నిన్న విడుదలైన మార్క్ ఆంటోనీ తమిళనాడులో మంచి జోరు చూపిస్తోంది. తెలుగులో మిక్స్డ్ టాక్ తో పాటు ఆశించిన స్థాయిలో స్పందన లేనట్టుగా కనిపిస్తున్నా పోటీ మరీ వీక్ గా ఉండటంతో ఈ వారాంతం మాస్ పుణ్యమాని మంచి వసూళ్లే దక్కేలా ఉన్నాయి. దీని సంగతి పక్కనపెడితే ప్రమోషన్లలో బాగా హై లైట్ చేసుకున్న అంశాల్లో నిన్నటి తరం ఐటెం బాంబ్ సిల్క్ స్మితని విఎఫ్ఎక్స్ ద్వారా రీ క్రియేట్ చేయడం. దగ్గరి పోలికలున్న ఆర్టిస్టుతో సీన్ నటింపజేసి ఆ తర్వాత సిల్క్ ఫేస్ ని మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా మిక్స్ చేసి ఒరిజినల్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఐడియా బాగానే ఉంది కానీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ విషయంలో పొరపాట్లు చాలానే చేశారు. మొదటిది కథ నడిచే కాలం 1975గా చూపిస్తారు. అప్పటికే సిల్క్ స్మిత పరిశ్రమలో స్టార్ గా ఎదిగినట్టు, విశాల్ సహాయం కోరినట్టు ఒక ఎపిసోడ్ డిజైన్ చేశారు. కానీ ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిందే 1979లో. పెద్ద స్థాయికి చేరుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది. అలాంటప్పుడు ఈ సీన్ నాన్ సింక్ కిందకు వస్తుంది. సరే ఇది పోన్లే అని వదిలేస్తే సిల్క్ స్మితని సరైన రీతిలో వాడుకోలేదు. పేలవమైన సీన్ తో చప్పగా తేల్చేశారు. ఒక పాట ఉంటుందని ఆశించిన ఓల్డ్ ఏజ్ అభిమానులు నిరాశ పడ్డారు.
గతంలో వెంకటేష్ కలిసుందాం రా, తారక్ యమదొంగలో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ ద్వారా ఎలా జొప్పించి మెప్పించారో చూశాంగా. సిల్క్ స్మిత పాత్రను కూడా ఆ రేంజ్ లో ఊహించుకుంటే ఇలా తుస్సుమనిపించారు. బడ్జెట్ పరిమితుల వల్లనో లేక ఒక్క సీన్ కనిపిస్తే చాలు జనం వెర్రెక్కిపోతారనో తెలియదు కానీ మొత్తానికీ సన్నివేశం తేలిపోయింది. గత కొన్నేళ్లలో పోలిస్తే మార్క్ ఆంటోనీకి వచ్చిన ఓపెనింగ్ విశాల్ కి బెస్ట్ అనిపించేలా ఉంది. తమిళ వెర్షన్ బ్రేక్ ఈవెన్ మొదటి వారంలోనే అయిపోతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగు డబ్బింగ్ మాత్రం అంత సీన్ లేదనిపిస్తోంది.
This post was last modified on September 16, 2023 12:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…