ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల లిస్టు తీస్తే.. అందులో ముందుగా రాజమౌళి పేరుంటుంది. రెండు దశాబ్దాల కెరీర్లో రాజమౌళికి అపజయం అన్నదే లేదు. ఆయన తర్వాత వరుసగా బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అంటే.. అట్లీ అనే చెప్పాలి. తొలి సినిమా ‘రాజా రాణి’తో మొదలుపెడితే.. ‘తెరి’, ‘మెర్శల్’; ‘బిగిల్’ ఇలా తమిళంలో వరుసగా బ్లాక్బస్టర్లు ఇచ్చాడతను.
ఇప్పుడు ‘జవాన్’ సైతం పెద్ద హిట్ అయింది. అట్లీ ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ రావడం.. రొటీన్గా ఉందనడం.. వేరే సినిమాలతో పోలికలు పెట్టడం మామూలే. కానీ ఈ కామెంట్లన్నింటినీ దాటుకుని తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకోవడమూ మామూలే. ‘జవాన్’ విషయంలోనూ అదే జరిగింది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లతో ఆల్రెడీ బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుంది ‘జవాన్’.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో సినిమా చేసి అక్కడా ఘనవిజయాన్నందుకోవడంతో అట్లీ డిమాండ్ మరింత పెరిగిపోయింది. దీంతో తన తర్వాతి సినిమా మీద అందరి దృష్టీ నిలిచింది. వేర్వేరు ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్లు తనతో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నారు. తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లతో ఇంతకుముందే అట్లీ సంప్రదింపులు జరిపాడు.
తమిళంలో విజయ్తో మళ్లీ ఇంకో సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరుగుతోంది. ‘జవాన్’తో హీరోగా, నిర్మాతగా కోరుకున్నదానికంటే పెద్ద హిట్ కొట్టిన షారుఖ్ సైతం.. అట్లీతో ఇంకో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ‘జవాన్’ సక్సెస్ చూసి బాలీవుడ్లో వేరే స్టార్లు కూడా తనకోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇలా అట్లీకి డిమాండ్ అయితే మామూలుగా లేదు. ఇన్ని ఆప్షన్ల నుంచి అట్లీ దేన్ని ఎంచుకుంటాడన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అతను ఓ తెలుగు స్టార్తో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.
This post was last modified on September 11, 2023 8:36 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…