మనది హీరోలు ఆధిపత్యం చెలాయించే పరిశ్రమ. వాళ్ళు చెప్పినట్టే జరగాలి తప్పించి డబ్బుంది కదాని నిర్మాతది లేదా రాసేది తీసేది నేనే కదాని దర్శకుడిది కాదు. అలా అని మరీ మితిమీరితే చర్యలు తీసుకునే సంఘాలు లేకపోలేదు. కాకపోతే అవి ఎంత వరకు పని చేస్తాయనేది భేతాళ ప్రశ్న. తాజాగా తమిళనాడు నిర్మాతల సమాఖ్య నలుగురు హీరోలకు రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఇది అమలులోకి వస్తే ఎవరూ వాళ్ళతో సినిమాలు తీయకూడదు. ఒకరకంగా చెప్పాలంటే పెదరాయుడులో రజనీకాంత్ విలన్ ఫ్యామిలీని ఊరి నుంచి దూరంగా వెలేసినట్టన్న మాట.
ఆ నలుగురు ఎవరంటే శింబు, ధనుష్, విశాల్, అధర్వ. వాళ్ళతో ప్రాజెక్టులు మొదలుపెట్టి నష్టపోయిన నిర్మాతలు ఆధారాలతో సహా కౌన్సిల్ కు కంప్లయింట్ ఇవ్వడంతో ఈ చర్య తీసుకోవాలని డిసైడ్ చేశారు. మైకేల్ రాయప్పన్ వివాదానికి సంబంధించి శింబు, తేనాండాళ్ సంస్థ సినిమా పూర్తి చేయకుండా నష్టానికి కారణమైనందుకు గాను ధనుష్, అసోసియేషన్ డబ్బులను తప్పుదారి పట్టించారనే అభియోగం మీద విశాల్, మతియజకన్ ఇష్యూలో అధర్వలు భాద్యులుగా నిలిచారు. ఎంత అడిగినా వీటి పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో ఫైనల్ గా ఎర్ర జెండా ఊపేశారు.
వినడానికి బాగానే ఉంది కానీ ఇది నిజంగా అమలు జరిగే పనేనా అంటే డౌటే. ఎందుకంటే వీళ్ళందరికీ బలమైన బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్, ఆర్థిక వనరులు, స్వంత ప్రొడక్షన్ హౌస్ లున్నాయి. అప్ కమింగ్ స్టేజిలో ఉంటే భయపడతారు కానీ ఇలాంటివి ఏదో రకంగా మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకుంటారు. అంత ఆలోచనే ఉంటే ఇక్కడి దాకా ఎందుకు వస్తుందనే వాదన కూడా నిజమే కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ నుంచి నేరుగా స్పందన రాలేదు. బాష ఏదైనా మార్కెట్ ఉన్న హీరోలను ఇలాంటి వాటితో నియంత్రించడం కానీ శాశించడం కానీ నిజంగా జరిగే పనేనా.
This post was last modified on September 15, 2023 9:29 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…