‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. అందమైన ముఖవర్చస్సు, చక్కటి శరీర సౌష్టవం, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. మంచి సింగర్ కూడా అయిన రాశి ఆ రకంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో అడుగు పెట్టిన కొంత కాలానికే రాశి తెలుగు కూడా నేర్చుకుని మన వాళ్లకు మరింత దగ్గరైంది.
కెరీర్లో ఒక దశ వరకు మిడ్ రేంజ్ హీరోలతోనే జట్టు కట్టిన రాశి.. ‘జై లవకుశ’లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సరసనా నటించడంతో ఇక ఆమె కెరీర్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందని అనుకున్నారు. కానీ చిత్రంగా రాశి కెరీర్ తర్వాత తిరోగమనంలో పయనించింది. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యు.. ఇలా ఆమె చివరి మూడు తెలుగు చిత్రాలు ఒకదాన్ని మించి డిజాస్టర్లు అయ్యాయి.
దీంతో రాశికి తెలుగులో ఛాన్సులు ఆగిపోయాయి. ఏడాది నుంచి కొత్తగా ఆమె ఒక్క కొత్త సినిమా కూడా అందుకోలేదు. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి ఫొటో షూట్లు చేస్తున్నా ఎవరి దృష్టిలో పడట్లేదు. మధ్యలో ఆమె హిందీలో నటించిన ‘ఫర్జీ’తో మంచి పేరే సంపాదించింది.
అక్కడే కాస్త అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ సిద్దార్థ్ మల్హోత్రాతో ‘యోధా’లో నటిస్తున్న రాశి.. తాజాగా విక్రాంత్ మాస్సే లాంటి చిన్న హీరోతో ఓ సినిమా కమిటైంది. తన బేస్ను కూడా ముంబయికి మార్చేసినట్లుగా కనిపిస్తున్న రాశి.. టాలీవుడ్ మీద పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. అందం, అభినయం రెండూ ఉన్న ఇలాంటి హీరోయిన్.. ఇంత త్వరగా టాలీవుడ్లో ఫేడవుట్ అయిపోవడం ఆశ్చర్యకరం.
This post was last modified on September 13, 2023 4:26 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…