ఈ నెల ఆరంభంలో మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఖుషి’ సినిమా.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. తర్వాత సినిమా ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తెలుగు వెర్షన్ ఒక్క యుఎస్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది.
నైజాంలో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వెళ్లింది కానీ.. మిగతా ప్రాంతాల్లో మాత్రం పెద్ద మొత్తంలోనే నష్టాలు మిగిల్చిందీ చిత్రం. ఏపీ అంతటా బయ్యర్లకు కన్నీళ్లే మిగిలాయి. ఓవరాల్గా చూసుకుంటే ‘ఖుషి’ సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘ఖుషి’ తమిళంలో బ్రేక్ ఈవెన్ కావడమే కాదు.. బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చిపెట్టిందట. తమిళనాట ‘ఖుషి’ తమిళ వెర్షనే కాక తెలుగు వెర్షన్ సైతం బాగా ఆడినట్లు సమాచారం.
‘ఖుషి’ తమిళనాడులో ఫుల్ రన్లో రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. బాహుబలి లాంటి భారీ చిత్రాల సంగతి పక్కన పెడితే.. తమిళంలో తెలుగు అనువాదాలు ఆడటం అరుదు. ఇలాంటి తెలుగు లవ్ స్టోరీలను అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ‘ఖుషి’ గొప్ప టాక్ కూడా తెచ్చుకున్న సినిమా కాదాయె. అయినా విజయ్కి తమిళనాట ఉన్న క్రేజ్, సమంత కూడా బాగా తెలిసిన ఫేస్ కావడం కలిసొచ్చింది.
పాటలు ఆల్రెడీ తమిళంలో హిట్టయ్యాయి. దీంతో ‘ఖుషి’కి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. దీంతో మొత్తంగా సినిమా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లతో తమిళనాట ‘హిట్’ స్టేటస్ అందుకుంది. కానీ ఈ చిత్రం హిందీ, మలయాళ భాషల్లో కనీస ప్రభావం కూడా చూపలేదు. ఆ వెర్షన్లు నామమాత్రంగా రిలీజయ్యాయంతే. వాటిని అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.
This post was last modified on September 12, 2023 6:17 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…