కరోనా వల్ల థియేటర్లు ఐదు నెలలకు పైగా మూత పడి ఉండటం, సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో బాలీవుడ్లో భారీ చిత్రాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తున్నారు. కానీ సౌత్ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో తటపటాయిస్తూ వచ్చారు. ఇక్కడ చిన్నా చితకా సినిమాలే ఇలా రిలీజయ్యాయి. కానీ ఇప్పుడు దక్షిణాది నిర్మాతల ఆలోచనలు మారిపోతున్నాయి.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పట్టు వీడి తన నిర్మాణంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘వి’ని సెప్టెంబరు 5న అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంతలో ఇప్పుడు ఓ భారీ తమిళ చిత్రాన్ని కూడా ప్రైంలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన రావడం విశేషం. అది.. సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ చిత్రం అక్టోబరు 30న అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది.
కరోనా లేకుంటే వేసవిలోనే విడుదల కావాల్సిన సినిమా ‘ఆకాశమే నీ హద్దురా’. ఎప్పుడు పరిస్థితులు బాగు పడితే అప్పుడు సినిమాను విడుదల చేద్దాం అని చూసింది సూర్య అండ్ టీం. కానీ కానీ ఆ అవకాశం ఇప్పుడిప్పుడే రాదని తేలిపోయింది. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదని తెలిసినా.. ఈ చిత్రానికి ఈ మధ్య సెన్సార్ చేయించేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాదు.. రిలీజింగ్ సూన్ అంటూ తమిళ పీఆర్వోలు సోషల్ మీడియాలో అప్ డేట్లు కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తారేమో అన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడు ఆ అనుమానమే నిజమైంది.
అక్టోబరు 30న ఈ చిత్రాన్ని ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నట్లు సూర్య స్వయంగా ప్రకటన ఇచ్చాడు. వినాయక చవితి శుభదినాన దీనిపై ప్రకటన చేశాడు. ఇంతకుముందు సూర్య భార్య జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని ఇలాగే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు థియేటర్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చినా సూర్య పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా తాను హీరోగా నటించిన భారీ చిత్రాన్ని ప్రైంలో వదిలేస్తున్నాడు. తెలుగమ్మాయి సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది.
This post was last modified on August 22, 2020 6:43 pm
ఖుషి తర్వాత స్క్రీన్ పై కనిపించకుండా పోయిన సమంతా తిరిగి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తన…
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…
జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…