వచ్చే ఏడాది వేసవికి ముందుగా కర్చీఫ్ వేసిన సినిమా దేవర. ఈ సినిమా షూట్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు. 2024 ఏప్రిల్ 5కు ఈ సినిమా షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఆ డేట్ టార్గెట్ పెట్టుకుని పక్కాగా ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసుకుని.. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది టీం.
ఐతే ఈ సినిమాకు ఓ భారీ పాన్ ఇండియా సినిమా ముప్పుగా మారుతుందేమో అన్న టెన్షన్ నడిచింది కొన్నాళ్లుగా. ఆ చిత్రమే.. పుష్ప-2. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో అనూహ్య విజయం సాధించడంతో సీక్వెల్పై హైప్ పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవలే టీంకు రెండు జాతీయ అవార్డులు రావడంతో హైప్ ఇంకా పెరిగింది.
పుష్ప-2 మార్చి 22న వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది కొన్ని రోజులుగా. అంటే దేవరకు రెండు వారాల ముందు పుష్ప-2 అంటే ఆ చిత్రానికి ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా దేవరను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పుష్ప-2 ధాటిని తట్టుకోవడం అంత తేలిక కాదు. హిందీలో ఈ సినిమాకు ఉన్న బజ్ ప్రకారం చూస్తే కొన్ని వారాల పాటు బాగా ఆడే అవకాశం ఉంది.
మార్చి 22న కాకపోయినా.. ఏప్రిల్లో పుష్ప-2 వచ్చినా ఇబ్బందే. అందుకే ఈ సినిమా డేట్ విషయంలో దేవర టీం ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ వాళ్ల టెన్షన్ తీర్చేస్తూ సినిమాను ఆగస్టు 15కు షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం తెలుగులో మార్చిలో కానీ, ఏప్రిల్లో కానీ మరే భారీ చిత్రమూ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాజెక్ట్-కే సెకండాఫ్కు వెళ్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. వస్తే పవన్ సినిమా ఓజీ వేసవిలో రావచ్చు. కానీ దేవరకు క్లాష్ అయితే ఉండకపోవచ్చంటున్నారు.
This post was last modified on September 12, 2023 9:25 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…