అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇలా ఉంది తెలుగు సినిమాల రిలీజ్ వ్యవహారం. ఒక్కో వీకెండ్లో పరిమితికి మించి సినిమాలు రిలీజవుతుంటాయి. థియేటర్ల కోసం కొట్లాటలు జరిగిపోతుంటాయి. పోటీ వల్ల కొన్ని సినిమాలు అసలు ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోతాయి. కొన్ని వీకెండ్స్లో ఏమో ఖాళీగా ఉన్న థియేటర్లను వాడుకోరు. కొత్త సినిమా చూద్దామనుకునే ప్రేక్షకులకు అసలు ఆప్షనే లేకుండా చేస్తారు.
ఈ నెలాఖర్లో రావాల్సిన ‘సలార్’ వాయిదా పడటంతో అందరి దృష్టీ ఆ వీకెండ్ మీద పడింది. హడావుడిగా డేట్లు ఇచ్చేశారు. తీరా చూస్తే అక్కడ రష్ మరీ ఎక్కువ అయిపోయింది. దీంతో ముందు డేట్ ఇచ్చుకున్న మ్యాడ్, రూల్స్ రంజన్ సినిమాలను ఇప్పుడు వాయిదా వేశారు. లేటుగా రేసులోకి వచ్చిన స్కంద, చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు ఆ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి.
ఒకే వీకెండ్లో మూడు సినిమాలు అంటే పోటీ తీవ్రంగా ఉన్నట్లే. అది మూడు చిత్రాలకూ అంత మంచిది కాదు. ఇక అక్టోబరు 6న కూడా మినిమం మూడు సినిమాలు రిలీజయ్యేలా ఉన్నాయి. మ్యాడ్, రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు చిత్రాలను అప్పుడే రిలీజ్ చేయబోతున్నారు. ఇలా వరుసగా రెండు వీకెండ్స్లో మూడు చొప్పున సినిమాలు రిలీజవుతుంటే.. ఈ వారమేమో అసలు థియేటర్లను వాడుకునే కొత్త చిత్రాలే కనిపించడం లేదు.
డబ్బింగ్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’కి అసలు పోటీయే లేని పరిస్థితి. ‘చాంగురే బంగారు రాజా’ అనే చిన్న సినిమా పెద్దగా బజ్ లేకుండా రిలీజవుతోంది. ఇక తర్వాతి వారం అయితే ఈ మాత్రం సినిమాలు కూడా లేవు. పూర్తిగా ఆ వీకెండ్ను ఖాళీగా వదిలేశారు. సెప్టెంబరు 29, అక్టోబరు 6 తేదీల్లో వచ్చే సినిమాల్లో రెండు మూడు చిత్రాలు రాబోయే రెండు వీకెండ్స్కు షెడ్యూల్ అయి ఉంటే వాటికి ప్రయోజనం చేకూరేది. ప్రేక్షకులకూ ఆప్షన్ ఉండేది.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…