నిన్న విడుదలైన మార్క్ ఆంటోనీ తమిళనాడులో మంచి జోరు చూపిస్తోంది. తెలుగులో మిక్స్డ్ టాక్ తో పాటు ఆశించిన స్థాయిలో స్పందన లేనట్టుగా కనిపిస్తున్నా పోటీ మరీ వీక్ గా ఉండటంతో ఈ వారాంతం మాస్ పుణ్యమాని మంచి వసూళ్లే దక్కేలా ఉన్నాయి. దీని సంగతి పక్కనపెడితే ప్రమోషన్లలో బాగా హై లైట్ చేసుకున్న అంశాల్లో నిన్నటి తరం ఐటెం బాంబ్ సిల్క్ స్మితని విఎఫ్ఎక్స్ ద్వారా రీ క్రియేట్ చేయడం. దగ్గరి పోలికలున్న ఆర్టిస్టుతో సీన్ నటింపజేసి ఆ తర్వాత సిల్క్ ఫేస్ ని మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా మిక్స్ చేసి ఒరిజినల్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఐడియా బాగానే ఉంది కానీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ విషయంలో పొరపాట్లు చాలానే చేశారు. మొదటిది కథ నడిచే కాలం 1975గా చూపిస్తారు. అప్పటికే సిల్క్ స్మిత పరిశ్రమలో స్టార్ గా ఎదిగినట్టు, విశాల్ సహాయం కోరినట్టు ఒక ఎపిసోడ్ డిజైన్ చేశారు. కానీ ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిందే 1979లో. పెద్ద స్థాయికి చేరుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది. అలాంటప్పుడు ఈ సీన్ నాన్ సింక్ కిందకు వస్తుంది. సరే ఇది పోన్లే అని వదిలేస్తే సిల్క్ స్మితని సరైన రీతిలో వాడుకోలేదు. పేలవమైన సీన్ తో చప్పగా తేల్చేశారు. ఒక పాట ఉంటుందని ఆశించిన ఓల్డ్ ఏజ్ అభిమానులు నిరాశ పడ్డారు.
గతంలో వెంకటేష్ కలిసుందాం రా, తారక్ యమదొంగలో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ ద్వారా ఎలా జొప్పించి మెప్పించారో చూశాంగా. సిల్క్ స్మిత పాత్రను కూడా ఆ రేంజ్ లో ఊహించుకుంటే ఇలా తుస్సుమనిపించారు. బడ్జెట్ పరిమితుల వల్లనో లేక ఒక్క సీన్ కనిపిస్తే చాలు జనం వెర్రెక్కిపోతారనో తెలియదు కానీ మొత్తానికీ సన్నివేశం తేలిపోయింది. గత కొన్నేళ్లలో పోలిస్తే మార్క్ ఆంటోనీకి వచ్చిన ఓపెనింగ్ విశాల్ కి బెస్ట్ అనిపించేలా ఉంది. తమిళ వెర్షన్ బ్రేక్ ఈవెన్ మొదటి వారంలోనే అయిపోతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగు డబ్బింగ్ మాత్రం అంత సీన్ లేదనిపిస్తోంది.
This post was last modified on September 16, 2023 12:54 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…