాడే సందర్భం వస్తుందని బ్రదర్స్ కి తెలుసు. ఆ మాత్రం ఊహించకుండా ఉండలేరు. దానికేం సమాధానం చెప్పాలో కూడా మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడది బయట పెట్టరు. కేవలం సినిమాలే ప్రపంచంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ఏళ్ళ తరబడి టిడిపి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. కళ్యాణ్ రామ్ ముందు నుంచి వీటికి దూరమే. ఒకవేళ బాబాయ్ బాలకృష్ణకు ప్రత్యక్షంగా ఇలాంటి ఇబ్బంది ఏదైనా వచ్చి ఉంటే ఇలా ఉండేవారు కాదన్నది ఫ్యాన్సే ఒప్పుకుంటున్న వాస్తవం.

కాబట్టి దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి. టిడిపి జనసేన దోస్తీతో ఏపి రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది.  బాబు అరెస్ట్ మీద విదేశాల్లో, పక్కరాష్ట్రాల్లో సైతం నిరసన వస్తున్నప్పుడు తారక్, కళ్యాణ్ సరైన సమయం కోసం ఎదురు చూస్తుండొచ్చు. తమకు వ్యతిరేకంగా నోరు జారుతున్న కొందరు స్వంత అభిమానుల వైఖరి కళ్ళముందు కనిపిస్తున్నా ఇంత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బదులు చెప్పేందుకు సిద్ధపడేనని అర్థం చేసుకోవాలి. అందుకే సైమా అవార్డు తీసుకున్నాక కూడా తారక్ దాని గురించి ట్వీట్ వేయలేదంటే ఇది తుఫాను ముందు ప్రశాంతతని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం. 

This post was last modified on September 17, 2023 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

2 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

3 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

4 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

4 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

4 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

5 hours ago