Movie News

స్టార్ హీరోలను రెడ్ కార్డులు ఆపుతాయా

మనది హీరోలు ఆధిపత్యం చెలాయించే పరిశ్రమ. వాళ్ళు చెప్పినట్టే జరగాలి తప్పించి డబ్బుంది కదాని నిర్మాతది లేదా రాసేది తీసేది నేనే కదాని దర్శకుడిది కాదు. అలా అని మరీ మితిమీరితే చర్యలు తీసుకునే సంఘాలు లేకపోలేదు. కాకపోతే అవి ఎంత వరకు పని చేస్తాయనేది భేతాళ ప్రశ్న. తాజాగా తమిళనాడు నిర్మాతల సమాఖ్య నలుగురు హీరోలకు రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణయించుకుంది. ఇది అమలులోకి వస్తే ఎవరూ వాళ్ళతో సినిమాలు తీయకూడదు. ఒకరకంగా చెప్పాలంటే పెదరాయుడులో రజనీకాంత్ విలన్ ఫ్యామిలీని ఊరి నుంచి దూరంగా వెలేసినట్టన్న మాట.

ఆ నలుగురు ఎవరంటే శింబు, ధనుష్, విశాల్, అధర్వ. వాళ్ళతో ప్రాజెక్టులు మొదలుపెట్టి నష్టపోయిన నిర్మాతలు ఆధారాలతో సహా కౌన్సిల్ కు కంప్లయింట్ ఇవ్వడంతో ఈ చర్య తీసుకోవాలని డిసైడ్ చేశారు. మైకేల్ రాయప్పన్ వివాదానికి సంబంధించి శింబు, తేనాండాళ్ సంస్థ సినిమా పూర్తి చేయకుండా నష్టానికి కారణమైనందుకు గాను ధనుష్, అసోసియేషన్ డబ్బులను తప్పుదారి పట్టించారనే అభియోగం మీద విశాల్, మతియజకన్ ఇష్యూలో అధర్వలు భాద్యులుగా నిలిచారు. ఎంత అడిగినా వీటి పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో ఫైనల్  గా ఎర్ర జెండా ఊపేశారు.

వినడానికి బాగానే ఉంది కానీ ఇది నిజంగా అమలు జరిగే పనేనా అంటే డౌటే. ఎందుకంటే వీళ్ళందరికీ బలమైన బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్, ఆర్థిక వనరులు, స్వంత ప్రొడక్షన్ హౌస్ లున్నాయి. అప్ కమింగ్ స్టేజిలో ఉంటే భయపడతారు కానీ ఇలాంటివి ఏదో రకంగా మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకుంటారు. అంత ఆలోచనే ఉంటే ఇక్కడి దాకా ఎందుకు వస్తుందనే వాదన కూడా నిజమే కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ నుంచి నేరుగా స్పందన రాలేదు. బాష ఏదైనా మార్కెట్ ఉన్న హీరోలను ఇలాంటి వాటితో నియంత్రించడం కానీ శాశించడం కానీ నిజంగా జరిగే పనేనా. 

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

1 hour ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

4 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

6 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago