పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సందీప్ రెడ్డి వంగాతో ప్యాన్ ఇండియా మూవీని గతంలోనే ప్రకటించారు కానీ అతను ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేశాకే ఇటువైపు రాగలడు. సో ఎంత లేదన్నా ఈజీగా రెండేళ్లు పడుతుంది. ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక అఫీషియల్ కమిట్ మెంట్ ఇచ్చేసిన బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేతులు కలపబోతున్నాడనే వార్త గత వారం రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే జవాన్ హడావిడిలో ఉన్న యూనిట్ కి సంబంధించిన ఎవరూ దీని గురించి స్పందించలేదు.
తాజాగా షారుఖ్ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతూ బన్నీ ఒక ట్వీట్ చేశాడు. అందరిని మెచ్చుకుంటూ విడివిడి లైన్లు రాసుకుంటూ పోయాడు. దీనికి స్పందించిన అనిరుద్ రవిచందర్ థాంక్ యు బ్రో అంటూ నమస్తే ఉన్న ఎమోజి సింబల్స్ ని గుర్తులుగా పెట్టాడు. అక్కడితో ఆగలేదు. దానికి అల్లు అర్జున్ రెస్పాన్స్ ఇస్తూ కేవలం కృతజ్ఞతలు సరిపోవని, గొప్ప పాటలు కావాలని అన్నాడు. అంటే ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి జవాన్ సాంగ్స్ అంతగా లేవని చెప్పడం. ఇంకో మీనింగ్ ఎలాగూ ఫ్యూచర్ లో కలుస్తున్నాం కాబట్టి నాకు మాత్రం ఆషామాషీ మ్యూజిక్ కుదరదని చెప్పడం.
ఈ సంభాషణ గమనిస్తే బన్నీ అట్లీ కాంబో దాదాపుగా లాక్ అయినట్టే కనిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ వివరాలు బయటికి చెప్పలేదు. ఇప్పుడు జవాన్ లో షారుఖ్ ని హ్యాండిల్ చేసిన తీరు చూశాక ఏ కమర్షియల్ హీరో అయినా ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ కోరుకోడు. అందులోనూ పుష్ప లాంటి ఊర మాస్ మసాలా చేశాక బన్నీ తన స్కేల్ ని పెంచే దర్శకుల కోసమే చూస్తాడు. సో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా ఇలా లైనప్ మాములుగా లేదుగా. ఆలస్యమైనా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్న అల్లు అర్జున్ సెలక్షన్ లో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
This post was last modified on September 14, 2023 1:18 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…