వచ్చే ఏడాది వేసవికి ముందుగా కర్చీఫ్ వేసిన సినిమా దేవర. ఈ సినిమా షూట్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు. 2024 ఏప్రిల్ 5కు ఈ సినిమా షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఆ డేట్ టార్గెట్ పెట్టుకుని పక్కాగా ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసుకుని.. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది టీం.
ఐతే ఈ సినిమాకు ఓ భారీ పాన్ ఇండియా సినిమా ముప్పుగా మారుతుందేమో అన్న టెన్షన్ నడిచింది కొన్నాళ్లుగా. ఆ చిత్రమే.. పుష్ప-2. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో అనూహ్య విజయం సాధించడంతో సీక్వెల్పై హైప్ పెరిగిపోయింది. దీనికి తోడు ఇటీవలే టీంకు రెండు జాతీయ అవార్డులు రావడంతో హైప్ ఇంకా పెరిగింది.
పుష్ప-2 మార్చి 22న వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది కొన్ని రోజులుగా. అంటే దేవరకు రెండు వారాల ముందు పుష్ప-2 అంటే ఆ చిత్రానికి ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా దేవరను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పుష్ప-2 ధాటిని తట్టుకోవడం అంత తేలిక కాదు. హిందీలో ఈ సినిమాకు ఉన్న బజ్ ప్రకారం చూస్తే కొన్ని వారాల పాటు బాగా ఆడే అవకాశం ఉంది.
మార్చి 22న కాకపోయినా.. ఏప్రిల్లో పుష్ప-2 వచ్చినా ఇబ్బందే. అందుకే ఈ సినిమా డేట్ విషయంలో దేవర టీం ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ వాళ్ల టెన్షన్ తీర్చేస్తూ సినిమాను ఆగస్టు 15కు షెడ్యూల్ చేశారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం తెలుగులో మార్చిలో కానీ, ఏప్రిల్లో కానీ మరే భారీ చిత్రమూ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాజెక్ట్-కే సెకండాఫ్కు వెళ్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. వస్తే పవన్ సినిమా ఓజీ వేసవిలో రావచ్చు. కానీ దేవరకు క్లాష్ అయితే ఉండకపోవచ్చంటున్నారు.
This post was last modified on September 12, 2023 9:25 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…