భారతీయ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు రాజ్ కుమార్ హిరాని. ఐతే 20 ఏళ్ల కెరీర్లో ఆయన తీసిన సినిమాల సంఖ్య మాత్రం కేవలం ఐదు. ఐతే రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే ఆయన.. తన ప్రతి చిత్రాన్నీ కళాఖండంగా మలిచారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, మున్నాభాయ్ లగేరహో, త్రీ ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా రాజ్కుమార్ హిరాని తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించింది. ఐతే ‘మున్నాభాయ్’ సిరీస్లోె రెండు సినిమాలు తీసిన హిరాని.. మూడో చిత్రం కూడా తీయొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తోంది. కానీ అది ఎంతకీ కార్యరూపం దాల్చట్లేదు. ఐతే మున్నాభాయ్-3 త్వరలో వచ్చేస్తోందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. హిరాని తర్వాతి సినిమా ఇదే అంటున్నారు.
సంజయ్ దత్ మున్నాభాయ్ లుక్లో కనిపిస్తున్న కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటమే ఇందుక్కారణం. ఐతే వాస్తవం ఏంటంటే.. షారుఖ్ ఖాన్తో తాను తీస్తున్న కొత్త సినిమా ‘డుంకి’లో సంజయ్ దత్ను కూడా నటింపజేస్తున్నాడు హిరాని. ఇందులో సంజు మున్నాభాయ్ క్యారెక్టర్లోనే కనిపించనున్నాడు. తనతో పాటు ఏటీఎం క్యారెక్టర్ చేసిన అర్షద్ వార్సి కూడా క్యామియో రోల్లో తళుక్కుమనబోతున్నాడు.
దీనికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియోలోనే ఇద్దరూ సందడి చేశారు. కానీ మున్నాభాయ్ గెటప్లో సంజు కనిపించడంతో హిరాని మున్నాభాయ్-3తో వస్తున్నాడని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి ‘మున్నాభాయ్-3’ కోసం గతంలో సన్నాహాలు జరిగినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. మున్నాభాయ్-2 వచ్చి దశాబ్దంన్నర దాటిపోగా.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడం కరెక్ట్ కాదని, ఆ ప్రాజెక్ట్ను దాదాపుగా డ్రాప్ చేసినట్లు తెలుస్తోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…