నిన్న ముంబైలో జవాన్ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది. క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరయ్యారు. ప్రత్యేకంగా బయట అతిథి ఎవరూ లేరు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ ఛాట్ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు హీరోయిన్ దీపికా పదుకునే సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కె ప్రస్తావన తీసుకొచ్చింది. దాని షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నాననే సంగతి గుర్తు చేసుకుంటూ మాట్లాడింది. అప్పటిదాకా ఆమెనే నవ్వుతూ చూస్తున్న షారుఖ్ మొహంలో ఎక్స్ ప్రెషన్లు ఒక్కసారిగా కోపం తరహాలో ఇబ్బందిగా అనిపించాయి. ఆ వీడియో వైరలవుతోంది కూడా.
అలా చేయడానికి కారణాలు ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ కి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. డుంకీ కూడా ష్యుర్ షాట్ హిట్టనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అయితే వసూళ్ల పరంగా కింగ్ ఖాన్ ఇంత కష్టపడి సృష్టించిన రికార్డులు ఎవరైనా తేలిగ్గా బద్దలు కొట్టే ఛాన్స్ ఉందా అది ప్రభాసేనని వేరే చెప్పనక్కర్లేదు. సలార్ లేదా ప్రాజెక్ట్ కె ఏదో ఒకటి లేదా రెండు అది చేసే తీరతాయి. డిజాస్టర్ టాక్ వచ్చిన ఆదిపురుషే మొదటి వారంలో నాలుగు వందల కోట్లు లాగింది. ప్రభాస్ కెపాసిటీ హిందీలోనూ ఆ రేంజ్ లో ఉంటుంది.
ఇది తెలుసు కాబట్టే షారుఖ్ తన దగ్గర తెలుగు తమిళ సినిమాల ప్రస్తావన తెచ్చేందుకు ఇష్టపడడని ఇన్ సైడ్ టాక్. పుష్ప మూడు సార్లు చూసిన సంగతి అది ఆడుతున్న సమయంలో చెప్పి ఉంటే హెల్పయ్యేది కానీ నేషనల్ అవార్డు వచ్చి అల్లు అర్జున్ జవాన్ ని పొగిడాక చెప్పడం ఏమిటని బన్నీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అయినా బాహుబలి నుంచి ఖాన్ల అసంతృప్తి మనం చూస్తున్నదే. కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతారలు బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కి ధీటుగా ఆడటం వాళ్ళు ఇన్ డైరెక్ట్ గా అయినా సరే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిగో ఇలాంటి సందర్భాల్లో బయట పడుతుంది.
This post was last modified on September 16, 2023 6:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…