ఈ నెల ఆరంభంలో మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఖుషి’ సినిమా.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. తర్వాత సినిమా ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తెలుగు వెర్షన్ ఒక్క యుఎస్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది.
నైజాంలో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా వెళ్లింది కానీ.. మిగతా ప్రాంతాల్లో మాత్రం పెద్ద మొత్తంలోనే నష్టాలు మిగిల్చిందీ చిత్రం. ఏపీ అంతటా బయ్యర్లకు కన్నీళ్లే మిగిలాయి. ఓవరాల్గా చూసుకుంటే ‘ఖుషి’ సంతృప్తికర ఫలితాన్ని ఇవ్వలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘ఖుషి’ తమిళంలో బ్రేక్ ఈవెన్ కావడమే కాదు.. బయ్యర్లకు లాభాలు కూడా తెచ్చిపెట్టిందట. తమిళనాట ‘ఖుషి’ తమిళ వెర్షనే కాక తెలుగు వెర్షన్ సైతం బాగా ఆడినట్లు సమాచారం.
‘ఖుషి’ తమిళనాడులో ఫుల్ రన్లో రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. బాహుబలి లాంటి భారీ చిత్రాల సంగతి పక్కన పెడితే.. తమిళంలో తెలుగు అనువాదాలు ఆడటం అరుదు. ఇలాంటి తెలుగు లవ్ స్టోరీలను అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ‘ఖుషి’ గొప్ప టాక్ కూడా తెచ్చుకున్న సినిమా కాదాయె. అయినా విజయ్కి తమిళనాట ఉన్న క్రేజ్, సమంత కూడా బాగా తెలిసిన ఫేస్ కావడం కలిసొచ్చింది.
పాటలు ఆల్రెడీ తమిళంలో హిట్టయ్యాయి. దీంతో ‘ఖుషి’కి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో వీకెండ్లో కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. దీంతో మొత్తంగా సినిమా రూ.9 కోట్ల గ్రాస్ వసూళ్లతో తమిళనాట ‘హిట్’ స్టేటస్ అందుకుంది. కానీ ఈ చిత్రం హిందీ, మలయాళ భాషల్లో కనీస ప్రభావం కూడా చూపలేదు. ఆ వెర్షన్లు నామమాత్రంగా రిలీజయ్యాయంతే. వాటిని అక్కడి ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.
This post was last modified on September 12, 2023 6:17 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…