జవాన్ లాంటి ధీటైన పోటీని తట్టుకుని మరీ నిలబడిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్లన్నీ నవీన్ ఒక్కడే మోసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ఇంత కాంపిటీషన్ లోనూ యుఎస్ లో మిలియన్ మార్క్, వరల్డ్ వైడ్ పది కోట్లను దాటడం చిన్న విషయం కాదు. అయితే రిలీజ్ కు ముందు ప్లాన్ చేసుకున్న యాంకర్ సుమ ఇంటర్వ్యూ ను కూడా యువి సంస్థ ఎందుకనో వదల్లేదు. కారణాలు బయటికి చెప్పలేదు. అనుష్క ఎక్కడని నవీన్ పోలిశెట్టిని అడిగినప్పుడు అవుట్ అఫ్ స్టేషనని చెప్పడం తప్పించి క్లారిటీగా సమాధానం ఇవ్వలేదు.
మొత్తానికి సక్సెస్ అనుష్కను కెమరా ముందుకి తెచ్చేసింది. ఇంత విజయాన్ని చేకూర్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె స్వయంగా ఇచ్చిన వీడియో బైట్ ని ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు. ఈ గురువారం కేవలం మహిళల కోసం ఉదయం స్పెషల్ షోలు, ఉచిత ప్రదర్శనలు చేయబోతున్న శుభవార్తను కూడా ఆమెతోనే చెప్పించారు. ప్రభాస్ తో వరసగా హిట్లు లేకపోయినా యువి బ్యానర్ కి అనుష్కతో మిర్చి, భాగమతి, ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రూపంలో హ్యాట్రిక్ దక్కింది. ఆ ముచ్చటనే ప్రత్యేకంగా పోస్టర్లలో వేసుకుని మరీ పబ్లిసిటీ చేయడం గమనించాం.
మరి ఇంత గొప్ప ఫలితం దక్కింది కాబట్టి ఏదైనా సక్సెస్ ఈవెంట్ లాంటిది పెట్టి అనుష్కని తమ ముందు తీసుకురావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ తను అందుబాటులో లేదు కాబట్టి ఇది ఎంతమేరకు సాధ్యమయ్యేది మాత్రం చెప్పలేం. నవీన్ మాత్రం ఇండియాకు తిరిగి రావడం ఆలస్యం హైదరాబాద్ తో మొదలుపెట్టి కీలక కేంద్రాల్లో విజయ యాత్ర చేయబోతున్నాడు. వినాయక చవితి పండక్కు మార్క్ ఆంటోనీ తప్ప పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇంకో వీక్ వసూళ్లు రాబట్టుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం మిస్ చేసుకునేందుకు యువి టీమ్ సిద్ధంగా లేదు. మంచిదే.
This post was last modified on September 12, 2023 4:01 pm
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు…
అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ,…
"నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చచ్చిన రోజు``- అని వైసీపీ రెబల్ ఎంపీ, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణరాజు…
మాములుగా కొత్త సినిమా ఏదైనా థియేటర్లో లేదా ఓటిటిలో నిర్మాత నిర్ణయాన్ని బట్టి రావడం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ సోషల్…
ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం…
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్…