కుర్ర హీరో కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28 నుంచి తప్పుకుంది. సలార్ ఆ డేట్ వదులుకున్న వెంటనే కర్చీఫ్ వేసేసి పోస్టర్ కూడా రిలీజ్ చేసిన టీమ్ ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనూ అదే తేదీని నొక్కి వక్కాణించి చెప్పింది. అయితే ప్రాక్టికల్ గా అలోచించి పోటీలో నలిగిపోవడం కంటే తెలివిగా తప్పుకుని సేఫ్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం బెటరని నిర్ణయం మార్చుకుంది. అక్టోబర్ 6కి షిఫ్ట్ అయిపోయింది. వినాయక చవితి పండగ రేస్ నుంచి స్కంద, చంద్రముఖి 2 ఒకేసారి తప్పుకుని నెలాఖరుకి వెళ్లిపోవడంతో రూల్స్ రంజన్ కి ఇబ్బంది వచ్చి పడింది.
మాస్ సెంటర్స్ లో థియేటర్లు ప్లస్ మాస్ ఆడియన్స్ పరంగా ఆ రెండు సులభంగా పై చేయి సాధిస్తాయి. అలాంటప్పుడు రూల్స్ రంజన్ మీద అంతగా ఫోకస్ రాదు. కిరణ్ అబ్బవరం మార్కెట్ అసలే రిస్క్ లో ఉంది. మీటర్ బాలేదని టాక్ రావడానికి ముందే కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడింది. సో పబ్లిక్ టాక్ తనకు యునానిమస్ గా రావడం చాలా ముఖ్యం. అలా కాకుండా స్కంద, చంద్రముఖి 2 లాంటి మాస్ బొమ్మల మధ్య దిగితే అర్థం లేని రిస్క్ అయిపోతుంది. వాటిలో దేనికి పాజిటివ్ టాక్ వచ్చినా సరే జనాలను కిరణ్ వైపు వచ్చేలా చేయడం మేకర్స్ కి సవాల్ గా మారుతుంది.
వీటికి తోడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1ని నిర్మాత మిర్యాల రవీంద్రారెడ్డి భారీ ఎత్తున 29న రిలీజ్ చేస్తున్నారు. స్క్రీన్ల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. సో సేఫ్ గేమ్ అంటే ఆ వారాన్ని పై మూడింటికి వదిలేసి తప్పుకోవడమే. అయితే రూల్స్ రంజన్ కి పోటీ పూర్తిగా తప్పలేదు. సుధీర్ బాబు మామా మశ్చీంద్ర ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. సితార సంస్థ నిర్మించిన మ్యాడ్ ని అదే తేదీకి వదిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినా సరే మొదటి డేట్ తో పోల్చుకుంటే ఇక్కడ రిస్క్ చాలా తగ్గినట్టే. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన రూల్స్ రంజన్ లో నేహా శెట్టి గ్లామర్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తోంది.
This post was last modified on September 12, 2023 11:28 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…