అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. ఇలా ఉంది తెలుగు సినిమాల రిలీజ్ వ్యవహారం. ఒక్కో వీకెండ్లో పరిమితికి మించి సినిమాలు రిలీజవుతుంటాయి. థియేటర్ల కోసం కొట్లాటలు జరిగిపోతుంటాయి. పోటీ వల్ల కొన్ని సినిమాలు అసలు ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోతాయి. కొన్ని వీకెండ్స్లో ఏమో ఖాళీగా ఉన్న థియేటర్లను వాడుకోరు. కొత్త సినిమా చూద్దామనుకునే ప్రేక్షకులకు అసలు ఆప్షనే లేకుండా చేస్తారు.
ఈ నెలాఖర్లో రావాల్సిన ‘సలార్’ వాయిదా పడటంతో అందరి దృష్టీ ఆ వీకెండ్ మీద పడింది. హడావుడిగా డేట్లు ఇచ్చేశారు. తీరా చూస్తే అక్కడ రష్ మరీ ఎక్కువ అయిపోయింది. దీంతో ముందు డేట్ ఇచ్చుకున్న మ్యాడ్, రూల్స్ రంజన్ సినిమాలను ఇప్పుడు వాయిదా వేశారు. లేటుగా రేసులోకి వచ్చిన స్కంద, చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు ఆ వీకెండ్లో రిలీజ్ కాబోతున్నాయి.
ఒకే వీకెండ్లో మూడు సినిమాలు అంటే పోటీ తీవ్రంగా ఉన్నట్లే. అది మూడు చిత్రాలకూ అంత మంచిది కాదు. ఇక అక్టోబరు 6న కూడా మినిమం మూడు సినిమాలు రిలీజయ్యేలా ఉన్నాయి. మ్యాడ్, రూల్స్ రంజన్, మంత్ ఆఫ్ మధు చిత్రాలను అప్పుడే రిలీజ్ చేయబోతున్నారు. ఇలా వరుసగా రెండు వీకెండ్స్లో మూడు చొప్పున సినిమాలు రిలీజవుతుంటే.. ఈ వారమేమో అసలు థియేటర్లను వాడుకునే కొత్త చిత్రాలే కనిపించడం లేదు.
డబ్బింగ్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’కి అసలు పోటీయే లేని పరిస్థితి. ‘చాంగురే బంగారు రాజా’ అనే చిన్న సినిమా పెద్దగా బజ్ లేకుండా రిలీజవుతోంది. ఇక తర్వాతి వారం అయితే ఈ మాత్రం సినిమాలు కూడా లేవు. పూర్తిగా ఆ వీకెండ్ను ఖాళీగా వదిలేశారు. సెప్టెంబరు 29, అక్టోబరు 6 తేదీల్లో వచ్చే సినిమాల్లో రెండు మూడు చిత్రాలు రాబోయే రెండు వీకెండ్స్కు షెడ్యూల్ అయి ఉంటే వాటికి ప్రయోజనం చేకూరేది. ప్రేక్షకులకూ ఆప్షన్ ఉండేది.
This post was last modified on September 24, 2023 1:15 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…