ఈ నెల ఆరంభంలో మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఖుషి’ సినిమా.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. తర్వాత సినిమా ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తెలుగు వెర్షన్ ఒక్క యుఎస్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది.
నైజాంలో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వెళ్లింది కానీ.. మిగతా ప్రాంతాల్లో మాత్రం పెద్ద మొత్తంలోనే నష్టాలు మిగిల్చిందీ చిత్రం. ఏపీ అంతటా బయ్యర్లకు కన్నీళ్లే మిగిలాయి. ఓవరాల్గా చూసుకుంటే ‘ఖుషి’ సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘ఖుషి’ తమిళంలో బ్రేక్ ఈవెన్ కావడమే కాదు.. బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చిపెట్టిందట. తమిళనాట ‘ఖుషి’ తమిళ వెర్షనే కాక తెలుగు వెర్షన్ సైతం బాగా ఆడినట్లు సమాచారం.
‘ఖుషి’ తమిళనాడులో ఫుల్ రన్లో రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. బాహుబలి లాంటి భారీ చిత్రాల సంగతి పక్కన పెడితే.. తమిళంలో తెలుగు అనువాదాలు ఆడటం అరుదు. ఇలాంటి తెలుగు లవ్ స్టోరీలను అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ‘ఖుషి’ గొప్ప టాక్ కూడా తెచ్చుకున్న సినిమా కాదాయె. అయినా విజయ్కి తమిళనాట ఉన్న క్రేజ్, సమంత కూడా బాగా తెలిసిన ఫేస్ కావడం కలిసొచ్చింది.
పాటలు ఆల్రెడీ తమిళంలో హిట్టయ్యాయి. దీంతో ‘ఖుషి’కి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. దీంతో మొత్తంగా సినిమా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లతో తమిళనాట ‘హిట్’ స్టేటస్ అందుకుంది. కానీ ఈ చిత్రం హిందీ, మలయాళ భాషల్లో కనీస ప్రభావం కూడా చూపలేదు. ఆ వెర్షన్లు నామమాత్రంగా రిలీజయ్యాయంతే. వాటిని అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…