కరోనా వల్ల థియేటర్లు ఐదు నెలలకు పైగా మూత పడి ఉండటం, సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో బాలీవుడ్లో భారీ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. కానీ సౌత్ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో తటపటాయిస్తూ వచ్చారు. ఇక్కడ చిన్నా చితకా సినిమాలే ఇలా రిలీజయ్యాయి. కానీ ఇప్పుడు దక్షిణాది నిర్మాతల ఆలోచనలు మారిపోతున్నాయి.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పట్టు వీడి తన నిర్మాణంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘వి’ని సెప్టెంబరు 5న అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంతలో ఇప్పుడు ఓ భారీ తమిళ చిత్రాన్ని కూడా ప్రైంలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన రావడం విశేషం. అది.. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రం అక్టోబరు 30న అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది.
కరోనా లేకుంటే వేసవిలోనే విడుదల కావాల్సిన సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’. ఎప్పుడు పరిస్థితులు బాగు పడితే అప్పుడు సినిమాను విడుదల చేద్దాం అని చూసింది సూర్య అండ్ టీం. కానీ కానీ ఆ అవకాశం ఇప్పుడిప్పుడే రాదని తేలిపోయింది. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని తెలిసినా.. ఈ చిత్రానికి ఈ మధ్య సెన్సార్ చేయించేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాదు.. రిలీజింగ్ సూన్ అంటూ తమిళ పీఆర్వోలు సోషల్ మీడియాలో అప్ డేట్లు కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తారేమో అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు ఆ అనుమానమే నిజమైంది.
అక్టోబరు 30న ఈ చిత్రాన్ని ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నట్లు సూర్య స్వయంగా ప్రకటన ఇచ్చాడు. వినాయక చవితి శుభదినాన దీనిపై ప్రకటన చేశాడు. ఇంతకుముందు సూర్య భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని ఇలాగే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు థియేటర్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చినా సూర్య పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా తాను హీరోగా నటించిన భారీ చిత్రాన్ని ప్రైంలో వదిలేస్తున్నాడు. తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది.
This post was last modified on August 22, 2020 6:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…