Movie News

బ్రదర్స్ సైలెన్స్ – ఒక విశ్లేషణ

అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల మౌనంగా ఉన్నారు. ఏదో వివాదాస్పదంగా మాట్లాడితే ఇబ్బంది కాని సైలెంట్ గా ఉన్నా అదో పెద్ద ఇష్యూ అవుతోంది. నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ గురించి తారక్ ఇప్పటిదాకా స్పందించలేదు. సోషల్ మీడియాలో తన పేరుని కొందరు ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయడం తెలిసి కూడా తొట్రుపాటు ప్రదర్శించడం లేదు. మరోవైపు డెవిల్ నిర్మాత దర్శకుడి మధ్య నెలకొన్న వివాదం అసలు పట్టించుకోనట్టు కళ్యాణ్ రామ్ ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది.

వీటికి తోడు జూనియర్ ఇటీవలే దుబాయ్ లో జరిగిన సైమా అవార్డులు వేడుకకు వెళ్లడం ఇష్యూ మీద ఇంకొంచెం సీరియస్ ఫోకస్ పెట్టేలా చేసింది. నిజానికి బాబు అరెస్ట్ గురించి ఎవరైనా సరే మాట్లాడ్డం లేకపోవడమనేది వ్యక్తిగత విషయం. నందమూరి కుటుంబ సభ్యుడు కాబట్టి ఏదో ఒకటి చెప్పే తీరాలన్న గ్రౌండ్ రూల్ లేదు. ఆ మాటకొస్తే తారక్ నారా ఫ్యామిలీ కాదు కాదనేది అభిమానుల వాదన. ఇది అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి మనవళ్లుగా ఓ రెండు ముక్కలు చెబితే బాగుంటుందనేది కార్యకర్తల అభిప్రాయం. ఇక్కడ ఒక వర్గం వైపే వకాల్తా తీసుకోలేం.

ఇప్పటికిప్పుడు కాకపోయినా దగ్గరి భవిషత్తులో ఈ పరిణామం మీద మాట్లాడే సందర్భం వస్తుందని బ్రదర్స్ కి తెలుసు. ఆ మాత్రం ఊహించకుండా ఉండలేరు. దానికేం సమాధానం చెప్పాలో కూడా మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడది బయట పెట్టరు. కేవలం సినిమాలే ప్రపంచంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ఏళ్ళ తరబడి టిడిపి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. కళ్యాణ్ రామ్ ముందు నుంచి వీటికి దూరమే. ఒకవేళ బాబాయ్ బాలకృష్ణకు ప్రత్యక్షంగా ఇలాంటి ఇబ్బంది ఏదైనా వచ్చి ఉంటే ఇలా ఉండేవారు కాదన్నది ఫ్యాన్సే ఒప్పుకుంటున్న వాస్తవం.

కాబట్టి దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి. టిడిపి జనసేన దోస్తీతో ఏపి రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది.  బాబు అరెస్ట్ మీద విదేశాల్లో, పక్కరాష్ట్రాల్లో సైతం నిరసన వస్తున్నప్పుడు తారక్, కళ్యాణ్ సరైన సమయం కోసం ఎదురు చూస్తుండొచ్చు. తమకు వ్యతిరేకంగా నోరు జారుతున్న కొందరు స్వంత అభిమానుల వైఖరి కళ్ళముందు కనిపిస్తున్నా ఇంత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బదులు చెప్పేందుకు సిద్ధపడేనని అర్థం చేసుకోవాలి. అందుకే సైమా అవార్డు తీసుకున్నాక కూడా తారక్ దాని గురించి ట్వీట్ వేయలేదంటే ఇది తుఫాను ముందు ప్రశాంతతని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం. 

This post was last modified on September 17, 2023 9:54 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

1 hour ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

2 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

2 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

4 hours ago