భారతీయ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు రాజ్ కుమార్ హిరాని. ఐతే 20 ఏళ్ల కెరీర్లో ఆయన తీసిన సినిమాల సంఖ్య మాత్రం కేవలం ఐదు. ఐతే రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే ఆయన.. తన ప్రతి చిత్రాన్నీ కళాఖండంగా మలిచారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, మున్నాభాయ్ లగేరహో, త్రీ ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా రాజ్కుమార్ హిరాని తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించింది. ఐతే ‘మున్నాభాయ్’ సిరీస్లోె రెండు సినిమాలు తీసిన హిరాని.. మూడో చిత్రం కూడా తీయొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తోంది. కానీ అది ఎంతకీ కార్యరూపం దాల్చట్లేదు. ఐతే మున్నాభాయ్-3 త్వరలో వచ్చేస్తోందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. హిరాని తర్వాతి సినిమా ఇదే అంటున్నారు.
సంజయ్ దత్ మున్నాభాయ్ లుక్లో కనిపిస్తున్న కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటమే ఇందుక్కారణం. ఐతే వాస్తవం ఏంటంటే.. షారుఖ్ ఖాన్తో తాను తీస్తున్న కొత్త సినిమా ‘డుంకి’లో సంజయ్ దత్ను కూడా నటింపజేస్తున్నాడు హిరాని. ఇందులో సంజు మున్నాభాయ్ క్యారెక్టర్లోనే కనిపించనున్నాడు. తనతో పాటు ఏటీఎం క్యారెక్టర్ చేసిన అర్షద్ వార్సి కూడా క్యామియో రోల్లో తళుక్కుమనబోతున్నాడు.
దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియోలోనే ఇద్దరూ సందడి చేశారు. కానీ మున్నాభాయ్ గెటప్లో సంజు కనిపించడంతో హిరాని మున్నాభాయ్-3తో వస్తున్నాడని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి ‘మున్నాభాయ్-3’ కోసం గతంలో సన్నాహాలు జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. మున్నాభాయ్-2 వచ్చి దశాబ్దంన్నర దాటిపోగా.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడం కరెక్ట్ కాదని, ఆ ప్రాజెక్ట్ను దాదాపుగా డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 2:34 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…