ఎంత బ్లాక్ బస్టరైనా సరే ప్రతి సినిమాను జనాలందరూ థియేటర్లోనే చూస్తారన్న గ్యారెంటీ లేదు. రకరకాల కారణాల వల్ల ఓటిటి లేదా శాటిలైట్ లో వచ్చినప్పుడు చూద్దాం లెమ్మని ఎదురు చూసేవాళ్ళు లక్షల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటారు. అందుకే డిజిటల్ సంస్థలు భారీగా కోట్లు కుమ్మరించి మరీ హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీ పడతాయి. అయితే ఇక్కడ కూడా అదే స్పందన వస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. గత రెండు నెలల్లో సెన్సేషనల్ హిట్ మూవీస్ గా నిర్మాతలను లాభాల్లో ముంచెత్తిన బేబీ, జైలర్ గురించే ఈ టాపిక్.
మొన్నటికి మొన్న జైలర్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. దీన్ని మొదటిసారి టీవీలో చూసిన సగటు ప్రేక్షకులు దీంట్లో అంతగా ఏముందని ఆరు వందల కోట్లు వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కామెడీ, మన్యవర్ షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు ఉండే తలపాగాని కిరీటంగా బిల్డప్ ఇవ్వడం, ఇంటర్వెల్ దాకా హత్యలు తప్ప రజని ఇంకేం చేయకపోవడం లాంటి అంశాల పట్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అనిరుద్ రవిచందర్ బీజిఎంని డాల్బీ అట్మోస్ లో ఆస్వాదిస్తేనే జైలర్ ని ఎంజాయ్ చేయగలం. కానీ ఇంట్లో ఆ ఛాన్స్ ఎక్కడిది.
ఇక బేబీ సైతం ఆహాలో వచ్చాక పోస్ట్ మార్టంకు గురవుతోంది. ఇంత అపరిపక్వ ప్రేమకథకి తొంబై కోట్ల గ్రాస్ ఇచ్చారా అంటూ నెటిజెన్లలు కొందరు షాకింగ్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తున్నారు. గతంలో ఇదే తరహాలో జాతరత్నాలు, ఉప్పెన, వాల్తేరు వీరయ్య లాంటి వాటికి కూడా ఈ విమర్శల పర్వం తప్పలేదు. వెండితెరపై మంచి సౌండ్ తో దక్కే ఎక్స్ పీరియన్స్ ని సోఫాలో కూర్చుని ఫార్వార్డ్ చేసుకుంటూ చూస్తే ఖచ్చితంగా పొందలేం. అందుకే అభిప్రాయాల్లో ఇంత వైరుధ్యం కనిపిస్తోంది. రేపు జవాన్ కూడా దీనికి మినహాయింపుగా ఉండకపోవచ్చు. అందుకే బిగ్ స్క్రీన్ ఈజ్ బెస్ట్ అని ఊరికే అనలేదు.
This post was last modified on September 10, 2023 7:22 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…