‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఢిల్లీ భామ రాశి ఖన్నా. అందమైన ముఖవర్చస్సు, చక్కటి శరీర సౌష్టవం, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. మంచి సింగర్ కూడా అయిన రాశి ఆ రకంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో అడుగు పెట్టిన కొంత కాలానికే రాశి తెలుగు కూడా నేర్చుకుని మన వాళ్లకు మరింత దగ్గరైంది.
కెరీర్లో ఒక దశ వరకు మిడ్ రేంజ్ హీరోలతోనే జట్టు కట్టిన రాశి.. ‘జై లవకుశ’లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సరసనా నటించడంతో ఇక ఆమె కెరీర్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందని అనుకున్నారు. కానీ చిత్రంగా రాశి కెరీర్ తర్వాత తిరోగమనంలో పయనించింది. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యు.. ఇలా ఆమె చివరి మూడు తెలుగు చిత్రాలు ఒకదాన్ని మించి డిజాస్టర్లు అయ్యాయి.
దీంతో రాశికి తెలుగులో ఛాన్సులు ఆగిపోయాయి. ఏడాది నుంచి కొత్తగా ఆమె ఒక్క కొత్త సినిమా కూడా అందుకోలేదు. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి ఫొటో షూట్లు చేస్తున్నా ఎవరి దృష్టిలో పడట్లేదు. మధ్యలో ఆమె హిందీలో నటించిన ‘ఫర్జీ’తో మంచి పేరే సంపాదించింది.
అక్కడే కాస్త అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ సిద్దార్థ్ మల్హోత్రాతో ‘యోధా’లో నటిస్తున్న రాశి.. తాజాగా విక్రాంత్ మాస్సే లాంటి చిన్న హీరోతో ఓ సినిమా కమిటైంది. తన బేస్ను కూడా ముంబయికి మార్చేసినట్లుగా కనిపిస్తున్న రాశి.. టాలీవుడ్ మీద పూర్తిగా ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. అందం, అభినయం రెండూ ఉన్న ఇలాంటి హీరోయిన్.. ఇంత త్వరగా టాలీవుడ్లో ఫేడవుట్ అయిపోవడం ఆశ్చర్యకరం.
This post was last modified on September 13, 2023 4:26 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…