భారతీయ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు రాజ్ కుమార్ హిరాని. ఐతే 20 ఏళ్ల కెరీర్లో ఆయన తీసిన సినిమాల సంఖ్య మాత్రం కేవలం ఐదు. ఐతే రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే ఆయన.. తన ప్రతి చిత్రాన్నీ కళాఖండంగా మలిచారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, మున్నాభాయ్ లగేరహో, త్రీ ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా రాజ్కుమార్ హిరాని తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించింది. ఐతే ‘మున్నాభాయ్’ సిరీస్లోె రెండు సినిమాలు తీసిన హిరాని.. మూడో చిత్రం కూడా తీయొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తోంది. కానీ అది ఎంతకీ కార్యరూపం దాల్చట్లేదు. ఐతే మున్నాభాయ్-3 త్వరలో వచ్చేస్తోందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. హిరాని తర్వాతి సినిమా ఇదే అంటున్నారు.
సంజయ్ దత్ మున్నాభాయ్ లుక్లో కనిపిస్తున్న కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటమే ఇందుక్కారణం. ఐతే వాస్తవం ఏంటంటే.. షారుఖ్ ఖాన్తో తాను తీస్తున్న కొత్త సినిమా ‘డుంకి’లో సంజయ్ దత్ను కూడా నటింపజేస్తున్నాడు హిరాని. ఇందులో సంజు మున్నాభాయ్ క్యారెక్టర్లోనే కనిపించనున్నాడు. తనతో పాటు ఏటీఎం క్యారెక్టర్ చేసిన అర్షద్ వార్సి కూడా క్యామియో రోల్లో తళుక్కుమనబోతున్నాడు.
దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియోలోనే ఇద్దరూ సందడి చేశారు. కానీ మున్నాభాయ్ గెటప్లో సంజు కనిపించడంతో హిరాని మున్నాభాయ్-3తో వస్తున్నాడని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి ‘మున్నాభాయ్-3’ కోసం గతంలో సన్నాహాలు జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. మున్నాభాయ్-2 వచ్చి దశాబ్దంన్నర దాటిపోగా.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడం కరెక్ట్ కాదని, ఆ ప్రాజెక్ట్ను దాదాపుగా డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 2:34 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…