కన్నడ సినిమా ఈ మధ్య చాలా మారింది. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్’ లాంటి చిత్రాలు ఆ పరిశ్రమ స్థాయిని పెంచాయి. నవతరం దర్శకులు, నటులు శాండిల్వుడ్కు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే కన్నడలో రొడ్డ కొట్టుడు సినిమాలు రాజ్యమేలుతున్న 90వ దశకంలోనే వేరే ఇండస్ట్రీల వాళ్లందరూ ఆ పరిశ్రమ వైపు చూసేలా చేసిన వ్యక్తి ఉపేంద్ర.
ఓం, ఎ, ఉపేంద్ర లాంటి సినిమాలతో 90వ దశకంలో అతను మామూలు సంచలనం రేపలేదు. నటుడిగా కంటే దర్శకుడిగా అతను వేసిన ముద్ర బలమైంది. ఓం, ఉపేంద్ర సినిమాలతో అతను ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు కన్నడలో. ఈ చిత్రాలు వేరే ఇండస్ట్రీల్లోనూ అతడికి అభిమానులను సంపాదించిపెట్టాయి. ఐతే హీరోగా బిజీ అయ్యాక ఉపేంద్ర దర్శకుడిగా సినిమాలు ఆపేశాడు. గత రెండు దశాబ్దాల్లో ఉపేంద్ర నుంచి సూపర్, ఉపేంద్ర-2 మాత్రమే రిలీజయ్యాయి. వాటిలో ‘సూపర్’ బాగా ఆడినా.. ఉపేంద్ర-2 నిరాశపరిచింది.
‘ఉపేంద్ర-2’ తర్వాత ఎనిమిదేళ్ల పాటు దర్శకత్వానికి దూరంగా ఉన్న ఉప్పి.. ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ‘యుఐ’ పేరుతో ఉప్పి దాదా కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చడీచప్పుడు లేకుండా మొదలై.. చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి చిన్న ప్రోమో కూడా రిలీజ్ కాలేదు. ‘యుఐ’ టీజర్ లాంచ్ గురించి ఒక వెరైటీ వీడియోతో అప్డేట్ ఇచ్చింది ఉప్పి అండ్ టీం.
ఈ సినిమా టీజర్ కావాలంటూ ఉపేంద్ర ఇంటి ముందు అభిమానులు గొడవ చేయడం.. ఉపేంద్ర బయటికి వచ్చి నేరుగా బిగ్ స్క్రీన్ మీద తలెత్తి సినిమా చూడండి, మధ్యలో తలదించుకుని మొబైల్లో ప్రోమో చూడటం ఎందుకు అని అడగడం.. చివరికి అభిమానుల ఒత్తిడికి తలొగ్గి టీజర్ అప్డేట్ ఇవ్వడం.. ఇదంతా నిర్మాతలే ప్లాన్ చేసి అభిమానులతో గొడవ చేయించినట్లు చూపించడం.. ఇలా ఈ వీడియోలో ఉపేంద్ర మార్కు స్పష్టంగా కనిపించింది. ఉపేంద్ర సినిమా అంటేనే ఏదో ఒక వెరైటీ ఉంటుంది. ఈ టీజర్ అప్డేట్తో ఆ విషయం మరోసారి రుజువైంది. మరి చాలా గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేస్తున్న ఉప్పి.. ప్రేక్షకులు ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on September 12, 2023 2:56 pm
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్నా తెలుగు…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…