అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇలా ఉంది తెలుగు సినిమాల రిలీజ్ వ్యవహారం. ఒక్కో వీకెండ్లో పరిమితికి మించి సినిమాలు రిలీజవుతుంటాయి. థియేటర్ల కోసం కొట్లాటలు జరిగిపోతుంటాయి. పోటీ వల్ల కొన్ని సినిమాలు అసలు ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోతాయి. కొన్ని వీకెండ్స్లో ఏమో ఖాళీగా ఉన్న థియేటర్లను వాడుకోరు. కొత్త సినిమా చూద్దామనుకునే ప్రేక్షకులకు అసలు ఆప్షనే లేకుండా చేస్తారు.
ఈ నెలాఖర్లో రావాల్సిన ‘సలార్’ వాయిదా పడటంతో అందరి దృష్టీ ఆ వీకెండ్ మీద పడింది. హడావుడిగా డేట్లు ఇచ్చేశారు. తీరా చూస్తే అక్కడ రష్ మరీ ఎక్కువ అయిపోయింది. దీంతో ముందు డేట్ ఇచ్చుకున్న మ్యాడ్, రూల్స్ రంజన్ సినిమాలను ఇప్పుడు వాయిదా వేశారు. లేటుగా రేసులోకి వచ్చిన స్కంద, చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు ఆ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి.
ఒకే వీకెండ్లో మూడు సినిమాలు అంటే పోటీ తీవ్రంగా ఉన్నట్లే. అది మూడు చిత్రాలకూ అంత మంచిది కాదు. ఇక అక్టోబరు 6న కూడా మినిమం మూడు సినిమాలు రిలీజయ్యేలా ఉన్నాయి. మ్యాడ్, రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు చిత్రాలను అప్పుడే రిలీజ్ చేయబోతున్నారు. ఇలా వరుసగా రెండు వీకెండ్స్లో మూడు చొప్పున సినిమాలు రిలీజవుతుంటే.. ఈ వారమేమో అసలు థియేటర్లను వాడుకునే కొత్త చిత్రాలే కనిపించడం లేదు.
డబ్బింగ్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’కి అసలు పోటీయే లేని పరిస్థితి. ‘చాంగురే బంగారు రాజా’ అనే చిన్న సినిమా పెద్దగా బజ్ లేకుండా రిలీజవుతోంది. ఇక తర్వాతి వారం అయితే ఈ మాత్రం సినిమాలు కూడా లేవు. పూర్తిగా ఆ వీకెండ్ను ఖాళీగా వదిలేశారు. సెప్టెంబరు 29, అక్టోబరు 6 తేదీల్లో వచ్చే సినిమాల్లో రెండు మూడు చిత్రాలు రాబోయే రెండు వీకెండ్స్కు షెడ్యూల్ అయి ఉంటే వాటికి ప్రయోజనం చేకూరేది. ప్రేక్షకులకూ ఆప్షన్ ఉండేది.
This post was last modified on September 24, 2023 1:15 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ తాజా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సరికొత్త అవతారం ఎత్తారు. సీఎం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా…
‘రామాయణం’ సెట్స్లో ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా చేస్తున్న ఈ భారీ…
కెరీర్లో ఎక్కువ శాతం మాస్ మసాలా సినిమాలే చేస్తూ వచ్చిన రవితేజ.. ఈ మధ్య రూటు మార్చేశాడు. ఈ సంక్రాంతికి…
పెద్దికి పెద్ద చేతులు కలిసి వస్తున్నాయి. ఒకపక్క తెలంగాణ సింగల్ స్క్రీన్ల గొడవ వల్ల ఎక్కడ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయోనని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం అమరావతి చేరుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో…